📄 ePaper
Thursday, June 4, 2026
ADS
Home Blog Page 4

ఇది హెల్త్ స్కీమ్ కాదు స్కామ్ లాగా కనబడుతుంది తపస్.

0

చేగుంట,మే,31,మెదక్ టుడే న్యూస్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉద్యోగులందరికీ హెల్త్ స్కీమ్ లాగా లేదు.ఇది స్కాం లాగా కనబడుతుందని తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్, జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, జాల సిద్దు అన్నారు . హెల్త్ కార్డులకు సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు లేనప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగుల అందరి జీతం నుండి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా , డిడిఓల అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల మూలవేతనం నుండి 1.5% కట్ చేయడం ఏమిటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ వద్దు అనుకున్న వారికి మినాయింపు ఇవ్వాలని, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు అయితే, ఎవరు అప్లై చేసుకుంటే వారి నుండి మాత్రమే అమౌంట్ కట్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల నుండి బలవంతంగా వసూలు చేయడం మంచిది కాదని వారన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, నర్సింలు, మెదక్, నార్సింగ్ మండలాల అధ్యక్షులు నరేందర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

క్రికెట్ పీపీఎల్ సీజన్ (2) పొలంపల్లి లోవిన్నర్, చందు వారియర్స్,రన్నర్, ఆర్పి కింగ్స్,బహుమతులు అందజేసిన సర్పంచ్ రాజలక్ష్మి స్వామి,

0

పొలంపల్లి యువత క్రీడాలతో పాటు వ్యవసాయ రంగంలో ముందు,ఉప సర్పంచ్ సత్య గౌడ్

చేగుంట,మే,31,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో శనివారం నాడు క్రికెట్ పిపిఎల్ సీజన్ (2) ప్రారంభించారు, రెండు రోజులుగా జరిగిన మ్యాచ్ లో నాలుగు జట్టులు పాల్గొనగా, జట్టు (1) కృష్ణా రాయల్, జట్టు (2) గణేష్ టైగర్స్, జట్టు (3)ఆర్ పి కింగ్స్, జట్టు (4) చందు వారియర్స్, పాల్గొనగా, ఆదివారం నాడు, ఫైనల్ ఆర్ పి కింగ్స్, చందు వారియర్స్ జట్టు తలబడడంతోచందు వారియర్స్, విన్నర్ టీం విజయం సాధించారు,
పిపిఎల్ సీజన్ (2) కు ముఖ్యఅతిథిగా
కొండి రాజులక్ష్మి స్వామి పాల్గొని వారు మాట్లాడుతూ, యువత చదువుతోపాటు క్రీడాలవైపు మొగ్గు చూపాలి అని కోరుతూ, క్రీడలలో పొలంపల్లి యువత యువత మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి, ఎదుగుతూ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, వారు కోరారు, ఉపసర్పంచ్ సత్య గౌడ్, మాట్లాడుతూ యువత చదువుతో, ముఖ్యంగా క్రీడాలతో పాటు,వ్యవసాయ రంగంలో ముందు ఉండడం ఎంత సంతోషకరం, యువతక్రీడాలలో ముందుకు సత్తా చాటడం సంతోషకరం, క్రీడలలో గెలుపు ఓటమి సహజం, అని అన్నారు, పిపిఎల్ సీజన్ (2) ప్రారంభించడానికి, సహకరించిన దాతలు, గ్రామ సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి,10000, మాజీ సర్పంచ్ వెన్నెల నిర్మల సత్యం,2000, వై శివకుమార్, 8000, జి గణేష్ 3000, టి భాస్కర్ 2000, మాజీ వార్డ్ మెంబర్ కుక్కల శ్యామల సతీష్,2000, పి.చంద్రం 3000, సిహెచ్ కృష్ణ 3600 ఆర్ ప్రశాంత్ గౌడ్ 3000, ఈ టోర్నమెంట్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు, మాజీ సర్పంచులకు మాజీ ఉప సర్పంచ్ లకు మాజీ వార్డు మెంబర్లు, వివిధ యూత్ అధ్యక్షులు యువతకు, గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలు క్రీడా ప్రాంగణానీకి సహకరించిన, మరబోయిన ఐలయ్య, పర్వతాలు, శ్రీను కు నమస్కరిస్తున్నాం, పొలంపల్లి జరుగుతున్న క్రికెట్ ప్రీమియం సీజన్ (2) కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగింది, ఈ కార్యక్రమంలో యువత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు,

షాద్‌నగర్ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలినూతన ట్రాఫిక్ సీఐ శంకరయ్యకు సీనియర్ జర్నలిస్టుల శుభాకాంక్షలు.

