
అమీన్పూర్,జూలై,1,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని స్థానిక వ్యాపారులను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు.బుధవారం బీరంగూడ డివిజన్ పరిధిలోని కృష్ణారెడ్డి పేట, ఇక్రిశాట్ కాలనీ ప్రాంతాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘జెన్-జెడ్ బ్యాటరీ స్కూటీ’ షోరూం మరియు ‘పులావ్ హట్’ హోటళ్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ కలిసి ప్రారంభించారు.
పర్యావరణ హిత వాహనాలపై అవగాహన:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, “పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యావరణ పరిరక్షణ కోసం బ్యాటరీ వాహనాలను వాడటం శుభపరిణామం. కేంద్ర ప్రభుత్వం బ్యాటరీ వాహనాలపై అందిస్తున్న సబ్సిడీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. కొత్తగా ప్రారంభమైన ఈ బ్యాటరీ షోరూం అమీన్పూర్లో మంచి ఆదరణ పొందాలని, అలాగే పులావ్ హట్ హోటల్ నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు.
వ్యాపార అభివృద్ధికి సహకారం:

అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మరియు మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ మాట్లాడుతూ, వేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ ప్రాంతంలో ఇటువంటి ఆధునిక వ్యాపార సంస్థలు రావడం సంతోషకరమని, కొత్త సంస్థల పురోభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానంద్, మాజీ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు నందారం రమేష్ గౌడ్, కొల్లూరు గోపాల్, ఐలాపుర్ నరసింగరావు, మల్లేష్, యాజమాన్యం రమ్యరాజు, వివిధ పార్టీల నాయకులు, వ్యాపార ప్రముఖులు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


