📄 ePaper
Friday, July 31, 2026
ADS
Home Blog

గ్రామపంచాయతీ నిధులతో బోర్ల ఏర్పాటు పనులకు శ్రీకారం. సర్పంచ్ పావని నరేంద్ర గౌడ్.

0

ప్రజల దాహం తీర్చడమే ధ్యేయం-పాపన్నపేటలో మంచినీటి విప్లవానికి శ్రీకారం!

ప్రతి వార్డుకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం.

పాపన్నపేట,జూలై,31, మెదక్ టుడే న్యూస్:ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించి గ్రామంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో పాపన్నపేట గ్రామపంచాయతీ మరో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామపంచాయతీ నిధులతో సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో, వార్డు సభ్యుల సహకారంతో శుక్రవారం వార్డుల్లో మంచినీటి బోర్ల ఏర్పాటు పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.ప్రస్తుతం పనులు జరుగుతున్న వార్డులతో పాటు,మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా దశలవారీగా బోర్ల ఏర్పాటు చేపట్టి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు.అందేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ పావనినరేందర్ గౌడ్ తెలిపారు.ప్రజా సంక్షేమమే మా ప్రథమ కర్తవ్యం..ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు అందే వరకు మా కృషి నిరంతరం కొనసాగుతుంది”అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్,వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, యువకులు,గ్రామ పెద్దలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కేజివిల్- వాహనాల రాకపోకలతో అధ్వానంగా మారిన వెంకటాపూర్ గ్రామ రోడ్లు.. పట్టించుకోని అధికారులు

0

వెంకటాపూర్: వెంకటాపూర్ గ్రామంలోని అంతర్గత రోడ్లు రోజురోజుకు అధ్వానంగా మారుతూ గ్రామ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో నడిచి వెళ్లడమే కాకుండా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించడం కూడా ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా వర్షాలు కురిసిన సమయంలో గుంతల్లో నీరు నిలిచిపోవడంతో రోడ్డు పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది.గ్రామస్థుల ఆరోపణల ప్రకారం, గ్రామ పరిసరాల్లోని కేజ్ విల్లాకు సంబంధించిన భారీ వాహనాల నిరంతర రాకపోకల వల్ల రోడ్లు వేగంగా దెబ్బతిన్నాయని వారు చెబుతున్నారు. ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోడ్లు దెబ్బతినడం వల్ల అత్యవసర సమయాల్లో వాహనాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, గ్రామంలోకి వచ్చే అతిథులు కూడా ఇబ్బందిపడుతున్నారని స్థానికులు తెలిపారు. రోడ్ల మరమ్మతులు చేపట్టడంతో పాటు, భారీ వాహనాల రాకపోకల వల్ల నష్టం జరుగుతున్నట్లయితే సంబంధిత అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

నార్సింగిలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కేంద్రం ప్రారంభం.

0

నార్సింగిలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కేంద్రం ప్రారంభం.

మెదక్ టుడే:మెదక్ జిల్లా న్యూస్,జూలై,28,(ప్రతినిధి పి.దుర్గేష్ గౌడ్)పాపన్నపేటమండలంగ్రామంలో మంగళవారంఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. కేంద్రం ద్వారా నగదు జమ, నగదు ఉపసంహరణతో పాటు పలు డిజిటల్ ఆర్థిక సేవలు అందుబాటులోకి రానున్నాయి. స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

వన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు.

0

అమ్మవారికి ఘనంగా ప్రత్యేక పూజల
(మెదక్ టుడే న్యూస్:జూలై,28,మెదక్ జిల్లా ప్రతినిధి పి.దుర్గేష్ గౌడ్)
పాపన్నపేటమండలం ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో ఈరోజు ఉదయం అమ్మవారికి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ చేసి పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం సమయం కావడంతో భక్తులు స్వల్ప సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనంతో భక్తులు

దంచికొట్టిన వర్షం..పరుగులు తీస్తూతున్న వాగులు.

0

దంచికొట్టిన వర్షం.. పరుగులు తీస్తూతున్న వాగులు.

(మెదక్ టుడే న్యూస్:జూలై,28,మెదక్ జిల్లా రిపోర్టార్ పి దుర్గేష్ గౌడ్)
పాపన్నపేట న్యూస్ :-పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగుల్లో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాగులు దాటే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు గ్రామాల్లో ప్రజలు వర్షపు పరిస్థితులను ఆసక్తిగా గమనిస్తున్నారు.

వనదుర్గమ్మ సన్నిధిలో జిల్లా విద్యాధికారి.

0

పాపన్నపేట,జూలై,25,(మెదక్ టుడే న్యూస్)మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు శనివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆయన జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా అమ్మవారిని దర్శించుకున్నారు, ఈ సందర్భంగా ఆలయ పండితులు శంకర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు, డిఇఓ రాజుకు వేద పండితులు ఏడుపాయల ఆలయ ప్రశస్తిని వివరించారు. ఆయన వెంటఅక్షయ పాత్ర మెదక్ ప్లాంట్ మేనేజర్ త్రిపాఠి ,పవన్ కుమార్, రాకేష్ కుమార్ ,భట్టు నాగరాజు, వికాస్ రాజు, బత్తిని రాజు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ కార్యాలయంలో ఉద్యోగుల ఇష్టారాజ్యం..?సెల్‌ఫోన్లలో మునిగితేలుతున్న సిబ్బంది..

