
మెదక్ ఖి ల్లాకు దేశ స్థాయిలో గుర్తింపు చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.గురువారం మెదక్ కిల్లాను సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,టూరిజం సెక్రటరీ వాణి ప్రసాద్ సహకారంతో మెదక్ ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి రాష్ట్ర, దేశ స్థాయిలో ముందుచ్చుతామని దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు.ప్రజాపాలనప్రగతిప్రణాళికకార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అదనపు కలెక్టర్ నగేష్ ఇతర అధికారులు, మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ తో మెదక్ ఖిల్లా ను సందర్శించారు.మెదక్ ఖిల్లపైన ఉన్న గజశాల, దర్వాజాలు,జైలును తదితర చారిత్రక అంశాలను కలెక్టర్ ప్రతిమ సింగ్ అడిగి తెలుసుకున్నారు.. మెదక్ ఖిల్ల పైన ఎక్కడ డ్యామేజ్ అయింది, ఎక్కడ శిథిలావస్థకు చేరింది అనే అంశాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు..అందులో భాగంగా ఈరోజు ఖిల్లా పైన అడ్డదిడ్డంగా పెరిగిన చెట్ల మొక్కలను, ముళ్ల పొదలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు.మెదక్ జిల్లాలో దొరికిన పురావస్తు విగ్రహాలు, తదితర శాసనాలు, వివిధ అంశాలతో మెదక్ ఖిల్లపై మ్యూజియంను ఏర్పాటు చేసి మెదక్ జిల్లా చరిత్రను చెప్పే విధంగా పర్యాటకులకు అందుబాటులో ఉంచుతామన్నారు.జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీం కింద నిధులు తీసుకొచ్చి మెదక్ జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామన్నారు… మెదక్ ఖిల్లాపై లెదర్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.రాబోవు రోజుల్లో ఖిల్లా పై సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి అనువైన ప్రదేశం అని కొనియాడారు.మెదక్ జిల్లా హైదరాబాద్ కు దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలను గుర్తించి మరింత అభివృద్ధి చేస్తామన్నారు..

