MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 5:35 am Digital Edition : Shiva Kumar

రోడ్డు విస్తరణ పనులకు అడ్డంకులు సృష్టించకండి-స్థానికుల ఆందోళన.

రామచంద్రాపురం,జూన్,9,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.ప్రజల రాకపోకల సౌకర్యార్థం, ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో చేపట్టిన రామచంద్రాపురం బస్ డిపో – బీరంగూడ ప్రధాన రహదారి విస్తరణ పనులకు ‘భెల్’ ఉన్నతాధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనం కోసం సాగుతున్న పనులను నిలిపివేయడం ఏమాత్రపు సమంజసం కాదని వారు మండిపడ్డారు.గత అరవై ఏళ్లుగా వినియోగంలో ఉన్న ఈ రహదారిని విస్తరించేందుకు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పనులు ప్రారంభమయ్యాయి. కాలువ పక్కన కొనసాగుతున్న ఈ పనులను భెల్ అధికారులు అడ్డుకోవడంతో స్థానికులు నిరసనకు దిగారు.స్థానికుల గోడు.. అధికారుల తీరుపై మండిపాటు:ఈ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అనేక ప్రాంతాల ప్రజలు ఈ మార్గాన్నే నమ్ముకుని ప్రయాణిస్తుంటారు. ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించే ఉద్దేశంతో చేపట్టిన ఈ రహదారి విస్తరణ పనులను ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.మద్దతు తెలిపిన నాయకులు:ఈ నిరసన కార్యక్రమంలో బృందావన్ కాలనీ అధ్యక్షుడు యాదగిరి గౌడ్, నాయకులు యూనుస్, షౌకత్ అలీతో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు. రహదారి విస్తరణకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, అధికారులు పట్టువిడుపు ధోరణితో వ్యవహరించి అభివృద్ధి పనులకు సహకరించాలని వారు కోరారు.