కొల్చారం,మే,23,మెదక్ టుడే న్యూస్:మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త పట్వారి ప్రసాద్ రావు పంతులు ఆధ్వర్యంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శని, ఆదివారాలు రెండు రోజులు నిర్వహిస్తామని, శనివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అభిషేకము అలంకరణ కళ్యాణం మహోత్సవం, ఆదివారం గోపాల కాలువలు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం పట్వారి ప్రసాదరావు మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం జేష్ట వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అని తెలిపారు ఈకార్యక్రమంలో సర్పంచ్ సుజాత శేకులు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలు యువకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
చేగుంట,మే,23,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ (బిఆర్ఎస్) పార్టీ ముఖ్య నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, చేగుంట మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ మరియు సీనియర్ నాయకుడు సోమ సత్యనారాయణ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఆ పార్టీ స్థానిక నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ ఉనికి కోసం కొందరు కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యేను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎమ్మెల్యే కాలి గోటికి కూడా సరిపోని వారికి ఆయనను విమర్శించే స్థాయిగానీ, అర్హతగానీ లేదని మండిపడుతూ, అనవసరంగా నోరుపారేసుకుంటే సాక్ష్యాలతో సహా గుట్టు రచ్చకీడుస్తామని “ఖబర్దార్” అంటూ ఘాటుగా హెచ్చరించారు. ఎన్నికల వేళ ప్రజలకు వందలాది హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం మూడు నాలుగు హామీలను కూడా సరిగ్గా నెరవేర్చలేకపోయిందని, నేడు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, బీడీ పెన్షన్ల పేరుతో కాంగ్రెస్ నేతలు లంచాలు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గత కేసీఆర్ హయాంలో రైతులను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటూ 24 గంటల ఉచిత విద్యుత్ అందించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సజావుగా కొనుగోలు చేశారని గుర్తు చేస్తూ.. ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనలో ఎరువుల కొరత సృష్టించి రూ. 1,350 బస్తాను రూ. 1,550కి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని, రుక్మాపూర్, అన్నసారం లాంటి కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన వడ్లతో రైతులు రోడ్లపై పడి అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యే నిరంతరం ఊరూరా తిరుగుతూ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులను పలకరిస్తూ, రైతులను ఓదార్చుతూ అండగా నిలుస్తున్నారని కొనియాడుతూ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే చేగుంట, దుబ్బాక, దౌల్తాబాద్ లేదా మెదక్.. ఇలా ఏ నియోజకవర్గంలోనైనా బహిరంగ చర్చకు రావాలని, చేతలైతే మొదట ఎంపీపీ స్థానానికి అవిశ్వాస తీర్మానం పెట్టి గెలవాలని సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో చేగుంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, చేగుంట మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్, చేగుంట పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి, రాజగోపాల్, డిష్ రాజు, మహమ్మద్ అలీ, కటికే రాజేష్, పట్నం తనీషా, సోమ సత్యనారాయణ, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
చేగుంట,మే,23,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం పెద్దశివునూర్ గ్రామంలో మొదటి విడత జనగణన దిగ్విజయంగా కొనసాగుతుంది. స్థానిక ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయురాలు సంతోషి ఎన్యుమరేటర్లుగా ప్రతిరోజు ఉదయాన్నే గ్రామాన్ని చుట్టేస్తున్నారు.గ్రామ ప్రజల సహకారంతో ఇప్పటికే 70%పైగా జనగనన పూర్తి చేసామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.ఆరంభం నుండి కొన్ని ఇండ్లకు తాళాలు వేసి ఉండటంతో కొంత ఇబ్బంది ఎదురవుతున్నందున ప్రజలు కొన్ని రోజులు ఇంటివద్ద ఎవరినైనా ఉంచినట్లుయితే త్వరగా పూర్తి చేయడానికి వీలుపడుతుందని తెలియజేసారు. కాగా వచ్చే నెల అనగా జూన్ 9వరకు జనగనన కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో చేగుంట మండల మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నం ఆంజనేయులుగ్రామస్తులు. అప్పల ప్రశాంత్ అన్నం శ్రీనివాస్ ఎర్ర ఎల్లయ్య అప్పల శంకర్ అన్నం సిద్ధ రాములు అన్నం యాదగిరి మల్లయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ తీరుపై బీఆర్ఎస్ నేత కాట సునీత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమీన్పూర్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో రాజకీయ వేడిని పెంచాయి.
అమీన్పూర్,మే,23,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి,
అసలు ఏం జరిగింది?
ఆస్తి పంపకాల పేరుతో పిలిపించి, సొంత అన్న రాజేష్ గౌడ్ను కాట శ్రీనివాస్ గౌడ్ గల్లా పట్టుకుని కొట్టడం అత్యంత దౌర్జన్యకరమని సునీత మండిపడ్డారు. “అధికారం ఉందన్న అహంకారంతో కన్నతల్లిని, తోడబుట్టిన అన్నను గౌరవించని వ్యక్తి, ప్రజలను ఎలా గౌరవిస్తారు?” అని ఆమె ప్రశ్నించారు.కాట సునీత సంధించిన సంచలన ప్రశ్నలు:టికెట్ బాగోతం: ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 50 లక్షలు పార్టీకి చెల్లించినట్లు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఆమె బయటపెట్టారు.వంశంపై వివాదం: దర్శన్ గౌడ్ కు రాజేష్ గౌడ్ పుట్టలేదని శ్రీనివాస్ గౌడ్ అనడం ఆయన సంస్కార హీనతకు పరాకాష్ట. దీనిపై కట్ట మైసమ్మ దేవాలయం సాక్షిగా, పసుపు బట్టలతో వచ్చి డీఎన్ఏ పరీక్షకు సిద్ధమా అని ఆమె సవాల్ విసిరారు.దుందుడుకు చర్యలు: రేవంత్ రెడ్డి ఇంటిపై రాళ్లు వేయించడం, మంత్రి కొండా సురేఖ సాక్షిగా ఎంపీ అభ్యర్థి నీలం మధుపై చేయి చేసుకోవడం వంటి ఘటనలే శ్రీనివాస్ గౌడ్ అరాచక రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు.సీఎం రేవంత్ రెడ్డి.ఆ ఇన్చార్జిని మార్చండి!ఏ అడ్రస్ లో ఉంటారో తెలియని, ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తికి ఇన్చార్జి పదవి ఇవ్వడం వల్ల పార్టీకి నష్టమని సునీత అభిప్రాయపడ్డారు. వెంటనే ఆయన్ని పదవి నుంచి తొలగించాలని సీఎంను కోరారు. తన భర్తపై జరిగిన దాడి, తనపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై శేరిలింగంపల్లి ఏసీపీ శ్రీనివాస్ కుమార్కు ఫిర్యాదు చేశామని, చట్టపరంగా పోరాడతామని ఆమె స్పష్టం చేశారు.”దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ, ఇలా దౌర్జన్యాలకు పాల్పడటం పిరికిపంద చర్య” అని సునీత ఘాటుగా హెచ్చరించారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, దీనికి పూర్తి బాధ్యత శ్రీనివాస్ గౌడ్ దేనని ఆమె తేల్చి చెప్పారు.
అమీన్పూర్,మే,23,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని పలు అపార్ట్మెంట్లలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ మరియు మంచినీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారిని అమీన్పూర్ పీపుల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు.సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి..అమీన్పూర్ పరిధిలోని ఆల్ఫా హైట్స్, దర్బార్ అపార్ట్మెంట్స్, ఎస్ఎస్ హోమ్స్ మరియు భరత్నగర్ అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా రోడ్ల విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల మరియు మంచినీటి కనెక్షన్లలో ఉన్న అంతరాయాలను వెంటనే తొలగించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.సత్వర పరిష్కారానికి చర్యలు:ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.అసోసియేషన్ ప్రతినిధుల విన్నపంపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అమీన్పూర్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అపార్ట్మెంట్ వాసుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఎమ్మెల్యే సానుకూల స్పందన పట్ల అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ పీపుల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎ. తిరుమల రెడ్డి, సభ్యులు భాస్కర్, ఏఎస్ రావు, విష్ణు, విజయ్, మల్లేష్, వంశీ, రవి తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్,మే,23,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పర్వం కొనసాగుతోంది. అమీన్పూర్ మరియు బీరంగూడ డివిజన్ల పరిధిలో వివిధ కాలనీలు, విలీన గ్రామాల్లో దాదాపు రూ. 3 కోట్ల 66 లక్షల వ్యయంతో చేపట్టనున్న మౌలిక వసతుల కల్పన పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రసంగిస్తూ వ్యక్తం చేసిన కీలక అంశాలు:మౌలిక వసతులే లక్ష్యం: శరవేగంగా విస్తరిస్తున్న అమీన్పూర్, బీరంగూడ ప్రాంతాల్లో ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యలు లేకుండా చూడటమే మా ప్రధాన లక్ష్యం. అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.ప్రజల భాగస్వామ్యం: “స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు నాయకుల ద్వారా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రజల అవసరాలకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసి, నిధులు కేటాయిస్తున్నాం.పారదర్శకమైన అభివృద్ధి: ఎన్నికలతో సంబంధం లేకుండా నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని కాలనీలను ఆదర్శ కాలనీలుగా తీర్చిదిద్దుతాం.వసతుల కల్పన: ముఖ్యంగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో మంచినీటి కనెక్షన్లు మరియు నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ నరసింహ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్స్ కృష్ణ, బిజిలి రాజు, మహాదేవరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, తలారి రాములు, ప్రమోద రెడ్డి, చంద్రశేఖర్, జగదీష్, మహిపాల్ రెడ్డి, ఆంజనేయులు, ఇంద్రేశం జ్ఞానేశ్వర్ ముదిరాజ్,దాసు యాదవ్, లింగం గౌడ్, భాస్కర్ రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్స్ ప్రకాష్ రెడ్డి, మాధవరెడ్డి, కాలనీ మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అన్నదమ్ముల ప్రేమను గుర్తు చేసే ప్రత్యేక సందర్భం చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ తలపించే రోజు కుటుంబ అనుబంధాలను మరింత బలపరిచే ఆప్యాయత వేడుక.
