📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 5

అమీన్‌పూర్‌లో హైడ్రా అధికారుల తీరుపై నిరసన:న్యాయవాది కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. సీఐకి ఫిర్యాదు.

0

అమీన్‌పూర్,మే,29,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని ఐలాపూర్‌లో హైడ్రా అధికారుల చర్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కూల్చివేతకు గురైన గెస్ట్ హౌజ్ స్థలంలో అధికారులు ఫెన్సింగ్ పనులు చేపడుతుండగా, స్థానిక న్యాయవాది ముఖీం ప్రతినిధులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో మహిళా సిబ్బంది పట్ల అధికారులు అనుచితంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.పద్మ ఆరోపణలు: “మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు”ఈ ఘటనపై ఘటనా స్థలంలో ఉన్న పద్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, “మా యజమాని (న్యాయవాది ముఖీం) న్యాయపరంగా కోర్టు ఆదేశాలు తీసుకొచ్చారు. అలాంటప్పుడు మా అనుమతి లేకుండా, మమ్మల్ని సంప్రదించకుండా ఎలా లోపలికి వస్తారు? మేము ‘సార్ వచ్చే వరకు ఆగండి’ అని బ్రతిమలాడినా వినిపించుకోలేదు. ఫోన్‌లో రికార్డ్ చేస్తున్న నన్ను అడ్డుకుంటూ, మహిళ అని కూడా చూడకుండా నా చేయి పట్టుకుని గుంజారు, అసభ్యకరంగా ప్రవర్తించారు. మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసేలా అధికారుల తీరు ఉంది,” అని కన్నీటి పర్యంతమయ్యారు.పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు:ఈ ఘటనపై పద్మ వెంటనేఅమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి హైడ్రా అధికారులపై ఫిర్యాదు చేశారు. అమీన్‌పూర్ సీఐ నరేష్‌ను కలిసి జరిగిన సంఘటనను వివరించారు. తనను వేధించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.సీఐ నరేష్ స్పందన:బాధితురాలు పద్మ ఫిర్యాదును స్వీకరించిన సీఐ నరేష్, విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. హైడ్రా అధికారుల తీరుపై వచ్చిన ఆరోపణలను నమోదు చేసుకున్నామని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ సంఘటనతో ఐలాపూర్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అధికారులు ఒక వైపు చట్టాన్ని అమలు చేస్తున్నామంటూనే, మరోవైపు సామాన్యుల పట్ల అమానుషంగా ప్రవర్తించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివాహానికి రావాలని ఎమ్మెల్యే సునీత రెడ్డికి ఆహ్వానం.

0

కౌడిపల్లి,మే,29,మెదక్ టుడే న్యూస్:శుభకార్యానికి రావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డికి ఆహ్వానం అందించారు. కౌడిపల్లి మండలం, రాజిపేట గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ మహమ్మద్ జాఫర్ కుమారుడి పెళ్లికి రావాలని హైదరాబాద్ లోని సునీత రెడ్డి క్యాంపు కార్యాలయంలో పెళ్లి పత్రికను సుతా లక్ష్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ఉరట్ల మాధవి శివ, రైతు సమన్వయ అధికారి గణేష్ గౌడ్, యాద గౌడ్, బాబు, తోళ్ల శ్రీనివాస్ ఉన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో సొంతింటి కల సాకారం-ఎమ్మెల్యే సునీత రెడ్డి.

0

కౌడిపల్లి,మే,29,మెదక్ టుడే న్యూస్:ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పేదల సొంతింటి కల నెరవేరుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన కౌడిపల్లిలో ఎమ్మెల్యే కోటా కింద మంజూరు అయిన ఐదు ఇండ్లలో నాలుగు ఇండ్లకు కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే సునితారెడ్డి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ. ఎమ్మెల్యే కోటా కింద నర్సాపూర్ నియోజకవర్గంలో 1400 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయన్నారు. ప్రభుత్వం ఇండ్ల నిర్మాణంకు రూ.5 లక్షలు మంజూరు చేసిందన్నారు. ఇండ్లు నిర్మించుకొని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వర్షాలు రాకముందే ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. బిల్లుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు తెలిపారు. ఉపాధి హామీ లోని వందరోజుల పని దినాల్లో 90 రోజుల పైసలు 60వేలు వీటి కోసం వెచ్చిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కౌడిపల్లి తాసిల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి రిజిస్ట్రేషన్ చేసుకునే లబ్ధిదారులతో ఆమె మాట్లాడారు. రిజిస్ట్రేషన్ విషయంలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చేయాలని తాసిల్దార్ కృష్ణకు సూచించారు. గత కొన్ని రోజులుగా తాసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాలు శిథిలావస్థకు చేరి ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో చర్చించి కొత్త భవనాలు నిర్మించేలా కృషి చేయాలన్నారు. భవనాల నిర్మాణం కు అధికారులతో మాట్లాడి మా వంతు కృషిగా చర్చిస్తామని సునీత రెడ్డి తెలిపారు. కాగా కౌడిపల్లి మండలం బుజిరంపేట సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శ్యాంసుందర్, ఉప సర్పంచ్ గోపాల్ తోపాటు పలువురు రైతులు తాసిల్దార్ కార్యాలయం వద్దకు వచ్చారు. ఎమ్మెల్యే సునీత రెడ్డి ముందే తాసిల్దార్ కృష్ణను పిలిపించి గత 15 రోజులుగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి లారీలు పంపించడం లేదని సునీత రెడ్డి ముందే తాసిల్దార్ ను ప్రశ్నించారు. రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రానికి లారీలు పంపించకుంటే తాసిల్దార్ కార్యాలయం ముందు రైతులంతా ధర్నా చేపడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సునీత రెడ్డి కొనుగోలు కేంద్రాల్లో దాన్యం నిల్వ ఉండకుండా రైతులకు ఇబ్బందులు లేకుండా లారీలు పంపించాలని అకాల వర్షాలతో రైతులు వడ్లు తడిసి నష్టపోతున్నారని రెండు రోజుల్లో బుజిరంపేటకు లారీలు పంపించకుంటే తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని తాసిల్దార్ కు సూచించారు.

వేగంగా ధాన్యం అన్లోడింగ్ జరగాలి-జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.

0

కొల్చారం,మే,28,మెదక్ టుడే న్యూస్:వేగంగా ధాన్యం అన్లోడింగ్ జరగాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ గోడౌన్ నిర్వాహకులను ఆదేశించారు.గురువారం కొల్చారం మండల వరిగుంతం గ్రామంలోని గోడౌను ఆకస్మికంగా తనిఖీ చేశారు.వరి ధాన్యం కొనుగోలు , నిల్వ కోసం ఏర్పాటు చేసిన గిడ్డంగిని పరిశీలించారు.సేకరించిన వరి ధాన్యాన్ని ఈ గిడ్డంగిలో నిల్వ చేయనున్నట్లు తెలిపారు. గిడ్డంగిలోని నిల్వ సామర్థ్యం, అందుబాటులో ఉన్న సౌకర్యాలు ,భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు అందించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ,ధాన్యం అన్లోడింగ్ త్వరగా జరగాలని, లారీలను, లేబర్ ను అందుబాటులో ఉంచుకోవాలని,అన్లోడింగ్ ఆలస్యం జరగకుండా మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్లోడింగ్ లో హమాలీని షిఫ్ట్ ల ప్రకారం పని చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చేగుంట లో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు.

0

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి

చేగుంట,మే,28,మెదక్ టుడే న్యూస్:బక్రీద్ పండుగ సందర్భంగా చేగుంట మండల ముస్లిం సోదరులు ఉదయాన్నే మసీదు దగ్గర అందరూ కలుసుకొని ఈద్గా వద్దకు వెళ్లి ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు చేశారు.అనంతరం ఒకరికొకరు ఆలాయి బలాయ్ తీసుకొని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.అనంతరం మస్జీద్ ఈమమ్ అన్వేర్ ఉల్ హాక్ మాట్లాడుతూ.బక్రీద్ పర్వదినం సందర్భంగా ఈద్గా దగ్గర బక్రీద్ వేడుకలు ఘనంగా జరుపుకున్నట్టు తెలిపారు.త్యాగం భక్తి విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు.ప్రతి సంవత్సరం రంజాన్ పండగ ముగిసిన తర్వాత బక్రీద్ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.ఆ అల్లా దీవెనెలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమం లో మస్జీద్ ఈమమ్ అన్వార్ ఉల్ హాక్, మస్జీద్ కమిటీ ఉపాధ్యక్షులు రహీమోద్దీన్, వార్డ్ సభ్యులు అరిఫ్, టీంక సెట్,తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి హరీష్ రావుతో బీఆర్ఎస్ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ భేటీ.

0

అమీన్‌పూర్,మే,28,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి.తెలంగాణ మాజీ మంత్రివర్యులు, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ని అమీన్‌పూర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు మాణిక్ యాదవ్ తన నివాసంలో హరీష్ రావు ని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయ పలకరింపులు జరిపారు.ప్రజా సమస్యలపై చర్చ:ఈ భేటీ సందర్భంగా అమీన్‌పూర్ డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి మాణిక్ యాదవ్ మాజీ మంత్రికి వివరించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఇరువురి మధ్య చర్చ జరిగింది.దిశానిర్దేశం చేసిన హరీష్ రావు:ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని ఈ సందర్భంగా హరీష్ రావు మాణిక్ యాదవ్‌కు సూచించారు. అలాగే, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డివిజన్ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ డివిజన్‌కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ పెద్దలు పాల్గొని మాజీ మంత్రి హరీష్ రావు గారిని కలిసి తమ సమస్యలను పంచుకున్నారు.

జీ+2 పర్మిషన్.. షట్టర్ల నిర్మాణం: బిహెచ్‌ఎల్ మెట్రో కాలనీలో యజమాని అరాచకం!

0

అమీన్‌పూర్,మే,28,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.అమీన్‌పూర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని బిహెచ్‌ఎల్ మెట్రో కాలనీలో అక్రమ నిర్మాణాల జోరు పెరిగింది. నిబంధనలను బేఖాతరు చేస్తూ, అనుమతికి మించిన అంతస్తులతో పాటు, వాణిజ్య అవసరాల కోసం అడ్డగోలుగా షట్టర్ల నిర్మాణాన్ని చేపట్టడంపై స్థానిక కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.స్థానిక సమాచారం మేరకు, సదరు భవన యజమానికి అధికారులు కేవలం జి+2 అంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతులు మంజూరు చేశారు. అయితే, ఆ నిబంధనలను గాలికి వదిలేసిన యజమాని, అంతకు మించి అదనపు నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేవలం నివాస అవసరాల కోసం అనుమతి పొంది, ఆ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో అక్రమంగా షట్టర్లు ఏర్పాటు చేసి వాణిజ్య అవసరాలకు సిద్ధం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ప్రశ్నిస్తున్న స్థానికులు:“నివాస గృహాల అనుమతి పొంది, షట్టర్లు వేసి వ్యాపార సముదాయాలుగా మార్చడం వెనుక అంత ధైర్యం ఎక్కడిది?” అని కాలనీవాసులు నిలదీస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు వదిలేయడం వెనుక ఆంతర్యమేమిటని స్థానికులు మండిపడుతున్నారు.కాలనీ రోడ్లపై ట్రాఫిక్ సమస్యలకు దారితీసే విధంగా, పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించి ఇలాంటి కమర్షియల్ షట్టర్లు నిర్మించడం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారుల జాప్యంపై అనుమానాలు!అక్రమ కట్టడాలను నివారించాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, యజమానితో కుమ్మక్కయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారుల తీరుపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి, నిబంధనలను అతిక్రమించిన సదరు భవన యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ షట్టర్లను తొలగించాలని కాలనీవాసులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.చట్టం అందరికీ సమానమేనని అధికారులు నిరూపించుకోవాలి. అక్రమాలను ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదు” అని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

టిడిపి మహానాడులో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు తెలంగాణ ఏడిక్షనరీలో లేదని చెప్పడం బాధాకరం.

0

ఆయన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను బాధించాయి

ఏ డిక్షనరీలో తెలంగాణ లేకున్నా చరిత్ర ఉన్నంతవరకు, ఇక్కడి ప్రజలు ఉన్నంతవరకు తెలంగాణ ఉంటది

నేతల మెప్పుకోసం తెలంగాణ ప్రాంతాన్ని అవమానించడం సరికాదు

(స్పెషల్ కరస్పాండెంట్)మే,28,మెదక్ టుడే న్యూస్:తెలంగాణ అంటే తెగింపు తెలంగాణ అంటే నీతి నిజాయితీ తోటి వారిని గౌరవించడం తెలంగాణ చరిత్ర తెలియని వారు మాట్లాడుతూ బాగుండేది. తెలంగాణ ఎంతోమంది ప్రాణ త్యాగాలతో నీ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ అనేది మద్రాస్ లో కోర్టులో బడ్రాజు ఉద్యోగం ఇవ్వనందుకు మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి కడపలో డేరాలేసుకుని రాజ్యం నడుపుకొని తెలంగాణ ప్రాంతాన్ని ఆరోజు వాళ్ళ రాజకీయ చతురతతో తెలంగాణ ని ఆంధ్రలో కలుపుకొని ఆంధ్ర రాష్ట్రముగా ఏర్పాటు చేసుకున్న అలాంటివారు డిక్షనల్లో ఉన్నదా. మీరంటే మాకు ఎంతో గౌరవం కానీ పక్కవారి ముందు తెలంగాణ అవమాన పరచడం మీ స్థాయికి తగినది కాదు దయచేసి మీ రాజకీయాన్ని మీ స్వార్థం కోసం వాడుకోండి కానీ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ పదాన్ని పక్కవారి ముందు చిన్నచూపు చూడ డం చాలా విడ్డూరం.పంది వెంకట్ రాంరెడ్డి ఎక్స్ జడ్పీటీసీ ఫరూఖ్ నగర్ మండలంతెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు.

బక్రీద్ పర్వదినాన A6 టీవీ అధినేత మహమ్మద్ అఫ్సర్‌కు జర్నలిస్టుల శుభాకాంక్షలు.

0

సోదరభావం, త్యాగస్ఫూర్తికి ప్రతీక బక్రీద్ : డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు

మత సామరస్యానికి పండుగలు వేదిక కావాలి

(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్, మెదక్ టుడే న్యూస్:మే,28,పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని A6 టీవీ అధినేత మహమ్మద్ అఫ్సర్‌ను పలువురు జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్, సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు, టి.యు.డబ్ల్యూ.జే (ఐ.జే.యు) ఎలక్ట్రానిక్ మీడియా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెక్కల శ్రీశైలం, సీనియర్ జర్నలిస్ట్ ఆకుల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగానికి, విశ్వాసానికి, మానవతా విలువలకు ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో పరస్పర ప్రేమాభిమానాలు, సోదరభావం పెంపొందించడంలో ఇటువంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అలాగే బక్రీద్ సందేశం మనిషిలో సేవాభావాన్ని, పేదల పట్ల కరుణను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సహనం, పరస్పర గౌరవం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా మహమ్మద్ అఫ్సర్ మాట్లాడుతూ జర్నలిస్టులు వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందంగా ఉందని తెలిపారు. సమాజంలో మత సామరస్యాన్ని కాపాడడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు, మిత్రులు పాల్గొని పరస్పరం బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

అకాల వర్షానికి తడిచిన వడ్లు ఆందోళన చెందుతున్న రైతులు.

0

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్.

చేగుంట,మే,27,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోరాత్రి కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాలలో పూర్తిగా తడిసిపోయిన వడ్లు
రైతులు పంటలు పండించి సొసైటీ ఐకేపీ కొనుగోలు కేంద్రాలలోకి వరి ధాన్యాన్ని తీసుకువచ్చి నెలలు దాటిన పూర్తవుతున్న రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వలన రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని రైతులు వర్షం కురవడం వలన వడ్లు పూర్తిగా తడిసిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలను సరైన సమయంలో పంపించకపోవడం మరియు రైస్ మిల్లర్లు జాప్యం చేయడం వలన రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని మండపడ్డారు. రైతులు కష్టపడి పంట పండించిన ధాన్యాన్ని అమ్ముకుంటే పెట్టుబడి కూడా మిగలడం లేదని ఆవేదనలో ఉన్నారని తెలిపారు, అధికారులువెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.