📄 ePaper
Thursday, June 4, 2026
ADS
Home Blog

ఎం ఆర్ పి ఎస్ యువసేన అధ్యక్షులుగారావూరి రాజు మాదిగ.

0

గుంటూరు,జూన్,3,మెదక్ టుడే న్యూస్:గుంటూరు జిల్లా అంబేద్కర్ భవన్ లో జరిగినవంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎం ఆర్ పి ఎస్)వ్యవస్థాపక అధ్యక్షులు మన్యశ్రీ ఉసురు పార్టీ బ్రహ్మయ్య మాదిగ నేతృత్వంలో శ్రీ రావూరి రాజ్ మాదిగ ను రాష్ట్ర యువజన అధ్యక్షులుగా నియమిస్తూ, ప్రమాణ పత్రాన్ని జాతీయ, రాష్ట్ర, జిల్లాల నాయకులు సమక్షంలో నాయకునిగా నియామక పత్రం అందజేశారు.అనంతరం రావూరి రాజు మాట్లాడుతూ. నాపై నమ్మకంతో, ఎం ఆర్ పి ఎస్, యువసేన అధ్యక్షులుగా నియమించినందుకు, వారికి కృతజ్ఞతలు తెలుపుతూ,ఎల్లవేళలా అందరికీ తోడుంటూ. ప్రతి సమస్యపై పోరాడుతానని. పేర్కొన్నారు.

ఏడుపాయల్లో హరీష్ రావు జన్మదిన వేడుకలు.

0

పాపన్నపేట,జూన్,3,మెదక్ టుడే న్యూస్:అట్టహాసంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు
మాజీ మంత్రి, భారాస ట్రిపుల్ షూటర్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు బుధవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయం వద్ద నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజగోపురం వద్ద ఆయన కేక్ కట్ చేసి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంటారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ
కన్నీరు ఎక్కడ ఉంటే తన్నీరు అక్కడ ఉండి ప్రజల కన్నీరు తుడుస్తారని భారాస నియోజక వర్గ ఇన్ ఛార్జ్ కంటా రెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. తెలంగాణలో హరీష్ రావు ఓ బ్రాండ్ అని కొనియాడారు. హరీష్ రావు సూచనల మేరకు నియోజకవర్గంలో పార్టీని ముందుకు నడిపిస్తామని పేర్కొన్నారు. కెసిఆర్ నాయకత్వంలో హరీష్ రావు ఉద్యమ ఒక కెరటంగా తెలంగాణ సాధనలో ముఖ్యపాత్ర పోషించారన్నారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధిలో హరీష్ రావు పాత్ర వెలకట్టలేనిది అన్నారు. నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల కోసం పాటుపడే ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి హరీష్ రావు అని కొనియాడారు. హరీష్ రావు సంపూర్ణ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శనం చేయాలని అమ్మవారిని కోరుతున్నట్లు తెలిపారు. హరీష్ రావు సూచనల మేరకు మెదక్ నియోజకవర్గం అని టిఆర్ఎస్ కంచుకోటగా మారుస్తామని ఆయన తెలిపారు.కార్యక్రమంలో భారాస నాయకులు సోములు, బాలాగౌడ్, గురుమూర్తి గౌడ్, శ్రీనాథ్ , లింగా రెడ్డి, సర్పంచులు సురేష్, గంట రాణి సుధీర్, నాయకులు సంగ పవిత్ర దుర్గయ్య, కాశీనాథ్ రావు, శ్రీనివాస్, కొండల్ రెడ్డి, చంద్రమోహన్ గౌడ్ , జగదీష్ చారి, కిరణ్ గౌడ్, నవీన్, సాయి , దినేష్ గౌడ్ పాల్గొన్నారు.

ప్రజాసేవలో హరీష్ రావు గారిది గొప్ప స్ఫూర్తి: కాట సునీత రాజేష్ గౌడ్

0

అమీన్ పూర్, జూన్ 03,

(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి 

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాట సునీత రాజేష్ గౌడ్ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, కేక్ కట్ చేయించి ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కాట సునీత రాజేష్ గౌడ్ హరీష్ రావు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ…

“నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న హరీష్ అన్న గారు మా అందరికీ గొప్ప స్ఫూర్తి. కష్టకాలంలో పార్టీని నిలబెట్టడంలో, కార్యకర్తలకు అండగా నిలవడంలో ఆయన చూపే చొరవ అభినందనీయం. తెలంగాణ అభివృద్ధిలో, ప్రత్యేకించి నీటి పారుదల రంగంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఆయన ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు వర్ధిల్లుతూ ప్రజాసేవలో మరిన్ని ఉన్నత పదవులను అధిష్టించి, మమ్మల్ని మరింత ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,” అని పేర్కొన్నారు.హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేయడం తమకు గర్వకారణమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతం కోసం తామంతా కృషి చేస్తామని సునీత రాజేష్ గౌడ్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు

.