0

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,మే,30,మెదక్ టుడే న్యూస్:
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ట్రాఫిక్ సీఐ శంకరయ్యను సీనియర్ జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు, మహమ్మద్ అప్సర్, ఆకుల మల్లికార్జున్ తదితరులు సీఐ శంకరయ్యకు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.ముఖ్యంగా…
🔹 షాద్‌నగర్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
🔹 ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు, రోడ్లపైనే ఏర్పాటు చేస్తున్న పార్కింగ్‌లు, అనధికార ఆటో స్టాండ్‌లు, ప్రధాన చౌరస్తాలలో ట్రాఫిక్ రద్దీ వంటి సమస్యలను సమర్థవంతంగా నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు.
🔹 గతంలో షాద్‌నగర్ లా అండ్ ఆర్డర్ విభాగంలో పనిచేసిన అనుభవం శంకరయ్యకు ఉండటంతో స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు.
🔹 అన్ని వర్గాల ప్రజలకు సుపరిచితులైన శంకరయ్య తన అనుభవంతో ట్రాఫిక్ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
🔹 ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుని షాద్‌నగర్‌ను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు, మహమ్మద్ అప్సర్, ఆకుల మల్లికార్జున్ తదితరులు నూతన ట్రాఫిక్ సీఐ శంకరయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సేవాకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
ఫోటో క్యాప్షన్:
షాద్‌నగర్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీఐ శంకరయ్యను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేస్తున్న సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు, మహమ్మద్ అప్సర్, ఆకుల మల్లికార్జున్ తదితరులు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించే వ్యాఖ్యలు సహించం-బక్కని వ్యాఖ్యలపై రాజా వరప్రసాద్ తీవ్ర విమర్శలు.

0

తెలంగాణ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని సూచన
బీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేక కాంగ్రెస్-బీజేపీ-టీడీపీ కుమ్మక్కయ్యాయని ఆరోపణ
షాద్‌నగర్‌లో మీడియా సమావేశంలో మాజీ సహకార యూనియన్ చైర్మన్ వ్యాఖ్యలు

(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,మే,30, మెదక్ టుడే న్యూస్:
తెలంగాణ గురించి అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదని, ముందుగా తెలంగాణ చరిత్రను అధ్యయనం చేసి మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులకు బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ సహకార యూనియన్ చైర్మన్ రాజా వరప్రసాద్ సూచించారు. శనివారం షాద్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యాంశాలు:
🔹 తెలంగాణ అనే పదం, దాని చారిత్రక నేపథ్యంపై అవగాహన లేకుండా చేసిన వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని అన్నారు.
🔹 తెలంగాణ ఉద్యమం వేలాది మంది త్యాగాలు, పోరాటాల ఫలితమని, అలాంటి చరిత్రను తక్కువ చేసి మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు.
🔹 బక్కని నర్సింహులు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
🔹 తెలంగాణ భౌగోళిక, చారిత్రక అంశాలపై పుస్తకాలు అవసరమైతే పంపించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
🔹 చంద్రబాబు నాయుడి రాజకీయ విధానాలను అనుసరిస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం తగదన్నారు.
కాంగ్రెస్-బీజేపీ-టీడీపీ రాజకీయ వ్యూహాలపై విమర్శలు
🔹 తెలంగాణలో రాజకీయంగా బీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేక కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు పరోక్షంగా కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు.
🔹 సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని రాజకీయ నిర్ణయాలు కూడా ఈ పరిణామాలకు సంకేతాలుగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
🔹 తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా ఉండాలని, ఇతర రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భావోద్వేగాలను ఉపయోగించకూడదన్నారు.
బీఆర్‌ఎస్ సంస్థాగత బలోపేతంపై దృష్టి
🔹 రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా చేపట్టనున్నట్లు తెలిపారు.
🔹 తెలంగాణ ఆశయాలను విశ్వసించే యువత పెద్ద సంఖ్యలో పార్టీతో కలవాలని పిలుపునిచ్చారు.
🔹 షాద్‌నగర్ నియోజకవర్గంలో డిజిటల్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
కవితపై ప్రశ్నకు స్పందన
🔹 బీఆర్‌ఎస్ నాయకత్వంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, కవిత ఉద్యమ సమయంలో చేసిన సేవలను గుర్తు చేశారు.
🔹 పార్టీ అంతర్గత వ్యవహారాల కంటే సంస్థాగత బలోపేతమే ప్రస్తుతం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుపై వ్యాఖ్యలు
🔹 లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనుల విషయంలో గతంలో ఎదురైన అవరోధాలను గుర్తు చేశారు.
🔹 పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన పనుల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాత్ర కీలకమని తెలిపారు.
బాల్క సుమన్ అంశంపై మౌనం
🔹 బాల్క సుమన్ వ్యాఖ్యలపై విలేకరులు ప్రశ్నించగా స్పందించేందుకు నిరాకరించారు.
🔹 ఆ అంశం ప్రస్తుతం న్యాయపరమైన పరిధిలో ఉన్నందున వ్యాఖ్యానించడం సముచితం కాదని “నో కామెంట్” అన్నారు.
“తెలంగాణ చరిత్ర, ఆత్మగౌరవం, ప్రజల త్యాగాలను గౌరవించడం ప్రతి రాజకీయ నాయకుడి బాధ్యత” అని రాజా వరప్రసాద్ పేర్కొన్నారు.

కుల దుహంకరణ సమాజానికి సవాళ్లుడిప్యూటీ ఎమ్మార్వో రమేష్.

0

చేగుంట,మే,30,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని చందాయిపేట్
గ్రామంలో, శనివారం నాడు చేగుంట తహసిల్దార్ శివప్రసాద్, సర్పంచ్ తాలూకా మహేశ్వరీ సాయిబాబా, ఆధ్వర్యంలో గ్రామంలో సివిల్ రైట్స్
డే నిర్వహించారు, డిప్యూటీ తాసిల్దార్ రమేష్ మాట్లాడుతూ, ఎస్సీ కులస్తులను కులం పేరుతో దూషించిన, గుడిలో రాకుండా అడ్డుపడిన, వారి పైన, ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేస్ కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందన్నారు.గ్రామంలో ఎవరైనా కులాంతర వివాహం చేసుకున్నట్లయితే వారికి ప్రభుత్వం తరుపున 50 వేల రూపాయలు నగదు,విదేశీ చదువుల, కొరకు రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమం లో చేగుంట, ఆర్ఐ సుజాత,ఉపసర్పంచ్ నాగేష్ గుప్తా,సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, గ్రామ సెక్రెటరీ కృష్ణ , గ్రామ రెవిన్యూ ఆఫీసర్ రత్న కుమారి,హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ ముజామిల్,వార్డ్ సభ్యులు మధు, మహేష్,మహిళలు,గ్రామ ప్రజలు స్వామి గౌడ్, సిద్దిరాములు, బాబు, నర్సిములు,తదితరులు పాల్గొన్నారు,

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగామహిళా వారోత్సవాలు సందర్భంగా అమ్మకు అక్షరమాల.

0

చేగుంట,మే,30,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలో అమ్మకు అక్షరమాల(ఉల్లాస్) ర్యాలీ తీయడం, సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. వయోజనులైన మహిళలకు చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం ప్రతి 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి మహిళ కనీసం వారి కుటుంబ సభ్యుల పేర్లు రాయడం చదవడం ఆర్టీసీ బస్సు బోర్డులు చదవడం రాయడం, చిన్న చిన్న పదాలు చదవడం రాయడం చాలా అవసరం ఇందుకోసం ప్రభుత్వం వాలంటీర్లను నియమించి చదువు నేర్పించడం జరుగుతుంది కావున చదువురాని ప్రతి మహిళ ఈ చదవకాశాన్నివినియోగించుకోగలరు అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, ఎంఈఓ నీరజ, ఏపిఎం దుర్గాప్రసాద్, సీసీలు శంకర్, స్వామి, రామస్వామి, అంజ్యానాయక్, శ్వేత, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

పౌర్ణమి వేళ-పల్లకీ లో దుర్గమ్మ.

0

పాపన్నపేట,మే,30,మెదక్ టుడే న్యూస్: భక్తుల జయ జయ ద్వానాలతో అరణ్యంలో ఆధ్యాత్మికత సంతరించుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం. శనివారం పౌర్ణమి ని పురస్కరించుకొని వనదుర్గా క్షేత్రంలో వైభవంగా పల్లకీ సేవా నిర్వహించారు. అర్చకులు శంకర్ శర్మ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజగోపురం,శివాలయం ముందుగా ఈ ఊరేగింపు కనుల పండువగా సాగింది.

పాటిగడ్డలో అభివృద్ధి జోరు.. ప్రజా నమ్మకానికి ప్రతీకగా అఖిల్ రెడ్డిఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా భవనాల ప్రారంభోత్సవం.

0

(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,మే,29,మెదక్ టుడే న్యూస్:రూ.30 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారంమహిళా సాధికారతకు సమాఖ్య భవనంగ్రామ ప్రజల కలగా ఉన్న వంతెన పనులకు త్వరలో పూర్తి హామీమెరిట్ విద్యార్థినిలకు నగదు ప్రోత్సాహకాలు
యువ సర్పంచ్ అఖిల్ రెడ్డి సేవలను ప్రశంసించిన ఎమ్మెల్యేకేశంపేట మండలంలోని పాటిగడ్డ గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు.గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాలను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. యువ సర్పంచ్ అఖిల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. పాటిగడ్డ గ్రామంలో ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వంతెన నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయని, త్వరలోనే పూర్తి చేసి ప్రజల రాకపోకల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.గ్రామ అభివృద్ధిలో యువ నాయకత్వం ఎంతో కీలకమని పేర్కొంటూ, సర్పంచ్ అఖిల్ రెడ్డి కృషిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిలకు రూ.5 వేల చొప్పున నగదు ప్రోత్సాహకాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సర్పంచ్ అఖిల్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో పాటిగడ్డను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. గ్రామ ప్రజలు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి తాండ్ర విశాల, కొత్తపేట జగదీష్, పల్లె ఆనంద్, మండల పార్టీ అధ్యక్షుడు రమేష్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

జిహెచ్ఎంసి అధికారుల వివక్ష – రోడ్ల ఆక్రమణలపై వ్యాపారుల ఆగ్రహం.

0

చట్టం అందరికీ సమానమే కదా? బీరంగూడ-కిష్టారెడ్డిపేట్ మార్గంలో యథేచ్ఛగా ఆక్రమణలు.. అధికారుల మౌనం వెనుక ఆంతర్యమేమిటి?

అమీన్‌పూర్,మే,29,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలో రోడ్డు ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులు అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై వ్యాపారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బీరంగూడ మెయిన్ మార్కెట్ నుండి కిష్టారెడ్డిపేట్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన వెలిసిన ఆక్రమణలు, అధికారుల పనితీరుపై అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.సమస్య ఏమిటంటే:గత 20 రోజుల క్రితం, జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు హడావిడిగా రంగంలోకి దిగి, జేసీబీల సాయంతో రోడ్డు పక్కన ఉన్న అనేక చిన్న వ్యాపారాలను తొలగించారు. ఆ సమయంలో అధికారులు తమ వద్దకు పదే పదే వచ్చి, షాపులు ఖాళీ చేయాలని హెచ్చరించారని బాధితులు వాపోతున్నారు.అయితే, ప్రస్తుతం బీరంగూడ మార్కెట్ నుండి కిష్టారెడ్డిపేట్ వెళ్లే రహదారిపై పరిస్థితి చూస్తుంటే, అధికారులు కొన్ని షాపుల పట్ల మాత్రమే కఠినంగా ఉండి, మరికొన్నింటిని చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డుకు అడ్డంగా వెలుస్తున్న ఈ వ్యాపారాల వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నా, అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చగా మారింది.వ్యాపారుల ఆరోపణలు:మా షాపులు తీయించిన
అధికారులు, ప్రస్తుతం రోడ్ల మీద యథేచ్ఛగా నడుస్తున్న ఈ వ్యాపారాల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో మామూళ్లు ముట్టాయా? అందుకే వారికి కొమ్ము కాస్తూ, మా పొట్ట కొడుతున్నారా?” అని పలువురు వ్యాపారులు టౌన్ ప్లానింగ్ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.అధికారులకు విజ్ఞప్తి:ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఆక్రమణల తొలగింపు విషయంలో అందరికీ సమానమైన నిబంధనలు అమలు చేయాలని స్థానికులు, వ్యాపారవేత్తలు కోరుతున్నారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ, నిబంధనలను పక్కన పెడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, రోడ్లను సులభతరం చేసేలా తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

గొప్ప పరిపాలన దక్షుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.

0

సుల్తాన్పూర్ లో 10 లక్షల రూపాయల సొంత నిధులతో శివాజీ విగ్రహావిష్కరణ.

అమీన్ పూర్,మే,29,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.నేటి యువతరానికి స్ఫూర్తి ప్రదాత అయిన చత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పరిపాలనదక్షుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో 10 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం వేలాది మంది ప్రజల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…శివాజీ మహారాజ్ గొప్ప పోరాటయోధుడు గానే కాకుండా గొప్ప పరిపాలనాదక్షుడుగా పేరు పొందారని అన్నారు. చరిత్రలో గొప్ప నాయకులుగా కీర్తించబడ్డ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. వారి చరిత్రను, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను నేటి తరానికి తెలియజేయడమే ప్రధాన ఉద్దేశం అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో శివాజీ విగ్రహాల ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. యువత పెడదారి పట్టకుండా దేశ భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ సర్పంచులు పట్నం రాజు, భాస్కర్ గౌడ్, పాండు, సీనియర్ నాయకులు మల్లేష్, శ్రీకాంత్, శివాజీ మహారాజ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు గణేష్, గ్రామ పుర ప్రముఖులు, యువత పాల్గొన్నారు.