📄 ePaper
Friday, June 5, 2026
ADS
HomeTelanganaఆవులను కొనవద్దు కుర్బానీ ఇవ్వవద్దు చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్...

ఆవులను కొనవద్దు కుర్బానీ ఇవ్వవద్దు చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ.

📰 Generate e-Paper Clip

చేగుంట,మే,24,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, బక్రీద్ పండుగ సమీపిస్తున్న వేళ ముస్లిం సోదరులు ఎవరూ ఆవులను కొనవద్దని, కుర్బానీ ఇవ్వవద్దని చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ముస్లిం సోదరులంతా ఆవులకు బదులుగా మేకలు, గొర్రెలు, పొట్టేళ్లను మాత్రమే కుర్బానీ ఇవ్వాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతు సోదరులు తమ వద్దకు వచ్చి ఆవులను కొనమని అడిగినా.సున్నితంగా తిరస్కరించాలని కోరారు.మన హిందూ సోదరులు ఆవును తల్లిగా, గోమాతగా భావించి ఎంతో పవిత్రంగా పూజిస్తారని, వారి యొక్క మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. సమాజంలో మతసామరస్యం ఇనుమడించేలా, అందరి భావాలను గౌరవిస్తూ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, అందుకే దయచేసి ఎవరూ ఆవులను కొనవద్దని, కుర్బానీ ఇవ్వవద్దని మహమ్మద్ రఫీ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular