చేగుంట,మే,24,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలో పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడే జీలుగ విత్తనాలు 50 శాతం సబ్సిడీపై అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ తెలిపారు. వర్షాకాలం పంటల సాగుకు ముందు భూసారాన్ని పెంచేందుకు ఈ పచ్చిరొట్ట ఎరువులు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. మార్కెట్లో 30 కిలోల జీలుగ విత్తనాల బస్తా పూర్తి ధర రూ. 4,905 కాగా, ప్రభుత్వం కల్పిస్తున్న 50 శాతం సబ్సిడీ పోను రైతులు కేవలం రూ. 2,451 చెల్లించి ఈ విత్తనాలను పొందవచ్చునని వివరించారు. ఈ సబ్సిడీ విత్తనాలు కావలసిన మండల పరిధిలోని రైతులు తమ పట్టాదార్ పాస్బుక్, ఆధార్ కార్డులను తీసుకువచ్చి విత్తనాలను పొందాలని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ కోరారు.
ధాన్యం కొనకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాంఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
చేగుంట,మే,24,మెదక్ టుడే న్యూస్:నార్సింగి, చేగుంట మండలాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇరవై రోజులుగా రైతులు వేచిచూస్తున్నప్పటికీ.. సరిపడా లారీలు లేకపోవడం, కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎంఆర్ఓ, ఏఓలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు.వడదెబ్బల కారణంగా ఇద్దరు రైతులు అస్వస్థతకు గురైన ఘటనలను ప్రస్తావిస్తూ, రైతులు తీవ్ర మానసిక వేదనలో ఉన్నారని తెలిపారు. “మా ధాన్యాన్ని కొనకపోతే ఆత్మహత్యలు చేసుకుంటాం, ధాన్యానికి నిప్పంటిస్తాం” అనే స్థితికి రైతులను నెట్టివేసిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి, సంబంధిత మంత్రులు,అధికారులు ఎవరూ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.ఈ ప్రాంతంలో భారీగా వరి దిగుబడి వచ్చినప్పటికీ, ఉన్న ఎనిమిది రైస్ మిల్లుల్లో కూడా ధాన్యం సక్రమంగా దింపడం లేదని, దింపిన చోట్ల కిలోకు కిలోన్నర వరకు తరుగు పేరుతో కోతలు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంపై జిల్లా సివిల్ సప్లై అధికారులు, కలెక్టర్ స్పందించి రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై ధర్నాలు చేసినా, వినతిపత్రాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదని, బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. మరో రెండు మూడు రోజుల్లో మొత్తం ధాన్యాన్ని ఎత్తకపోతే అసెంబ్లీ ముట్టడికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఏ గ్రామంలో ఎంత ధాన్యం వస్తుంది, రైస్ మిల్లుల సామర్థ్యం ఎంత అనేది ముందస్తు ప్రణాళికతో పనిచేసేవాళ్లమని గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల బాధలను పట్టించుకోకుండా కేవలం సమావేశాలు, ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
చేగుంట గ్రామంలో సోదర దినోత్సవం ఘనంగా నిర్వహించబడినది.
చేగుంట,మే,24,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని అంబేద్కర్ యువజన సంగ్ ఆధ్వర్యంలో అన్నదమ్ముల దినోత్సవం ఘనంగా నిర్వహించబడినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా వాలీబాల్ అధ్యక్షుడు అఐత పరంజ్యోతి హాజరై కేక్ కట్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మన జీవితంలో అన్న ప్రాముఖ్యత ఎక్కువ అమ్మానాన్న తర్వాత ఆలనా పాలన ధైర్యం నమ్మకం సోదరుడే, తల్లిలా ప్రేమ ఆప్యాయతలు చూపించేది అక్కాచెల్లెళ్లు తల్లి తండ్రుల బాధ్యతలు వారి భుజాలపై వేసుకొని మోసేది అన్న తమ్ముళ్లు అని వారు అన్నారు. అందరూ సంతోషంగా ఉండాలి అందరితో కలిసి మెలిసి ఉండాలి అని వారు కోరారు.ఈ కార్యక్రమంలో అఐత పరంజ్యోతి,సోమ సత్యనారాయణ, ఎర్ర యాదగిరి, అంబేద్కర్ యువజన సంగ్ అధ్యక్షుడు విష్ణు,అక్బర్,బాలేష్,సాదుల్లా, నరేష్,ఎల్లేష్, సల్లుపాష,బాబు,దాసరి సురేష్,కొండి స్వామి,తదితరులు పాల్గొన్నారు.