0
Oplus_16908288

ప్రజల ప్రశ్నలకు సమాధానమే లేదు..!
పాపన్నపేట ఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్యాలయ పనితీరుపై తీవ్ర విమర్శలు..

పాపన్నపేట,జూలై 24 (మెదక్ టుడే న్యూస్):పాపన్నపేట మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) కార్యాలయంలో ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందనే ఆరోపణలువెల్లువెత్తుతున్నాయి.కార్యాలయానికి వచ్చే ప్రజలను పట్టించుకోకుండా కొందరు ఉద్యోగులు సెల్‌ఫోన్లలో వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారని మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉపాధి హామీ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.శుక్రవారం మధ్యాహ్నం 1:20 గంటలకు కార్యాలయాన్ని సందర్శించిన విలేకరులకు కూడా ఇదే పరిస్థితి కనిపించింది.తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన కూలీలకు సరైన సమాచారం ఇవ్వకుండా, ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ప్రత్యక్షంగా గమనించారు.ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయంలోసిబ్బంది,బాధ్యతారాహిత్యంగావ్యవహరిస్తుండటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తీరుతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఈ విషయమై స్పందన కోసం పాపన్నపేట మండల ఏపీఓ బి. మైపాల్ రెడ్డిని ఫోన్ ద్వారా సంప్రదించేందుకు విలేకరులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఆయన స్పందించలేదు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఉపాధి హామీ కార్యాలయ పనితీరుపై విచారణ జరిపి, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఉద్యోగులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి పద్మశాలి సంఘం.11 వేల ఆర్థిక సాయం.

0

పాపన్నపేట,జూలై,23,(మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పాపన్నపేటకు చెందిన మరెల్లి రాములు కుటుంబానికి స్థానిక పద్మశాలి సంఘం సభ్యులు మానవత్వాన్ని చాటుతూ రూ.11,000 ఆర్థిక సహాయం అందజేశారు.మరెల్లి రాములు కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండటంతో, పద్మశాలి సంఘం సభ్యులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి గురువారం ఆయన కుటుంబ సభ్యులకు నగదు అందజేశారు.ఈ సందర్భంగా రాములు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కష్టకాలంలో అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సంఘం నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాపన్నపేట చేనేత సంఘం అధ్యక్షుడు కొడుపాక విఠల్, మాజీ అధ్యక్షుడు పడిగే కృష్ణ, పల్లె సంగమేశ్వర్, కొడుపాక శివశంకర్, తూర్పు రాజు,తూర్పు రాజారాం, కొడుపాక దుర్గేశ్వర్, వళ్ళందేశి శ్రీనివాస్,తూర్పు రమేష్, పోల్ శ్రీనివాస్, వళ్ళందేశి ఉదయ్, కళ్లేటి వెంకట్, అచుకట్ల మహేష్, కొడుపాక పూర్ణచందర్, రాజారాం చంద్రం, మదనాల అరవింద్, చామంతుల నాగరాజు, వళ్ళందేశి రాజు, కొడుపాక ప్రసాద్, ఊరటి లక్ష్మి, కొడుపాక ఉమామహేశ్వర, కొడుపాక వెంకటేశం, కొడుపాక యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాపురం నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

0
Oplus_16908288

పటాన్ చెరు,జులై,23,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాపురం నరసింహారెడ్డి, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముత్తంగి విభాగం పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, పార్టీ కార్యక్రమాలు, ప్రజల సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. అలాగే, ముత్తంగి విభాగంలో శాపురం నరసింహారెడ్డి చేపడుతున్న ప్రజాసేవా కార్యక్రమాల గురించి వివరించారు. ముఖ్యంగా, పారిశుద్ధ్య కార్మికుల సన్మానం, ప్రత్యేక పనుల పర్యవేక్షణ, ప్రజలతో ప్రత్యక్ష సమావేశాలు, సామాజిక సేవా కార్యక్రమాలు మరియు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం కోసం తీసుకుంటున్న చర్యలను నీలం మధు ముదిరాజ్‌కు తెలియజేశారు.
శాపురం నరసింహారెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను నీలం మధు ముదిరాజ్ అభినందించారు. ఇదే సేవా స్ఫూర్తితో ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండాలని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఆయనకు సూచించారు.

ముత్తంగి డివిజన్ కర్దనూర్ గ్రామంలో ప్రజలతో ముఖాముఖి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాపురం నరసింహారెడ్డి.

0

పటాన్‌చెరు,జూలై,23,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని ముత్తంగి డివిజన్ పరిధిలోని కర్దనూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాపురం నరసింహారెడ్డి గ్రామ ప్రజలతో ప్రత్యేక ముఖాముఖి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రత్యేక కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటరు జాబితాలో ప్రతి అర్హులైన వ్యక్తి పేరు సక్రమంగా నమోదై ఉండేలా తగు సూచనలు చేశారు. ఓటరు నమోదుకు కావలసిన ధృవపత్రాలు, దరఖాస్తు చేసుకునే విధానం మరియు ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను వివరించారు.అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు మరియు ప్రజలకు అందిస్తున్న వివిధ పథకాలపై చర్చించారు. గ్రామ ప్రజల సమస్యలను ఓపికగా విని, వాటి పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా శాపురం నరసింహారెడ్డి మాట్లాడుతూ, “ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, అభివృద్ధి మరియు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రతి గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో పార్టీని మరింత బలోపేతం చేస్తాం” అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.