అమీన్పూర్,జూన్,10,
(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం, అమీన్పూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాట రాజేష్ గౌడ్ విస్తృతంగా పర్యటించారు. కాలనీ వాసులతో నేరుగా సమావేశమై, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కాలనీ ప్రజలు తాగునీటి ఎద్దడి, డ్రైనేజీ సమస్యలు, అస్తవ్యస్తంగా ఉన్న పారిశుద్ధ్యం మరియు వెలుగునివ్వని వీధి దీపాల గురించి ఆయన ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలను ఓర్పుగా విన్న కాట రాజేష్ గౌడ్ , కాలనీ వాసులకు భరోసా కల్పించారు.కాలనీ వాసులకు ఆయన ఇచ్చిన ప్రధాన హామీలు:“మీ కష్టాలు నాకు తెలుసు. మీ సమస్యలను పరిష్కరించడం నా బాధ్యత. తాగునీరు, డ్రైనేజీ వంటి ప్రాథమిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యాన్ని సహించే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు.”ఈ సమస్యలను వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు గారి దృష్టికి మరియు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను. అధికారులు స్పందించే వరకు నిరంతరం ఒత్తిడి తీసుకువస్తాను” అని హామీ ఇచ్చారు.”రాజకీయాలకు అతీతంగా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే.. ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను. మీ కుటుంబ సభ్యుడిగా నేను మీ పక్షాన పోరాడుతాను” అని ఆయన పేర్కొన్నారు.ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పని చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ కాలనీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఇతర ముఖ్య నేతలు మరియు భారీ సంఖ్యలో కాలనీ వాసులు పాల్గొన్నారు.


