📄 ePaper
Friday, July 31, 2026
ADS
HomeNewsవనదుర్గమ్మ సన్నిధిలో జిల్లా విద్యాధికారి.

వనదుర్గమ్మ సన్నిధిలో జిల్లా విద్యాధికారి.

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,జూలై,25,(మెదక్ టుడే న్యూస్)మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు శనివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆయన జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా అమ్మవారిని దర్శించుకున్నారు, ఈ సందర్భంగా ఆలయ పండితులు శంకర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు, డిఇఓ రాజుకు వేద పండితులు ఏడుపాయల ఆలయ ప్రశస్తిని వివరించారు. ఆయన వెంటఅక్షయ పాత్ర మెదక్ ప్లాంట్ మేనేజర్ త్రిపాఠి ,పవన్ కుమార్, రాకేష్ కుమార్ ,భట్టు నాగరాజు, వికాస్ రాజు, బత్తిని రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular