దంచికొట్టిన వర్షం.. పరుగులు తీస్తూతున్న వాగులు.
(మెదక్ టుడే న్యూస్:జూలై,28,మెదక్ జిల్లా రిపోర్టార్ పి దుర్గేష్ గౌడ్)
పాపన్నపేట న్యూస్ :-పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగుల్లో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాగులు దాటే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు గ్రామాల్లో ప్రజలు వర్షపు పరిస్థితులను ఆసక్తిగా గమనిస్తున్నారు.

