గుంటూరు,జూన్,3,మెదక్ టుడే న్యూస్:గుంటూరు జిల్లా అంబేద్కర్ భవన్ లో జరిగినవంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎం ఆర్ పి ఎస్)వ్యవస్థాపక అధ్యక్షులు మన్యశ్రీ ఉసురు పార్టీ బ్రహ్మయ్య మాదిగ నేతృత్వంలో శ్రీ రావూరి రాజ్ మాదిగ ను రాష్ట్ర యువజన అధ్యక్షులుగా నియమిస్తూ, ప్రమాణ పత్రాన్ని జాతీయ, రాష్ట్ర, జిల్లాల నాయకులు సమక్షంలో నాయకునిగా నియామక పత్రం అందజేశారు.అనంతరం రావూరి రాజు మాట్లాడుతూ. నాపై నమ్మకంతో, ఎం ఆర్ పి ఎస్, యువసేన అధ్యక్షులుగా నియమించినందుకు, వారికి కృతజ్ఞతలు తెలుపుతూ,ఎల్లవేళలా అందరికీ తోడుంటూ. ప్రతి సమస్యపై పోరాడుతానని. పేర్కొన్నారు.

