📄 ePaper
Friday, June 5, 2026
ADS
HomeTelanganaఅప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య.

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య.

📰 Generate e-Paper Clip

కొల్చారం,మే,24,(మెదక్ టుడే న్యూస్):అప్పుల బాధతో ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల కేంద్రమైన కొల్చారంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రమైన కొల్చారం గ్రామానికి చెందిన మంగలి వెంకటేశం 48 సంవత్సరాలు వృత్తి వ్యవసాయం ఆదివారం నాడు ఉదయం మృతుని భార్య కూలీ పనుల నిమిత్తం వెళ్లిపోయినా తర్వాత మధ్యాహ్నం అందాజ 12 గంటల సమయంలో వెంకటేశం ఇంట్లో ఉరి వేసుకున్నట్లు మా మామ మంగళ కిష్టయ్య ఫోన్ చేసి ఇంట్లో ముందు రూమ్లో నైలాన్ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలుపగా వెంటనే నేను వచ్చి చూడగా నిజంగానే నా భర్త వెంకటేశం ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు నా భర్త వెంకటేశంకు గతంలో రోడ్డు ప్రమాదం అయినందున కొన్ని అప్పులు అయినవి నూతనంగా ఇల్లు నిర్మించినందువలన అప్పులు ఆయనవి అట్టి అప్పులు ఎలా తీర్చాలని గత రెండు రోజుల నుండి తనలో తాను బాధపడుతున్నాడు అదే బాధతో ఇంట్లో ఎవరు లేనిది చూసి నల్లని నైలాన్ తాడుతో తనంతట తానుగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు నా భర్త మంగళి వెంకటేశం మరణం పై మాకు ఎలాంటి అనుమానం లేదు అని మృతుని భార్య మంగలి రేణుక పోలీసులకు వెల్లడించారు. మృతునికి ఒక కుమారుడు ఉన్నాడు మృతుని భార్య రేణుక పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ అహ్మద్ మోహినుద్దీన్ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular