పాపన్నపేట,జూన్,2,(మెదక్ టుడే న్యూస్)తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుక పాపన్నపేట మండల వ్యాప్తంగా ఘనంగా జరిగింది. మంగళవారం పాపన్నపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పావని నరేందర్ గౌడ్,మండల వనరుల కేంద్రం వద్ద ఎంఈఓ ప్రతాప రెడ్డి,మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో విష్ణువర్ధన్,వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో శ్రీనివాస రాజు,ఎమ్మార్వో కార్యాలయం వద్ద తహశీల్దార్ సతీష్ కుమార్ మువ్వన్నెల జెండా ఎగురావేశారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలాధ్యక్షుడు నరేందర్ గౌడ్,భారాస పార్టీ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ గురుమూర్తి గౌడ్ జాతీయ పతికావిష్కరణ చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గునిశెట్టి మల్లేశం,పాపన్నపేట,కొత్తపల్లి ఉప సర్పంచులు సద్దాం హుస్సేన్,వాంకిడి రాము,వివిధ పార్టీ నాయకులు..కుమ్మరి జగన్,ఉప్పరి వెంకటేశం,ఆకుల శ్రీనివాస్,గౌస్,దోసని సంగమేశ్వర్ తదితరులు ఉన్నారు.
హైదరాబాద్,జూన్,2,(మెదక్ టుడే న్యూస్)తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామానికి తెరలేపుతూ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ఇకపై తెలంగాణలో జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, తనపై వస్తున్న విమర్శలు, బెదిరింపులు, తెలంగాణపై చేస్తున్న దుష్ప్రచారానికి ఘాటుగా బదులిచ్చారు. తెలంగాణ తనకు ఎంతో ఆత్మీయమైన నేల అని, ఈ ప్రాంతంపై తనకు ఎనలేని ప్రేమ ఉందని పేర్కొన్నారు. కొందరు రాజకీయ నాయకులు, విశ్లేషకులు ఉద్దేశపూర్వకంగా తనపై ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎన్నడూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించలేదని పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తీరును మాత్రమే ప్రశ్నించానని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పార్లమెంట్లో వ్యవహరించిన విధానాన్ని తప్పుపట్టానని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఎప్పుడూ గౌరవించానని, సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణ తన కల అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన యువత, అమరవీరుల త్యాగాలకు తనకు అపార గౌరవం ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కొందరు తనను తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలపైనా పవన్ తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్లో తాను చెరువు భూమిని ఆక్రమించానంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆ భూమిని పరిశీలించాలని సవాల్ విసిరారు. తాను భూమి ఆక్రమించినట్లు నిరూపితమైతే ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవచ్చని, తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని ప్రకటించారు. అధికార పదవుల కోసం రాజకీయాలు చేయడం తన లక్ష్యం కాదని, వ్యవస్థలో మార్పు తీసుకురావడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశ తనకు లేదని, ప్రజల సమస్యల పరిష్కారమే తన రాజకీయాల ఉద్దేశమని తెలిపారు. తెలంగాణలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని కార్యకర్తలు, నాయకులు ఎప్పటి నుంచో కోరుతున్నారని పవన్ తెలిపారు. అందుకే ఇకపై రాష్ట్రవ్యాప్తంగా స్వయంగా పర్యటించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని, ఎవరి బెదిరింపులకు భయపడబోదని హెచ్చరించారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై మాట్లాడతామని, అన్యాయాలను ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, ఎవరూ తమ ఇష్టానుసారం ఎవరికైనా ప్రవేశం నిరాకరించలేరని పేర్కొన్నారు. ప్రజా గాయకుడు గద్దర్తో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా పవన్ భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. గద్దర్ జీవించి ఉన్న సమయంలో ఆయనకు అవసరమైన సహాయం చేశానని, ఆయన తనను ఎంతో ఆప్యాయంగా చూసేవారని చెప్పారు. గద్దర్ బతికున్నప్పుడు పట్టించుకోని వారు ఇప్పుడు ఆయన పేరును రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం విచారకరమన్నారు. తనకు వామపక్షాలు, కుడిపక్షాలు అనే భావజాలాల కంటే మానవతా విలువలే ముఖ్యమని తెలిపారు. గద్దర్ చివరి రోజుల్లో కూడా యువత భవిష్యత్తుపై ఆలోచించారని, ఆ సందేశాన్ని సమాజానికి చేరవేయడం మన బాధ్యత అని అన్నారు. ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య కొందరు కావాలనే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. నాయకుల తప్పులను ప్రజలపై మోపడం సరికాదని, ప్రాంతీయ ద్వేషాలు దేశ సమగ్రతకు హానికరమని హెచ్చరించారు. తెలంగాణలో పరిశ్రమలు రాకపోయినా, ఉపాధి సమస్యలు ఉన్నా వాటికి ఆంధ్ర ప్రజలను బాధ్యులను చేయడం సరైన విధానం కాదన్నారు. ప్రజలు వేరు, పాలకులు వేరు అనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు పరస్పర గౌరవంతో జీవించాలని, భారతీయులుగా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణపై తన ప్రేమను ఎవరూ ప్రశ్నించలేరని, రాష్ట్ర ప్రజలతో కలిసి పనిచేయడం కొనసాగిస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
రామచంద్రపురం,జూన్,1,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.పాత రామచంద్రపురం జాతీయ రహదారి పక్కన నెలకొన్న డ్రైనేజీ సమస్యకు అధికారుల సమన్వయంతో శాశ్వత పరిష్కారం లభించింది. డ్రైనేజీ వ్యవస్థ స్తంభించడంతో గత కొంతకాలంగా మూడవ వార్డు ప్రజలు మురికినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీ మూసుకుపోవడంతో నాలాలోని నీరు బయటకు పొంగి ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఆందోళన చెందారు.ఈ సమస్యపై స్థానిక ప్రజలు బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు సుంకు వినయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే స్పందించి జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏఈ శ్రీ శివ తన సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఇది ఓపెన్ నాలా కావడంతో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ పరిధిలోకి వస్తుందని గుర్తించి, ఆ శాఖ మేనేజర్ శ్రీ ధనుంజయ్ గారికి సమాచారం అందించారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ విభాగం సమస్యను పరిష్కరించిన తర్వాత, మూడవ వార్డులో నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఏఈ శివ హామీ ఇచ్చారు.అధికారుల సమన్వయంతో వెంటనే రంగంలోకి దిగిన నేషనల్ హైవేస్ మరియు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ సిబ్బంది, జెసిబి మరియు జెట్టింగ్ యంత్రాల సహాయంతో నాలాలోని అడ్డంకులను తొలగించి నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించారు. అంతేకాకుండా, భవిష్యత్తులో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా కొత్త పైప్లైన్లను ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బిఎస్పి సీనియర్ నాయకులు సుంకు వినయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో జిహెచ్ఎంసి, నేషనల్ హైవేస్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ అధికారులు సకాలంలో స్పందించి, సమన్వయంతో పనిచేయడం అభినందనీయమని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యలపై వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.
