📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 8

ఐకేపీ మహిళా సంఘ భవనానికి శంకుస్థాపన చేసిన వడియారం గ్రామసర్పంచ్ అంకన్న సాయికుమార్ గౌడ్.

0

చేగుంట,మే,25,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంవడియారం గ్రామంలో ఐకేపీ మహిళా సంఘ భవన నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల నిధులతో చేపట్టనున్న పనులకు గ్రామ సర్పంచ్ సాయి కుమార్ గౌడ్ పాలక వర్గ సభ్యులు మహిళ సంఘం సభ్యుల తో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మహిళలకు సమావేశాలు నిర్వహించుకునేందుకు సౌకర్యవంతమైన భవనం అందుబాటులోకి రానుందని తెలిపారు. నిధులు మంజూరు చేసిన ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి,దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయికుమార్ గౌడ్,ఉప సర్పంచ్ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి విజయ్ పాల్ రెడ్డి, సీసీలు శ్వేత, శంకర్, వార్డు సభ్యులు జనార్ధన్ గౌడ్, గయాజ్, అనిల్, కవిత, సీఏ గాయత్రి, గ్రామ నాయకులు రాజు, నదీం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఉపసర్పంచ్ రఫీకి పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత.

0

చేగుంట,మే,25,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం ఉదయవరం (వడియారం) గ్రామ రోడ్డు పక్కన నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి, భువనేశ్వరి మాత, శ్రీ పెద్దిరాజు ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాల ఆహ్వాన పత్రికను ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు కలిసి చేగుంట ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీకి ఘనంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూన్ 26వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వేద పండితులు శ్రీ కృష్ణం రఘురామ శర్మ, శ్రీ రేవునూరి వెంకటేశ్వర శర్మల ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయని తెలిపారు. జూన్ 26న విగ్రహాల ఊరేగింపు, 27న యాగశాల ప్రవేశం, 28న చండీహోమం, ముఖ్యంగా జూన్ 29న ఉదయం 08:26 గంటలకు ప్రాణప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని, జూన్ 30న బండ్ల ప్రదక్షిణతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఈ మహాత్కార్యానికి ఉపసర్పంచ్ రఫీతో పాటు భక్తులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. పత్రికను స్వీకరించిన ఉపసర్పంచ్ రఫీ.. కార్యక్రమానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం బాధ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

కూలి పనికి వెళ్లిన కవిత అదృశ్యం దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ భిక్యా నాయక్.

0
Oplus_16908288

చేగుంట,మే,25,మెదక్ టుడే న్యూస్:ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన దేశెట్టి కవిత భర్త గంగాధర్, వయసు 30 సంవత్సరాలు కులం వడ్డెర వృత్తి కూలి పని గాను నిన్న తేదీ 24-05-2026 నాడు ఉదయం ఎనిమిది గంటలకు కూలి పని నిమిత్తం ఇంటి నుండి బయలుదేరి మేడ్చల్ కు వెళ్లినది కానీ ఇప్పటి వరకు కవిత తిరిగి ఇంటికి రాలేదు. కవిత బావ అయినా దేశెట్టి లక్ష్మణ్ తండ్రి మల్లయ్య వయసు 45 సంవత్సరాలు కులం వడ్డెర వృత్తికూలి పని వారి ఫిర్యాదు మేరకు భిక్య నాయక్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చేగుంట పిఎస్ లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడమైనది.

అధికారులు స్పందించాలి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి చేగుంట ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మహమ్మద్ రఫీ.

0

చేగుంట,మే,25,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో పిఎసిఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం చేగుంట ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మహమ్మద్ రఫీ పరిశీలించారు.వారు మాట్లాడుతూ రైస్ మిల్లులకు వెళ్లిన లారీలు వెంటనే అన్లోడ్ చేయాలని సుమారు ఇక్కడ 3000 బస్తాల ధాన్యం నిల్వ ఉందని,ఇంకా కాంటా పెట్టని ధాన్యం చాలా ఉన్నది. త్వరగా అధికారులు స్పందించి రైస్ మిల్లులలో ఉన్న లారీలను త్వరగా అన్లోడ్ అయ్యే విధంగా చూడాలని వారన్నారు ఇక్కడ రైతులకు చాలా ఇబ్బంది ఉన్నది కొంచెం వర్షం వచ్చినా ధాన్యం తడిసిపోయి చేతికి వచ్చిన పంట కరాబ్ అవుతుంది అందువల్ల అధికారులు తొందరగా స్పందించి రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఉప సర్పంచ్ తో పాటు గ్రామ రైతులు ఉన్నారు.

ఒరిజినల్ భూమి పత్రాలు పోగొట్టుకున్నారు: ఆచూకీ దొరికితే తెలపాలని విజ్ఞప్తి.

0

చేగుంట,మే,25,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, వెల్దుర్తి గ్రామానికి చెందిన కిష్టం రంగయ్య (తండ్రి బాల నరసయ్య) చేగుంట మండల కేంద్రంలో తన భూమికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు (ల్యాండ్ డాక్యుమెంట్స్) పోగొట్టుకున్నట్లు తెలిపారు. బాధితుడి వివరాల ప్రకారం.. ఆయన వెల్దుర్తి నుండి చేగుంటకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వచ్చారు. చేగుంటలో దిగిన తర్వాత ఇక్కడి ఒక జిరాక్స్ సెంటర్‌కు వెళ్లి తన బ్యాగును పరిశీలించగా అందులో ఉండవలసిన ఒరిజినల్ డాక్యుమెంట్ పోయినట్లు గుర్తించారు. పోగొట్టుకున్న పత్రం చేగుంట గ్రామంలోని ఎన్జీవోస్ కాలనీకి సంబంధించిన స్థలం డాక్యుమెంట్ అని, దాని ఒరిజినల్ డాక్యుమెంట్ నెంబర్: 863/98 అని బాధితుడు రంగయ్య ఆవేదనతో తెలిపారు. కావున ప్రయాణికులు లేదా స్థానికులకు ఎవరికైనా ఈ నెంబర్ గల ఒరిజినల్ ల్యాండ్ డాక్యుమెంట్ లభించినట్లయితే, మానవతా దృక్పథంతో కింద పేర్కొన్న ఫోన్ నెంబర్లకు సంప్రదించి సమాచారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఫోన్ నెంబర్లు 9394571393, 9666950677, 9010360853.

ఉపసర్పంచ్ రఫీకి పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవ.

0

చేగుంట,మే,25,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం ఉదయవరం (వడియారం) గ్రామ రోడ్డు పక్కన నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి, భువనేశ్వరి మాత, శ్రీ పెద్దిరాజు ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాల ఆహ్వాన పత్రికను ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు కలిసి చేగుంట ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీకి ఘనంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూన్ 26వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వేద పండితులు శ్రీ కృష్ణం రఘురామ శర్మ, శ్రీ రేవునూరి వెంకటేశ్వర శర్మల ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయని తెలిపారు. జూన్ 26న విగ్రహాల ఊరేగింపు, 27న యాగశాల ప్రవేశం, 28న చండీహోమం, ముఖ్యంగా జూన్ 29న ఉదయం 08:26 గంటలకు ప్రాణప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని, జూన్ 30న బండ్ల ప్రదక్షిణతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఈ మహాత్కార్యానికి ఉపసర్పంచ్ రఫీతో పాటు భక్తులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. పత్రికను స్వీకరించిన ఉపసర్పంచ్ రఫీ.. కార్యక్రమానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం బాధ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

నేటి నుంచే రోహిణి కార్తె.. భానుడి భగభగలు-అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక!

0

(స్టేట్ బ్యూరో)మే,25,మెదక్ టుడే న్యూస్:నేటి (మే 25) నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. జూన్ 8వ తేదీ వరకు కొనసాగే ఈ కార్తె కాలంలో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండ వేడిమి వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్, తీవ్ర అలసట, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజంతా తరచుగా నీరు తాగాలని, కేవలం దాహం వేసినప్పుడే కాకుండా మధ్యమధ్యలో పానీయాలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ ధరించాలని, లేత రంగు కాటన్ దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. శరీరాన్ని చల్లబరిచేందుకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం మరియు ఓఆర్‌ఎస్ (ORS) పానీయాలు తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పుచ్చకాయ, దోసకాయ, ఖర్బూజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చని స్పష్టం చేశారు.

అక్షర యోధుల పోరాటానికి ఫలితం.లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సాధనమీడియా కృషితోనే ప్రజల ఆకాంక్ష నెరవేరింది.

0

పాత్రికేయుల సేవలను కొనియాడిన మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.

(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,మే,24,మెదక్ టుడే న్యూస్:లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సాధనలో మీడియా పోషించిన పాత్ర అమూల్యమని మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రశంసించారు. ప్రారంభం నుంచి చివరి వరకు పాత్రికేయులు అక్షరాయుధంతో ప్రజల తరఫున పోరాడి పాలకులను అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. జలాశయ సాధనే లక్ష్యంగా వార్తలు, కథనాలు ప్రచారం చేసి ప్రజా సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా కీలకంగా వ్యవహరించిందన్నారు.ఈ సందర్భంగా పాత్రికేయుల తరఫున సీనియర్ జర్నలిస్ట్ కేపీకి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి ఆంజనేయులు గౌడ్‌కు శాలువాలతో ఘన సన్మానం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మీడియా నిష్పక్షపాత ధోరణితో పనిచేసినప్పుడే ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు సులభమవుతాయని తెలిపారు. లక్ష్మీదేవిపల్లి అంశంలో మీడియా చూపిన పట్టుదల వల్లే పాలకులు స్పందించి అభివృద్ధి దిశగా అడుగులు వేసారని అన్నారు.
ప్రజల సమస్యలపై ఎవరైనా నిర్లక్ష్యం వహించినా ప్రశ్నించే హక్కు మీడియాకే ఉందని, భవిష్యత్తులో కూడా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా జర్నలిస్టులు ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా వెలువడిన కథనాలు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సాధనను వేగవంతం చేశాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పాత్రికేయులు రంగనాథ్, శరత్, రాఘవేందర్ గౌడ్, లక్కాకుల రమేష్, సరాపు రమేష్, నరసింహారెడ్డి, సాయి రెడ్డి, రాకేష్, మల్లికార్జున్, ధరంపాల్, షకీల్, రియాజ్, దర్శనం శంకర్ తదితరులు పాల్గొన్నారు.

నాలుగు దశాబ్దాల ప్రేమ బంధానికి ఘన వేడుకనీరుడు అశోక్ ముదిరాజ్ – లక్ష్మీబాయి దంపతుల 40వ వివాహ వార్షికోత్సవం.

0


రాష్ట్ర నాయకులు, సామాజిక ప్రముఖుల సమక్షంలో అభినందనల వెల్లువ
“ఆదర్శ దాంపత్యానికి ప్రతీక” అంటూ కొనియాడిన నేతలు.
శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన అశోక్ ముదిరాజ్
(స్పెషల్ కరస్పాండెంట్)హైదరాబాద్,మే,24,మెదక్ టుడే న్యూస్: నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర ఆర్టీఐ అధ్యక్షులు, జనతా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరుడు అశోక్ ముదిరాజ్ గారు మరియు వారి సహచరి లక్ష్మీబాయి దంపతుల 40వ వివాహ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు, మిత్రులు, అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఆనందోత్సాహాలతో కళకళలాడింది.
ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి. సర్వేధర్ మాట్లాడుతూ, “నాలుగు దశాబ్దాలుగా ప్రేమ, పరస్పర అవగాహన, కుటుంబ విలువలు, సమాజ సేవ అనే నాలుగు స్తంభాలపై అశోక్ ముదిరాజ్ – లక్ష్మీబాయి దాంపత్య జీవితం నిలిచింది” అని కొనియాడారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ సగ్గు వేణుమాధవ్ మాట్లాడుతూ, “ప్రజా సేవలో ముందుండే అశోక్ ముదిరాజ్ కుటుంబ బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వర్తిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు” అన్నారు.
స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దామోదర్ గుప్తా మాట్లాడుతూ, “సామాజిక సేవ, మానవ హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారంలో అశోక్ ముదిరాజ్ చూపుతున్న చొరవ ప్రశంసనీయం. లక్ష్మీబాయి గారి సహకారం ఆయన విజయాలకు బలమైన ఆధారం” అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ స్పోక్స్ పర్సన్, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.అభిమానుల శుభాకాంక్షలతో సందడిగా వేడుకలు
వేడుకలో పాల్గొన్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు దంపతులకు పుష్పగుచ్ఛాలు అందజేసి మరెన్నో సంవత్సరాలు ఆయురారోగ్యాలతో, ఆనందాలతో జీవించాలని ఆకాంక్షించారు. మనవళ్లు యక్షిత్, తక్షు, యువాన్, వివాన్, మనవరాలు యామిని సందడితో వేడుక మరింత ఆహ్లాదకరంగా మారింది.
“మీ అందరి ప్రేమాభిమానాలు మరువలేనివి”
ఈ సందర్భంగా నీరుడు అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ, తమ వివాహ వార్షికోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించి ఆశీస్సులు అందించిన రాష్ట్ర అధ్యక్షుడు బి. సర్వేధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సగ్గు వేణుమాధవ్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దామోదర్ గుప్తా, డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు సహా ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యులు, మిత్రులు, సహచరుల ప్రేమాభిమానాలు తమకు మరింత బాధ్యతను పెంచాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాజేందర్ కుమార్ నలరి, పటాన్చెరువు కాంగ్రెస్ నాయకుడు నవీన్ కుమార్ ముదిరాజ్, ఆషా, వాసంతి, అరుణ్ యాదవ్, మల్లేష్ యాదవ్, సత్యం ముదిరాజ్, ఆంజనేయులు ముదిరాజ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నర్సింగ్ రావు ముదిరాజ్, సాయినాథ్, సాయి గణేష్, మౌనిక, పృథ్వీరాజ్, ప్రీతి, యామిని తదితరులు పాల్గొన్నారు.

చేగుంట పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

0

18 ఏళ్ల తర్వాత ఒక్కటైన మిత్రులు

చేగుంట,మే,24,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2007-08 విద్యాసంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన వేడుక వడియారంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. దాదాపు 18 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత సహచర మిత్రులంతా ఒకరినొకరు కలుసుకోవడంపై పూర్వ విద్యార్థులు అమితానందం వ్యక్తం చేశారు. నాటి పాఠశాల జ్ఞాపకాలను, చిన్ననాటి ముచ్చట్లను ఈ సందర్భంగా ఒకరితో ఒకరు పంచుకుంటూ సందడి చేశారు. ఈ ఆత్మీయ కలయిక తమ జీవితంలో ఒక మధురమైన రోజని వారు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నాటి పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు బాలకృష్ణ, గర్దాస్ మనోహర్ రావు, చల్లా లక్ష్మణ్, రాజేశ్వరిలను విద్యార్థులు ఘనంగా సన్మానించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సమ్మేళనంలో నాటి పదవ తరగతి పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.