📄 ePaper
Wednesday, June 10, 2026
ADS
Homepatancheru political newsరోడ్డు విస్తరణ పనులకు అడ్డంకులు సృష్టించకండి-స్థానికుల ఆందోళన.

రోడ్డు విస్తరణ పనులకు అడ్డంకులు సృష్టించకండి-స్థానికుల ఆందోళన.

📰 Generate e-Paper Clip

రామచంద్రాపురం,జూన్,9,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.ప్రజల రాకపోకల సౌకర్యార్థం, ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో చేపట్టిన రామచంద్రాపురం బస్ డిపో – బీరంగూడ ప్రధాన రహదారి విస్తరణ పనులకు ‘భెల్’ ఉన్నతాధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనం కోసం సాగుతున్న పనులను నిలిపివేయడం ఏమాత్రపు సమంజసం కాదని వారు మండిపడ్డారు.గత అరవై ఏళ్లుగా వినియోగంలో ఉన్న ఈ రహదారిని విస్తరించేందుకు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పనులు ప్రారంభమయ్యాయి. కాలువ పక్కన కొనసాగుతున్న ఈ పనులను భెల్ అధికారులు అడ్డుకోవడంతో స్థానికులు నిరసనకు దిగారు.స్థానికుల గోడు.. అధికారుల తీరుపై మండిపాటు:ఈ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అనేక ప్రాంతాల ప్రజలు ఈ మార్గాన్నే నమ్ముకుని ప్రయాణిస్తుంటారు. ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించే ఉద్దేశంతో చేపట్టిన ఈ రహదారి విస్తరణ పనులను ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.మద్దతు తెలిపిన నాయకులు:ఈ నిరసన కార్యక్రమంలో బృందావన్ కాలనీ అధ్యక్షుడు యాదగిరి గౌడ్, నాయకులు యూనుస్, షౌకత్ అలీతో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు. రహదారి విస్తరణకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, అధికారులు పట్టువిడుపు ధోరణితో వ్యవహరించి అభివృద్ధి పనులకు సహకరించాలని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular