📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 6

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు సమ న్యాయం: నీలం మధు ముదిరాజ్మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేత..

0

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..
శ్వేతను శాలువాతో సత్కరించి, అభినందించిన కాంగ్రెస్ నేత నీలం మధు.

పటాన్ చెరు మే 27,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా అన్ని వర్గాలకూ సమ న్యాయం చేస్తోందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, బహుజన ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ వారసత్వాన్ని గౌరవిస్తూ, ఆమె మనవరాలు చిట్యాల శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో, నూతనంగా నియమితులైన మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత బుధవారం చిట్కుల్ లోని ఆయన కార్యాలయంలో నీలం మధు ముదిరాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి, మిఠాయి తినిపించి నీలం మధు ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, సాయుధ పోరాట యోధులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కొనియాడారు.గతంలో ఇచ్చిన మాట ప్రకారం.. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేడు చిట్యాల శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని కొనియాడారు. ఇది బహుజన వర్గాలకు, ముఖ్యంగా రజక సామాజిక వర్గానికి దక్కిన గౌరవంగా అభిప్రాయపడ్డారు.అనంతరం చిట్యాల శ్వేత మాట్లాడుతూ,తనపై నమ్మకంతో ఇంతటి బాధ్యతాయుతమైన పదవిని అప్పగించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు చిట్యాల శ్వేత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనను అభినందించిన నీలం మధు ముదిరాజ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ,చాకలి ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా గతంలో చిట్కుల్ లో ఏర్పాటు చేసిన ఐలమ్మ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు, రాష్ట్రంలో మహిళల భద్రత, హక్కుల పరిరక్షణకు వారి సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.

లక్ష రూపాయల ఎల్ఓసిని అందజేసిన ఎమ్మెల్యే.

0

పటాన్ చెరు, మే 27,
(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన నోముల నరసింహ గౌడ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక శాసనసభ్యులు జిఎంఆర్ ద్వారా ఎల్ఓసి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన లక్ష రూపాయల విలువైన ఎల్ఓసిని బుధవారం సాయంత్రం పటాన్చెరు లోని తన కార్యాలయంలో నరసింహ గౌడ్ కుటుంబ సభ్యులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కౌన్సిలర్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

గడ్డపోతారం మున్సిపాలిటీలో 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ..

0

జిన్నారం, మే 27,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన ప్రతి మున్సిపాలిటీని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం గడ్డ పోతారం మున్సిపల్ పరిధిలోని మాదారం, లక్ష్మీపతిగూడెం, వావిలాల, గడ్డ పోతారం, అల్లి నగర్, కిస్టాయపల్లి, ఖాజీపల్లి, జిఎంఆర్ కాలనీలలో 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక మున్సిపల్ పాలకవర్గం సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. హాజరైన మున్సిపల్ చైర్మన్ సుష్మ గణేష్, వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు.

గీతంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీ.ఎడ్.2026-27 విద్యా సంవత్సరం నుంచి ఆరంభంఎన్.సి.ఇ.టి.లో అర్హత సాధించడం తప్పనిసరి.