ఆవిర్భావ వేడుకల్లో కాట సునీత రాజేష్ గౌడ్: తెలంగాణ ఆత్మగౌరవం-అమరవీరుల త్యాగాల పునాదే మన ప్రగతి!

0

అమీన్‌పూర్,జూన్,2,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమీన్‌పూర్ లోని కె.ఎస్.ఆర్.జి బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ నాయకులు కాట సునీత రాజేష్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ ఆవిర్భావ ఘట్టాన్ని, ఆనాటి పోరాట స్ఫూర్తిని గుర్తు చేస్తూ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు.తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి: “ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో, అనేక సవాళ్లను అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని సుస్థిరమైన అభివృద్ధి పథంలో నిలబెట్టడంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాత్ర చిరస్మరణీయం. ఆయన దూరదృష్టితో చేపట్టిన సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన నేడు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాయి.తెలంగాణ ఆత్మగౌరవం: “నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయిన మన రాష్ట్రం, నేడు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. మన సంస్కృతి, భాష, మన గొప్పతనం ప్రపంచ వేదికపై వెలుగుతోంది.అమరవీరుల త్యాగనిరతి: “తెలంగాణ సాధన కోసం ఎందరో అమరవీరులు తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగఫలం వల్లే నేడు మనం ఈ స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నాం. వారి ఆశయాలను గౌరవించడం మనందరి బాధ్యత.ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు, పార్టీ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. చివరగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి అమరులైన వారి చిత్రపటాలకు కాట సునీత రాజేష్ గౌడ్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షల సాకారం-ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

0

పటాన్ చెరు,జూన్,2,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన యోధులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు గారి నాయకత్వంలో 14 ఏళ్ల పాటు సాగిన మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలను సాకారం చేసింది. ఆనాటి పోరాట స్ఫూర్తితోనే నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములమవుతున్నాం”అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు, పటాన్చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాలలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

దశాబ్ద కాలంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాం-నందారం నరసింహ గౌడ్.

0

అమీన్పూర్,జూన్,2,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమీన్పూర్ జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ నందారం నరసింహ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.కెసిఆర్ దార్శనికతతోనే ప్రగతి సాధ్యమైంది:“నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారి నాయకత్వంలో, గత దశాబ్ద కాలంలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఆనాడు కరవు, కరువు కాటకాలతో అల్లాడిన ప్రాంతం, నేడు కేసీఆర్ గారి కృషితో దేశానికే అన్నపూర్ణగా, అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. పల్లె ప్రగతి నుండి పట్టణ ప్రగతి వరకు ప్రతి అడుగులోనూ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా పరిపాలన సాగించాం” అని ఆయన పేర్కొన్నారు.అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు:ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సాగిన మన పాలనను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అర్థంలేని విమర్శలు చేస్తున్నాయి. అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు గతంలో మేము చేసిన కృషి నేడు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోంది” అని నందారం నరసింహ గౌడ్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ కౌన్సిలర్స్ కృష్ణ, కొల్లూరు మల్లేష్, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, ఉపేందర్ రెడ్డి, జగదీష్, కొల్లూరు గోపాల్ , ప్రమోదర్ రెడ్డి, ఏనుగు శ్రీనివాస్ రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, దాసు యాదవ్,కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కలిసి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు.

భారత సైన్యానికిఎంపికైన సోమ్లాతండా వాసి.

0

చేగుంట,జూన్,1,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల సోమ్లా తాండ గ్రామం నుండి గుగ్లోత్ లోక్య కుమారుడు శ్రీను భారత సైనిక దళానికి ఎంపిక అయినా సందర్బంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది, శ్రీను కుటుంబంలో సంతోష వాతావరం నెలకొంది, సైనికి దళనికి ఎంప్పికైనందుకు గ్రామ సర్పంచ్ మాలోత్ ప్రవళిక రమేష్ పిలుపుమేరకు స్థానిక ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి, వచ్చి శ్రీను ని శాలువాతో సన్మానం చేసారు ఎస్ ఐ మాట్లాడుతూ దేశ సేవకోసం ఎందరో ఎదురు చుసిన ఆ అదృష్టం కొందరికి వారిస్తుందని పేర్కొన్నారు, ఈ సందర్బంగా స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ మా గ్రామం నుండి దేశ సైనిక దళానికి ఎప్పికైనందుకు తాను ఎంత సంతోషిస్తున్నాని పేర్కొన్నారు ఇలాంటి గొప్ప స్థాయిలో తమా గ్రామం నుండి యువత ఉనందున మా గ్రామం నుండి శ్రీను కి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం పాల్గొన్నారు ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి స్థానిక సర్పంచ్ మాలోత్ ప్రవళిక రమేష్ ఉప సర్పంచ్ రవీందర్ వార్డ్ సభ్యులు గ్రామస్తులు రాజు తదితరులు పాల్గొన్నారు.

చేగుంట పంచాయతీ కార్యాలయంలో వైభవంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు,

0

తెలంగాణ అభివృద్ధి పథంలో సాగాలి ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ

దివంగత వార్డ్ మెంబర్ సాయిబాబాకు పాలకవర్గం శ్రద్ధాంజలి

చేగుంట,జూన్,2,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ జాతీయ జెండాను ఆవిష్కరించి, అమరవీరుల త్యాగాల ఫలంగా సిద్ధించిన స్వరాష్ట్ర ప్రజలందరికీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ, బోనాలు వంటి పండుగలను మనం ఘనంగా జరుపుకుంటున్నామని, భవిష్యత్తులో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం ఉపసర్పంచ్ మొహమ్మద్ రఫీ మాట్లాడుతూ సమైక్యాంధ్రా పాలనలో కరెంట్, సాగునీరు లేక అల్లాడిన తెలంగాణ, కేసీఆర్ ఉద్యమ పోరాటంతో మనకు రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ చొరవతో నేడు 24 గంటల విద్యుత్, పుష్కలమైన నీటితో ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం అప్పుల ముప్పు నుండి తప్పించుకుని, నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ లాభదాయకమైన తెలంగాణగా రూపాంతరం చెందాలని ఆయన ఆకాంక్షించారు.ఈ వేడుకల మధ్యలోనే, ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందిన రెండవ వార్డు మెంబర్ సాయిబాబాకు చేగుంట పాలకవర్గం, సిబ్బంది కలిసి రెండు నిమిషాల పాటు నిశ్శబ్దంగా మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు. ఎందరో పోరాట వీరుల త్యాగాలను స్మరిస్తూ సాగిన ఈ ఉత్సవ మరియు శ్రద్ధాంజలి కార్యక్రమంలో చేగుంట పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, సిబ్బంది లింగం, సత్యనారాయణ, సాదుల్లా, శ్రీనివాస్, వివిధ వార్డుల సభ్యులు పాల్గొన్నారు.

చేగుంటలో ఇండోర్ బ్యాడ్‌మింటన్ స్టేడియం ఏర్పాటుకు స్థల సేకరణ.

0

చేగుంట,జూన్,2,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో ఇండోర్ బ్యాడ్‌మింటన్ స్టేడియం నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ చేగుంట బ్యాడ్‌మింటన్ క్లబ్ ప్రతినిధులు ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీకి ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.క్రీడాకారుల సౌకర్యార్థం చేగుంటలో ఇండోర్ బ్యాడ్‌మింటన్ స్టేడియం ఏర్పాటుకు తమ పాలకవర్గం తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ఇక్కడి యువతలో మంచి క్రీడా నైపుణ్యాలు ఉన్నాయని కొనియాడారు. క్లబ్ సభ్యులు కోరిన విధంగా స్టేడియం నిర్మాణానికి 8 గుంటల భూమిని కేటాయించేందుకు గానూ, సర్పంచ్‌తో పాటు వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి (ఈవో)తో సమావేశమై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. యువతకు క్రీడా రంగానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను తమ పాలకవర్గం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్‌మింటన్ క్లబ్ ప్రెసిడెంట్ పి. విష్ణు కుమార్, మాజీ వార్డ్ మెంబర్ ఎర్ర యాదగిరి మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

చేగుంట తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.

0
Oplus_16908288

చేగుంట,జూన్,2,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చేగుంట తహసిల్దార్ బాలలక్ష్మి మువ్వెన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం అధికారులందరూ జెండా వందనం సమర్పించి, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాల పునాదులపై సిద్ధించిన స్వరాష్ట్రంలో ప్రజలందరికీ సేవ చేయడం గర్వకారణంగా ఉందన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం మండల ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందిస్తామని ఆమె స్పష్టం చేశారు.ఈ గర్వకారణమైన వేడుకల్లో చేగుంట మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) చిన్నారెడ్డి, మండల విద్యాధికారి (ఎంఈఓ) నీరజలతో పాటు తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ ఆవిర్భావ సంబరాలను విజయవంతం చేశారు.