పటాన్ చెర్ ,జూన్,1,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి) భౌతికశాస్త్ర ఉపాధ్యాయులను నాణ్యమైన శిక్షణతో ప్రోత్సహించి, ఆ రంగాన్ని అభివృద్ధి చేయాలనే విద్యాపరమైన బాధ్యతగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు స్పష్టీకరించారు. ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల వృత్తి వికాస కార్యక్రమం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఇండియన్ ఫిజిక్స్ అసోసియేషన్ (ఐపీఏ) విశాఖపట్నం విభాగం సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, భౌతికశాస్త్ర రంగంలోని ప్రముఖ నిపుణుల నుంచి అధునాతన భావనలు, ఆచరణాత్మక అనువర్తనాలను నేర్చుకోవడానికి లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మూడు రోజుల కార్యక్రమ స్వరూపాన్ని గీతం విశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ బి.వి.ఆర్. టాటా వివరిస్తూ, ఉదయం సైద్ధాంతిక చర్చలు, భోజనానంతరం ఆచరణాత్మక శిక్షణ ఉండేలా ఈ కార్యక్రమాలను రూపొందించామని తెలిపారు. పలువురు విద్యా నిపుణులు తమ జ్జానం, అనుభవాలను పంచుకుంటారని చెప్పారు. గీతం సైన్స్ డీన్ ప్రొఫెసర్ అనంత రామకృష్ణ మాట్లాడుతూ, భౌతికశాస్త్రం అత్యంత ఆకర్షణీయమైన విషయాలలో ఒకటని, అంతిమ జ్జానానికి పునాదిగా అభివర్ణించారు. సైన్స్ ఆర్థిక విజయానికి దారితీయదనే (టెకీల వలె బాగా సంపాదించలేము) సాధారణ అపోహను ప్రస్తావిస్తూ, శాస్త్రీయ జ్జానం ద్వారా ఆర్థిక విలువను సృష్టించడంలో పేటెంట్ చట్టాలు, ఆవిష్కరణలు, ఉత్పత్తి అభివృద్ధి యొక్క ప్రాముఖ్యత ఆయన వివరించారు. విద్యార్థులు సైన్స్ విద్యను ఆర్థికంగా అర్థవంతంగా మార్చాల్సిన అవసరాన్ని ఆయన ఉద్ఘాటించారు. అనంతరం, ఇందులో పాల్గొంటున్న వారిలో ఉత్సుకతను రేకెత్తించేందుకు, శాస్త్రీయ ఆవిష్కరణలో ముడిపడి ఉన్న ఆచరణాత్మక సమస్యలు, పారిశ్రామిక అనువర్తనాలు, ఆర్థిక విలువను ప్రదర్శిస్తూ, ‘విద్యుదయస్కాంతత్వం: కొన్ని నిజ జీవిత అనువర్తనాలు’ అనే అంశంపై ఆయన తొలి సాంకేతిక కార్యక్రమాన్ని నిర్వహించారు.గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లో అందుబాటులో ఉన్న విద్య, పరిశోధనా సౌకర్యాలను డైరెక్టర్ డాక్టర్ ఎం.రెజా పరిచయం చేశారు. ముఖ్యంగా, అంతర్విభాగ పరిశోధనకు కేంద్రంగా పనిచేసే మల్టీడిసిప్లినరీ యూనిట్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గీతం హైదరాబాదు ప్రాంగణంలోని అధునాతన ప్రయోగశాలలను సందర్శించాలని ఈ శిక్షణలో పాల్గొంటున్న వారందరినీ ఆయన ఆహ్వానించారు.ఐఐటీ మద్రాసు భౌతికశాస్త్ర విభాగం నుంచి పదవీ విరమణ చేసిన ఆచార్య నటరాజన్, గీతం విశిష్ట ఆచా ర్యుడు, సెంటర్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ కు చెందిన ప్రొఫెసర్ జి.రవికుమార్ తన అనుభవాన్ని పంచుకున్నారు. మంగళవారం (రెండవ రోజున) ఐఐఎస్సీ బెంగళూరు భౌతికశాస్త్ర విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ ఆచార్య విభోర్ సింగ్, భాభా అణు పరిశోధనా సంస్థ (బార్క్) పూర్వ శాస్త్రవేత్త జి.ఏ.రామారావు ఉపన్యసించనున్నారు. మరో రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ శిక్షణా కార్యక్రమాన్ని డాక్టర్ జి.సాయిప్రీతి, డాక్టర్ టి.విశ్వం సమన్వయం చేస్తున్నారు.
అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా వెల్లడించిన మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు.
అమీన్పూర్,జూన్,1,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.జాతీయ రహదారిపై లింగంపల్లి చౌరస్తా నుండి అమీన్పూర్ వరకు నేరుగా రాకపోకలు సాగించేందుకు అమీన్పూర్ వాసులు దశాబ్దాలుగా కంటున్న కల త్వరలోనే సాకారం కానుంది. ఈ మేరకు లింగంపల్లి చౌరస్తా వద్ద నాలాపై బ్రిడ్జి నిర్మాణానికి నాలుగు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించినట్లు మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు ప్రకటించారు. సోమవారం ఆయన లింగంపల్లి చౌరస్తా వద్ద నాలా పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. గత ఏడాది చివరలో లింగంపల్లి చౌరస్తా నుండి అమీన్పూర్ మీదుగా సుల్తాన్పూర్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్.వి. కన్నన్తో కలిసి స్థల పరిశీలన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నాలాగా మారిన చిన్న వాగుపై ఉన్న ఆక్రమణలను తొలగించి, వంతెనను నిర్మించాలని, హైవే నుండి అమీన్పూర్ మరియు సుల్తాన్పూర్ వరకు నేరుగా రహదారి సౌకర్యం కల్పించాలని తాము అధికారులను కోరామని తెలిపారు.ఈ దీర్ఘకాలిక డిమాండ్ను వంద రోజుల్లో పూర్తి చేయాలని కమిషనర్ను కోరగా, వారు సానుకూలంగా స్పందించి కార్యాచరణను ప్రారంభించారని పేర్కొన్నారు. తద్వారా ఈ వంతెన నిర్మాణానికి నాలుగు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు.ఈ రహదారి నిర్మాణం పూర్తయితే అమీన్పూర్, సుల్తాన్పూర్, బొల్లారం ప్రాంతాల ప్రజలతో పాటు, శేరిలింగంపల్లి వాసులకు కూడా రింగ్ రోడ్డు ప్రయాణం ఎంతో సులభతరం అవుతుందని ఆయన వివరించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని, తమను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల రుణం అభివృద్ధి పనుల ద్వారా తీర్చుకుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, శేరిలింగంపల్లి నియోజకవర్గ బాధ్యులు రవికుమార్ యాదవ్, దిశ కమిటీ సభ్యులు కాసాల సుధాకర్, బీజేపీ నాయకులు ఎడ్ల రమేష్, రాచమల్ల సంతోష్ గౌడ్, వివిధ కాలనీల ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
రామచంద్రాపురం,జూన్,1,మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల అయ్యాయని.. ప్రతి పార్కుని ప్రజల కోసం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.సోమవారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఫేజ్ 2 కాలనీ పార్కు, హుడా కాలనీ పార్కు 2 కాలనీలలో ఒక కోటి 40 లక్షల రూపాయలతో చేపట్టనున్న పార్కుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాలు, గ్రామాల్లో నూతన పార్కుల ఏర్పాటు ద్వారా ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదానికి దోహదపడుతుందని తెలిపారు . పార్కులు పచ్చదనాన్ని పెంపొందించడమే కాకుండా ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణంలో నడక, వ్యాయామం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయని అన్నారు. పార్కుల అభివృద్ధితో పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుతో పాటు ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.ప్రజలు పార్కులను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం తహసిల్దార్ సరస్వతి, పటాన్చెరు సర్కిల్ డిప్యూటీ కమిషన్ జ్యోతి రెడ్డి, ఈఈ సురేష్, తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ లలిత సోమిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, డి ఈ కృష్ణవేణి, యు బి డి మేనేజర్ విక్రమ్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవేందర్ యాదవ్, మల్లారెడ్డి, కోటి హరీష్ , మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
చేగుంట,జూన్,1,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల సోమ్లా తాండ గ్రామం నుండి గుగ్లోత్ లోక్య కుమారుడు శ్రీను భారత సైనిక దళానికి ఎంపిక అయినా సందర్బంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది, శ్రీను కుటుంబంలో సంతోష వాతావరం నెలకొంది, సైనికి దళనికి ఎంప్పికైనందుకు గ్రామ సర్పంచ్ మాలోత్ ప్రవళిక రమేష్ పిలుపుమేరకు స్థానిక ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి, వచ్చి శ్రీను ని శాలువాతో సన్మానం చేసారు ఎస్ ఐ మాట్లాడుతూ దేశ సేవకోసం ఎందరో ఎదురు చుసిన ఆ అదృష్టం కొందరికి వారిస్తుందని పేర్కొన్నారు, ఈ సందర్బంగా స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ మా గ్రామం నుండి దేశ సైనిక దళానికి ఎప్పికైనందుకు తాను ఎంత సంతోషిస్తున్నాని పేర్కొన్నారు ఇలాంటి గొప్ప స్థాయిలో తమా గ్రామం నుండి యువత ఉనందున మా గ్రామం నుండి శ్రీను కి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం పాల్గొన్నారు ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి స్థానిక సర్పంచ్ మాలోత్ ప్రవళిక రమేష్ ఉప సర్పంచ్ రవీందర్ వార్డ్ సభ్యులు గ్రామస్తులు రాజు తదితరులు పాల్గొన్నారు.
(స్పెషల్ కరస్పాండెంట్) హైదరాబాద్,జూన్,1,మెదక్ టుడే న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన లక్ష్యంగా పనిచేస్తున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ సంస్థను మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక నియామకాలు చేపట్టినట్లు సంస్థ నేషనల్ సెక్రటరీ పోలిశెట్టి రామప్ప తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న పోలిశెట్టి రామప్ప ఆధ్వర్యంలో విశాఖపట్నంలో అవార్డుల ప్రదానోత్సవాలు, రక్తదాన శిబిరాలు, అలాగే అన్నమయ్య జిల్లాలో అవగాహన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఆయన సేవలను గుర్తించిన సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మహితాబ్రాయి, ఆల్ ఇండియా ఇన్చార్జ్ సర్వేందర్ ఆయనకు అదనపు బాధ్యతలతో నేషనల్ సెక్రటరీగా పదోన్నతి కల్పించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలకు కొత్త బాధ్యులను నియమించారు. వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పోలిశెట్టి గణేశ్వరరావు, రాష్ట్ర సోషల్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్గా పోలిశెట్టి చంద్రారావు, కాకినాడ జిల్లా చైర్మన్గా బోనం వీర వెంకట సత్యనారాయణ, కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కొమిరాల నాగార్జున నియమితులయ్యారు.కొత్తగా నియమితులైన బాధ్యులకు పోలిశెట్టి రామప్ప చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు, గుర్తింపు కార్డులు మరియు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం సంస్థలో చేరిన సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా వారి పక్షాన నిలబడి, సమస్యకు పరిష్కారం లభించే వరకు నిరంతరం అండగా ఉంటాం. మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన కోసం కృషి చేస్తాం” అని ప్రతిజ్ఞ చేశారు. సంస్థ విస్తరణతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించగలమనే విశ్వాసాన్ని నాయకులు వ్యక్తం చేశారు.
భౌతికశాస్త్ర ఉపాధ్యాయులను నాణ్యమైన శిక్షణతో ప్రోత్సహించి, ఆ రంగాన్ని అభివృద్ధి చేయాలనే విద్యాపరమైన బాధ్యతగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు స్పష్టీకరించారు. ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల వృత్తి వికాస కార్యక్రమం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఇండియన్ ఫిజిక్స్ అసోసియేషన్ (ఐపీఏ) విశాఖపట్నం విభాగం సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, భౌతికశాస్త్ర రంగంలోని ప్రముఖ నిపుణుల నుంచి అధునాతన భావనలు, ఆచరణాత్మక అనువర్తనాలను నేర్చుకోవడానికి లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మూడు రోజుల కార్యక్రమ స్వరూపాన్ని గీతం విశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ బి.వి.ఆర్. టాటా వివరిస్తూ, ఉదయం సైద్ధాంతిక చర్చలు, భోజనానంతరం ఆచరణాత్మక శిక్షణ ఉండేలా ఈ కార్యక్రమాలను రూపొందించామని తెలిపారు. పలువురు విద్యా నిపుణులు తమ జ్జానం, అనుభవాలను పంచుకుంటారని చెప్పారు. గీతం సైన్స్ డీన్ ప్రొఫెసర్ అనంత రామకృష్ణ మాట్లాడుతూ, భౌతికశాస్త్రం అత్యంత ఆకర్షణీయమైన విషయాలలో ఒకటని, అంతిమ జ్జానానికి పునాదిగా అభివర్ణించారు. సైన్స్ ఆర్థిక విజయానికి దారితీయదనే (టెకీల వలె బాగా సంపాదించలేము) సాధారణ అపోహను ప్రస్తావిస్తూ, శాస్త్రీయ జ్జానం ద్వారా ఆర్థిక విలువను సృష్టించడంలో పేటెంట్ చట్టాలు, ఆవిష్కరణలు, ఉత్పత్తి అభివృద్ధి యొక్క ప్రాముఖ్యత ఆయన వివరించారు. విద్యార్థులు సైన్స్ విద్యను ఆర్థికంగా అర్థవంతంగా మార్చాల్సిన అవసరాన్ని ఆయన ఉద్ఘాటించారు. అనంతరం, ఇందులో పాల్గొంటున్న వారిలో ఉత్సుకతను రేకెత్తించేందుకు, శాస్త్రీయ ఆవిష్కరణలో ముడిపడి ఉన్న ఆచరణాత్మక సమస్యలు, పారిశ్రామిక అనువర్తనాలు, ఆర్థిక విలువను ప్రదర్శిస్తూ, ‘విద్యుదయస్కాంతత్వం: కొన్ని నిజ జీవిత అనువర్తనాలు’ అనే అంశంపై ఆయన తొలి సాంకేతిక కార్యక్రమాన్ని నిర్వహించారు.గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లో అందుబాటులో ఉన్న విద్య, పరిశోధనా సౌకర్యాలను డైరెక్టర్ డాక్టర్ ఎం.రెజా పరిచయం చేశారు. ముఖ్యంగా, అంతర్విభాగ పరిశోధనకు కేంద్రంగా పనిచేసే మల్టీడిసిప్లినరీ యూనిట్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గీతం హైదరాబాదు ప్రాంగణంలోని అధునాతన ప్రయోగశాలలను సందర్శించాలని ఈ శిక్షణలో పాల్గొంటున్న వారందరినీ ఆయన ఆహ్వానించారు.ఐఐటీ మద్రాసు భౌతికశాస్త్ర విభాగం నుంచి పదవీ విరమణ చేసిన ఆచార్య నటరాజన్, గీతం విశిష్ట ఆచా ర్యుడు, సెంటర్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ కు చెందిన ప్రొఫెసర్ జి.రవికుమార్ తన అనుభవాన్ని పంచుకున్నారు. మంగళవారం (రెండవ రోజున) ఐఐఎస్సీ బెంగళూరు భౌతికశాస్త్ర విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ ఆచార్య విభోర్ సింగ్, భాభా అణు పరిశోధనా సంస్థ (బార్క్) పూర్వ శాస్త్రవేత్త జి.ఏ.రామారావు ఉపన్యసించనున్నారు. మరో రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ శిక్షణా కార్యక్రమాన్ని డాక్టర్ జి.సాయిప్రీతి, డాక్టర్ టి.విశ్వం సమన్వయం చేస్తున్నారు.
చేగుంట,మే,31,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన రాకేష్ టీజీసెట్-2026లో విశిష్ట ప్రతిభ కనబరిచాడు. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 6వ బ్రాంచ్ ర్యాంక్ సాధించడంతో పాటు 1493 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ను కైవసం చేసుకున్నాడు.రాకేష్ తన పాఠశాల విద్యను చేగుంటలోని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్లో పూర్తి చేశాడు. అనంతరం హైదరాబాద్ రామంతాపూర్లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కెమికల్ ఇంజినీరింగ్ డిప్లొమా అభ్యసించాడు. చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి చూపిన రాకేష్ క్రమశిక్షణ, పట్టుదలతో ఈ విజయాన్ని సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.రాకేష్ తండ్రి సత్యనారాయణ తన కుమారుడి విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు రాకేష్ను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.వడియారం గ్రామానికి చెందిన విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.