0

పటాన్ చెరు,మే,27,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (సమగ్ర ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాన్ని)ను ప్రవేశపెట్టనుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా బి.ఏ. బి.ఎడ్., బి.ఎస్సీ. బి.ఎడ్. అనే నాలుగేళ్ల డ్యూయల్-మేజర్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను అందిస్తుందని స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రిచా శర్మ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. భారతదేశ జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 చట్రంలో ఇది భాగమని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను డాక్టర్ శర్మ వివరిస్తూ, భవిష్యత్తు కోసం అత్యంత అర్హత కలిగిన, బహుళ-విషయ పరిజ్జానం గల విద్యావేత్తలను తయారు చేసే లక్ష్యంతో, 12 తరగతి లేదా ఇంటర్మీడియెట్ తరువాత వెంటనే విషయ పరిజ్జానాన్ని వృత్తిపరమైన బోధనా శిక్షణతో అనుసంధానించడానికి సమగ్ర ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. పాఠశాల విద్యలోని వివిధ దశలలో ఉన్న విద్యార్థుల కోసం వారి వయస్సుకు తగిన అభ్యాస అనుభవాలను సృష్టించగల ఉత్సాహవంతులైన, వృత్తిపరంగా శిక్షణ పొందిన, సామాజిక బాధ్యత గల ఉపాధ్యాయులను తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలియజేశారు.
నాలుగేళ్ల సమగ్ర కార్యక్రమం, కాబోయే ఉపాధ్యాయులకు విషయం, బోధనా పద్ధతులు, విలువలు, తరగతి గది ఆచరణలో సమగ్ర శిక్షణను అందించడమే ప్రధాన లక్షాలుగా డాక్టర్ రిచా పేర్కొన్నారు. ఈ పాఠ్యప్రణాళిక 21వ శతాబ్దపు ప్రపంచ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటూనే, బాల్య దశ సంరక్షణ, విద్య (ఈసీసీఈ), ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం (ఎఫ్ఎల్ఎన్), సమ్మిళిత విద్య, భారతీయ విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలకు కూడా ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ఈ సమగ్ర అండర్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ విద్యా కార్యక్రమం, కొత్త పాఠశాల నిర్మాణంలోని నాలుగు దశలైన- ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ (5+3+3+4) కోసం ఉపాధ్యాయులను సిద్ధం చేస్తుందని డాక్టర్ రిచా వివరించారు. విద్యార్థులు సాంప్రదాయ ఐదేళ్ల మార్గానికి బదులుగా తమ ఉపాధ్యాయ విద్యను నాలుగేళ్లలో పూర్తి చేయవచ్చని, తద్వారా ఒక విద్యా సంవత్సరాన్ని ఆదా చేసుకోవచ్చని ఆమె తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను, ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 223 భాగస్వామ్య సంస్థలలో (ఐఐటీలు, ఎన్ఐటీలు, ప్రాంతీయ విద్యా సంస్థ (ఆర్ఐఈ)లు, కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలతో పాటు గీతంలో కూడా) ఈ కోర్సును అందిస్తున్నారని, దాదాపు 16,950 సీట్లు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని డాక్టర్ రిచా శర్మ పేర్కొన్నారు. జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎన్.సి.ఇ.టి.) 2026 ద్వారా ఈ కోర్సులో ప్రవేశాలను నిర్వహిస్తారని, ఈ పరీక్షలో సాధించిన అర్హతను బట్టే ఆయా సంస్థలు ప్రవేశాలు కల్పిస్తాయని తెలిపారు.మరిన్ని వివరాల కోసం, ఆసక్తి గల విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు 95 42 42 42 59 / 66 లను సంప్రదించాలని, లేదా గీతం అధికారిక వెబ్ సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. గీతం . ఈ డి యూ ను సందర్శించాలని డాక్టర్ రిచా సూచించారు.

లారీల కోసం రోడ్డెక్కిన అన్నదాతలు.

0

కొల్చారం,మే,27,మెదక్ టుడే న్యూస్:లారీలు రాక కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం నిలిచిపోయిందని రైతులు రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. బుధవారం కొల్చారం మండలం చిన్న గణపురం గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. 25 రోజులుగా కొనుగోలు కేంద్రంలో వడ్లు నిలిచిపోవడంతో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి అరిసిపోయి తూకం వేసిన వడ్లు అలానే ఉండిపోవడంతో నష్టపోతున్నామని రైతులు ఆందోళనకు దిగారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రంలోని వడ్లు తూకం వేసి ఉండడంతో తరుగు పేరిట రైతులకు నష్టం జరగడంతో పాటు వర్షంతో మరోపక్క గుండెలు అదురుతున్నాయంటూ ఆందోళనకు దిగారు. ఆరుగాలం అప్పుడు తెచ్చి కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులకు నష్టం మిగిలిస్తే రైతుల పరిస్థితి అగ్గమ్మ గోచరంగా మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా వర్షాలు పడుతుండడంతో వర్షాకాలం సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి కాబట్టి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వారి ధాన్యం వెంటనే లారీల్లో తరలించి రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే రైతులే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

గుమ్మడిదల మున్సిపాలిటీలో 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

0

గుమ్మడిదల,మే,26,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధినూతనంగా ఏర్పడిన గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం, దోమడుగు, వీరన్న గూడెం, బొంతపల్లి, గుమ్మడిదలలో 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు స్థానిక పాలకవర్గం సభ్యులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రతి వార్డులో మౌలిక వసతులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని వివిధ పరిశ్రమల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్యా గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దశరథ్, సీనియర్ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను కలిసిన మాద్రి పృథ్వీరాజ్.

0

పటాన్‌చెరు,మే,26,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం పటాన్‌చెరు నియోజకవర్గ సభ్యత్వ బాధ్యునిగా రాష్ట్ర కమిటీ నియమించిన, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను ఎం.డి.ఆర్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు, బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో తాము సైతం చిత్తశుద్ధితో కృషి చేస్తామని శ్రీనివాస్‌కు హామీ ఇచ్చారు. పటాన్‌చెరు మరియు జేపీ కాలనీ పరిధిలోని ప్రాంతాల్లో, స్థానిక శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి మరియు నియోజకవర్గ సమన్వయకర్త ఆదర్శ్ రెడ్డిల నాయకత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు.భవిష్యత్తులో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలపడి, తిరిగి విజయపధంలో దూసుకెళ్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా కలిసి పనిచేసి సభ్యత్వ నమోదును దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు.

గణితశాస్త్రంలో కస్ప శ్రీలతకు పీహెచ్.డీ.

0
Oplus_16908288

పటాన్ చెరు,మే,26,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత, గణాంక శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని కస్ప శ్రీలత డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘నానోద్రవాలు, హైబ్రిడ్ నానోద్రవాలు అయస్కాంత-ద్రవగతి ప్రవాహ విశ్లేషణ’ చేసి, ఆమె సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివారెడ్డి షేరి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ డాక్టరల్ పరిశోధన, శక్తి వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్ శీతలీకరణ, పర్యావరణ నమూనా వంటి అధునాతన సాంకేతిక అనువర్తనాలలో ఉష్ణ, ద్రవ్యరాశి బదిలీ సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టినట్టు తెలియజేశారు.ఈ అధ్యయనం, నానోద్రవాలు, హైబ్రిడ్ నానోద్రవాలతో కూడిన సంక్లిష్ట నాన్-లీనియర్ ప్రవాహ వ్యవస్థలను విశ్లేషించడానికి గాలెర్కిన్ ఫైనైట్ ఎలిమెంట్ పద్ధతిని, మ్యాట్ లాబ్-ఆధారిత సిమ్యులేషన్లను ఉపయోగించిందన్నారు. ఈ పరిశోధన ఫలితాలు ఉష్ణ-ద్రవ వ్యవస్థలు, గతిశాస్త్ర పరిశోధనల పురోగతికి గణనీయంగా దోహదపడతాయని వివరించారు. డాక్టర్ శ్రీలత సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రెజా, గణిత, గణాంక శాస్త్ర విభాగాధిపతి డాక్టర జాదవ్ గణేష్, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

హరీష్‌రావుతో భేటీ అయిన భూపాల్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి.

0

పటాన్‌చెరు,మే,26,(మెదక్ టుడే) న్యూస్: ప్రతినిధి.అమెరికా పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన మాజీ మంత్రి, అసెంబ్లీ ఉపనేత శ్రీ తన్నీరు హరీష్‌రావును తెలంగాణ మాజీ ప్రోటెం చైర్మన్ శ్రీ వి. భూపాల్ రెడ్డి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేలా పలు అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది.

బ్లూ స్టార్ ఈవెంట్స్ పురస్కారం: ‘రాష్ట్రీయ దివ్య ప్రతిభా సమ్మాన్’ కు మీర్ గియాసుద్దీన్ ఎంపిక.

0
Oplus_16908288

చేగుంట,మే,26,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, మెదక్ జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక సేవా నిర్వాహకులు వడియారం గ్రామం మీర్ గియాసుద్దీన్ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. బ్లూ స్టార్ ఈవెంట్స్ సంస్థ దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు అందజేసే “రాష్ట్రీయ దివ్య ప్రతిభా సమ్మాన్ – 2026” అవార్డుకు తెలంగాణ రాష్ట్రం నుండి ఆయనను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. మీర్ గియాసుద్దీన్ సమాజంలో వెనుకబడిన, ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగుల శ్రేయస్సు కోసం అందిస్తున్న “దివ్యాంగ్ సేవ”లను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఆయన నిరంతర అంకితభావం, సమాజంపై ఆయన చూపిన సానుకూల ప్రభావాన్ని అభినందిస్తూ సంస్థ ప్రతినిధులు ఎంపిక లేఖను అందజేశారు. మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తికి ఈ జాతీయ స్థాయి గుర్తింపు దక్కడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు మరియు పలువురు సామాజిక వేత్తలు హర్షం వ్యక్తం చేస్తూ మీర్ గియాసుద్దీన్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.