ఆవులను కొనవద్దు కుర్బానీ ఇవ్వవద్దు చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ.
చేగుంట,మే,24,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, బక్రీద్ పండుగ సమీపిస్తున్న వేళ ముస్లిం సోదరులు ఎవరూ ఆవులను కొనవద్దని, కుర్బానీ ఇవ్వవద్దని చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ముస్లిం సోదరులంతా ఆవులకు బదులుగా మేకలు, గొర్రెలు, పొట్టేళ్లను మాత్రమే కుర్బానీ ఇవ్వాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతు సోదరులు తమ వద్దకు వచ్చి ఆవులను కొనమని అడిగినా.సున్నితంగా తిరస్కరించాలని కోరారు.మన హిందూ సోదరులు ఆవును తల్లిగా, గోమాతగా భావించి ఎంతో పవిత్రంగా పూజిస్తారని, వారి యొక్క మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. సమాజంలో మతసామరస్యం ఇనుమడించేలా, అందరి భావాలను గౌరవిస్తూ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, అందుకే దయచేసి ఎవరూ ఆవులను కొనవద్దని, కుర్బానీ ఇవ్వవద్దని మహమ్మద్ రఫీ విజ్ఞప్తి చేశారు.
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య.
కొల్చారం,మే,24,(మెదక్ టుడే న్యూస్):అప్పుల బాధతో ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల కేంద్రమైన కొల్చారంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రమైన కొల్చారం గ్రామానికి చెందిన మంగలి వెంకటేశం 48 సంవత్సరాలు వృత్తి వ్యవసాయం ఆదివారం నాడు ఉదయం మృతుని భార్య కూలీ పనుల నిమిత్తం వెళ్లిపోయినా తర్వాత మధ్యాహ్నం అందాజ 12 గంటల సమయంలో వెంకటేశం ఇంట్లో ఉరి వేసుకున్నట్లు మా మామ మంగళ కిష్టయ్య ఫోన్ చేసి ఇంట్లో ముందు రూమ్లో నైలాన్ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలుపగా వెంటనే నేను వచ్చి చూడగా నిజంగానే నా భర్త వెంకటేశం ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు నా భర్త వెంకటేశంకు గతంలో రోడ్డు ప్రమాదం అయినందున కొన్ని అప్పులు అయినవి నూతనంగా ఇల్లు నిర్మించినందువలన అప్పులు ఆయనవి అట్టి అప్పులు ఎలా తీర్చాలని గత రెండు రోజుల నుండి తనలో తాను బాధపడుతున్నాడు అదే బాధతో ఇంట్లో ఎవరు లేనిది చూసి నల్లని నైలాన్ తాడుతో తనంతట తానుగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు నా భర్త మంగళి వెంకటేశం మరణం పై మాకు ఎలాంటి అనుమానం లేదు అని మృతుని భార్య మంగలి రేణుక పోలీసులకు వెల్లడించారు. మృతునికి ఒక కుమారుడు ఉన్నాడు మృతుని భార్య రేణుక పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ అహ్మద్ మోహినుద్దీన్ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
పాము కాటుతో బాలుడు మృతి.
కొల్చారం,మే,24,మెదక్ టుడే న్యూస్:పాము కాటుతో బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని వరిగుంతం గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన దండు సుజిత్ కుమారుడు దండు సతీష్ (7) శనివారం రాత్రి ఇంటి ముందు తన తాత మా అన్నయ్యతో కలిసి ఇంటి ముందు వాకిట్లో నిద్రించాడు. కాగా అర్ధరాత్రి సమయంలో బాలుని చేతి వేలుకు ఏదో కుట్టినట్లు అనిపించగా వెంటనే లేచి తండ్రికి తెలిపాడు. బాలుని తండ్రి సుజిత్ కుమారుని చికిత్స నిమిత్తం మెదక్ ఏరియా హాస్పిటల్ తరలించాడు. రాత్రి అక్కడ చికిత్స తీసుకుని, ఆదివారం మెదక్ ఎం సి హెచ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం బాలుడు మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని తర్యాప్తు చేపట్టారు.

వివో ఏ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
కొల్చారం,మే,24,మేటర్ టుడే న్యూస్:పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని వీఈవివో ఏ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి… పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని వివో ఏల సంఘం కొల్చారం మండల మాజీ అధ్యక్షుడు పులిబోయిన నర్సింలు అన్నారు.మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయం ఎదుట జేఏసీ పిలుపు మేరకు ఆదివారం రెండో రోజు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల, గ్రామ సంఘాల వి ఏవోలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వడ్ల మంజుల, ఉపాధ్యక్షులు కె.అశోక్ వివో ఏలు నర్సింలు, యాదగిరి, పద్మ, లక్ష్మణ్, స్వరూప, చమంత, జోసెఫ్, మంజుల, సుమలత, శ్యామల, భారతి, రేణుక మోతిలాల్ పాల్గొన్నారు.వోల సంఘం కొల్చారం మండల మాజీ అధ్యక్షుడు పులిబోయిన నర్సింలు అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయం ఎదుట జేఏసీ పిలుపు మేరకు ఆదివారం రెండో రోజు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల, గ్రామ సంఘాల వి ఏవోలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వడ్ల మంజుల, ఉపాధ్యక్షులు కె.అశోక్ వివో ఏలు నర్సింలు, యాదగిరి, పద్మ, లక్ష్మణ్, స్వరూప, చమంత, జోసెఫ్, మంజుల, సుమలత, శ్యామల, భారతి, రేణుక మోతిలాల్ పాల్గొన్నారు.

లారీల కోసం రోడ్డెక్కిన రైతన్నలు.
కొల్చారం,మే,24,మెదక్ టుడే న్యూస్:వరి ధాన్యంతూకం వేసి వారం రోజులు అవుతున్నప్పటికీ లారీలు రావడంలేదని సంగాయిపేటలో రైతులు రోడ్డెక్కారు. సుమారు గంటపాటు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ట్రాన్స్పోర్ట్ లారీలు రావడంలేదని ప్రైవేట్ లారీలు ధాన్యం లోడ్ చేయాలంటే 15000 వరకు డిమాండ్ చేస్తున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు నిర్లక్ష్యం మూలంగానే లారీలు సకాలంలో రావడంలేదని లారీ ట్రాన్స్పోర్ట్ లను రైస్ మిల్లు యజమానులను అదుపులో ఉంచాల్సిన అధికారులు నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతుల ఆరోపించారు. వారం రోజుల క్రితం గ్రామం నుండి వెళ్లిన లారీ ఇప్పటికి కాళికాకపోవడం అధికారులు పనితీరుకు నిదర్శనంగా రైతులు పేర్కొన్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం కరుణ నేపథ్యంలో అదనపు లారీలను ఏర్పాటు చేసి ధాన్యం ఖాళీ చేయించాలని రైతుల డిమాండ్ చేశారు. కొల్చారం ఎస్ఐ మొహమ్మద్ మొయినుద్దీన్ సంగాయిపేటకు చేరుకుని రైతులకు సముదాయించి ఆందోళన విరమింప చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మహిళల స్వయం ఉపాధికి ఫెమినా మహిళ సేవా మండలి ఆదర్శంఉచిత బ్యూటిషన్, కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు.

మైనారిటీ మహిళలకు ఉపాధి మార్గం చూపుతున్న అలియా సుల్తానా సేవలు ప్రశంసనీయం.
(స్పెషల్ కరస్పాండెంట్)షాద్నగర్,మే,23:షాద్నగర్ పట్టణంలోని 14వ వార్డు పరిధిలో ఫరూక్నగర్ ఉర్దూ ప్రైమరీ స్కూల్ సమీపంలోని అంగన్వాడీ కేంద్ర భవనంలో ఫెమినా మహిళ సేవా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 90 రోజుల ఉచిత బ్యూటిషన్ మరియు కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు శనివారం సందర్శించారు.ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రముఖ సంఘ సేవకురాలు అలియా సుల్తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ముస్లిం మైనారిటీ మహిళలు, నిరుద్యోగ యువతులు స్వయం ఉపాధి సాధించే లక్ష్యంతో ఉచితంగా బ్యూటిషన్ కోర్సులు, కుట్టు శిక్షణ తరగతులు నిర్వహించడం అభినందనీయమని డాక్టర్ వెంకన్న బాబు పేర్కొన్నారు.స్వయం ఉపాధి ద్వారా మహిళల ఆర్థిక సాధికారతడాక్టర్ వెంకన్న బాబు మాట్లాడుతూ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా శిక్షణ ఇవ్వడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని అన్నారు. శిక్షణ పొందిన మహిళలు మరికొందరికీ ఈ నైపుణ్యాలను అందిస్తూ సేవాభావంతో ముందుకు రావాలని సూచించారు.ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధుల సహకారం అభినందనీయం
ఈ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించి ప్రోత్సహించడం, 14వ వార్డు కౌన్సిలర్ అందె మోహన్ సహకారం అందించడం సంతోషకర విషయమని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు, సేవా సంస్థలు కలిసి పనిచేస్తే సమాజంలో మంచి మార్పులు తీసుకురాగలమని అభిప్రాయపడ్డారు.
అలియా సుల్తానా సేవాభావం ఆదర్శం
ఈ సందర్భంగా అలియా సుల్తానా మాట్లాడుతూ “మానవసేవే మాధవ సేవ” అనే భావనతో ఎలాంటి పారితోషికం ఆశించకుండా స్వచ్ఛందంగా ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నానని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే విధంగా మహిళలకు ఉచిత శిక్షణ అందిస్తూ వస్తున్నానని, ఇకముందు కూడా తన శాయశక్తులా మరింత మెరుగైన శిక్షణలు అందించేందుకు అందరి ప్రోత్సాహంతో ముందడుగు వేస్తానని అభిప్రాయం వ్యక్తం చేశారు.కేంద్ర నిర్వహణకు అవసరమైన పరికరాలు, సామాగ్రి అందజేస్తూ సహకరిస్తున్న స్వచ్ఛంద సంస్థల నాయకులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
“సేవ చేయడంలో కలిగే ఆనందం సంపాదనలో ఉండదు. సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం నా లక్ష్యం” అని ఆమె పేర్కొన్నారు.30 మంది మహిళల పాల్గొనడం
ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది ముస్లిం మైనారిటీ మహిళలు, నిరుద్యోగ యువతులు పాల్గొన్నారు. శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు పొందాలని వారు ఆకాంక్ష వ్యక్తం చేశారు.

సంగాయిపేటలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.
కొల్చారం,మే,23,మెదక్ టుడే న్యూస్:ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వావిద్యాలం నిర్వహిస్తున్న రైతులు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని శనివారం కూల్చారం మండల సంగాయిపేట గ్రామంలో నిర్వహించారు. రాజేంద్రనగర్ హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ప్రమీల వివిధ పంటలో తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్యం పద్ధతుల గురించి వివరించారు. ముఖ్యంగా వరిలో నరుమాడిలో యాజమాన్యం, నీటి యాజమాన్యం గురించి వివరిస్తూ వ్యవసాయ విశ్వావిద్యాలం వారు రూపొందించిన సన్న రకాలు KNM-1638,RNR-15048,HMT-SONA, WGL-42,WGL-962JGL-1798,వంటి సన్న విత్తనాలు ను పండించవలసిందిగా సూచించారు. పత్తి మొక్కజొన్న పంటలలో వచ్చే కలుపు చీడపిడల గురించి వివరిస్తూ పంట మార్పిడి పధ్ధతిని పాటించాలని సూచించారు. అలాగే జీవనియంత్రనా పద్ధతులను కూడా వివరించడం జరిగింది. పచ్చి రొట్టె ఎరువులు గురించి వివరిస్తూ జనుము, జీలుగ వంటి విత్తనాలను రైతు తన సొంత భూమిలో ఒక మడిలోనైనా పండించి దానిని రాబోయే పంటకాలానికి విత్తనంగా ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు తమకున్న సందేహాలను నివృత్తి పరచుకోవడంతోపాటు.. పంట మార్పిడి చేయడం తమకు ఇష్టమైనప్పటికీ కోతుల బెడద వల్ల కొంతవరకు ముందడుగు వేయలేకపోతున్నామని చెప్పారు. మొక్కజొన్న, జొన్న పొద్దు తిరుగుడు వంటి పంటలు వేసిన రైతులు తమకు కొనుగోలు కేంద్రాలు కొంతవరకు దగ్గరలో ఉండేలాగా ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ప్రమీల, గ్రామ సర్పంచ్ కుర్ర రత్నమ్మ ప్రభాకర్, ఎపిఓ ఛైర్మెన్ వెంకటరెడ్డి, రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారి రాజశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.