డెస్క్,మే,23,(మెదక్ టుడే న్యూస్)ప్రతి కుటుంబంలో అత్యంత మధురమైన బంధాల్లో సోదర బంధం ఒకటి. ఒకే ఇంట్లో పెరిగి, ఒకే తల్లిదండ్రుల ప్రేమను పంచుకుంటూ ఎదిగే అన్నదమ్ముల అనుబంధం జీవితాంతం నిలిచే ఆప్యాయతగా మారుతుంది. అలాంటి బంధాన్ని గుర్తు చేసుకునే రోజుగా సోదరుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలను మరింత దగ్గర చేస్తుంది. చిన్ననాటి నుంచి అన్న లేదా తమ్ముడు మన జీవితంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తాడు. ఆటల్లో భాగస్వామి, చదువుల్లో తోడు, తప్పు చేస్తే మందలించే వ్యక్తి, బాధలో ఓదార్పు చెప్పే మనిషిగా సోదరుడు నిలుస్తాడు. బాల్యంలో జరిగే చిన్నచిన్న గొడవలు కూడా తరువాత అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కుటుంబంలో సోదరులు ఉండటం అనేది ఒక భరోసా లాంటిదని పెద్దలు చెబుతుంటారు. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా గుర్తుకొచ్చే వ్యక్తుల్లో సోదరుడు కూడా ఉంటాడు. ఎన్నో సందర్భాల్లో మాటలకంటే ఎక్కువగా అర్థం చేసుకునే బంధంగా ఇది నిలుస్తుంది. అందుకే ఈ అనుబంధానికి ప్రత్యేక గుర్తింపుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం మారుతున్న జీవనశైలితో కుటుంబ సభ్యులు వేర్వేరు ప్రాంతాల్లో నివసించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉద్యోగాలు, విద్య, వ్యాపారాల కారణంగా అన్నదమ్ములు దూరంగా ఉన్నప్పటికీ మనసులు మాత్రం ఎప్పటికీ దగ్గరగానే ఉంటాయి. ఒక చిన్న పలకరింపు, ఒక ఆప్యాయమైన సందేశం కూడా ఈ బంధాన్ని మరింత బలపరుస్తుంది. సామాజిక మాధ్యమాల విస్తరణతో ఇప్పుడు ఈ దినోత్సవానికి మరింత ప్రాధాన్యం పెరిగింది. చాలామంది తమ చిన్ననాటి చిత్రాలను పంచుకుంటూ సోదరులపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రత్యేక కానుకలు అందిస్తుండగా, మరికొందరు కలిసి గడిపే సమయాన్నే గొప్ప బహుమతిగా భావిస్తున్నారు. సోదర బంధం కేవలం కుటుంబ పరిమితుల్లోనే కాదు, వ్యక్తిత్వ వికాసంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం వల్ల పరస్పర సహకారం, బాధ్యత, గౌరవం వంటి విలువలు సహజంగానే అలవడతాయి. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ జీవితంలో ముందుకు సాగుతారు. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు లేని సమయంలో కుటుంబ బాధ్యతలను అన్నదమ్ములే పంచుకుంటారు. కష్టసమయాల్లో ఒకరికొకరు అండగా నిలుస్తూ కుటుంబాన్ని కాపాడే శక్తిగా మారుతారు. అందుకే సోదర బంధాన్ని సమాజంలో అత్యంత విలువైన సంబంధాల్లో ఒకటిగా భావిస్తారు.పిల్లల పెంపకంలో కూడా సోదర బంధం ఎంతో ప్రభావం చూపుతుంది. ఒంటరితనం తగ్గి, పంచుకోవడం అనే గుణం పెరుగుతుంది. చిన్నతనంలో కలిసి గడిపిన సమయం తరువాత జీవితంలో మధుర జ్ఞాపకాలుగా నిలుస్తుంది. అందుకే చాలామంది తమ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును ఆనందంగా జరుపుకుంటారు. మన సంస్కృతిలో కుటుంబ బంధాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పెద్దలను గౌరవించడం, చిన్నవారిని ప్రేమించడం వంటి విలువలు కుటుంబాల ద్వారా తరతరాలకు చేరుతున్నాయి. అందులో సోదరుల అనుబంధం కూడా ముఖ్యమైనదే. ప్రేమ, నమ్మకం, సహకారం అనే భావాలను ఈ బంధం ప్రతిబింబిస్తుంది. ప్రపంచం ఎంత వేగంగా మారినా కుటుంబ బంధాల విలువ మాత్రం ఎప్పటికీ తగ్గదు. జీవిత ప్రయాణంలో ఎన్నో మార్పులు వచ్చినా సోదరుల మధ్య ఉన్న ఆప్యాయత చిరస్థాయిగా నిలుస్తుంది. అలాంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేమను పంచుకునే రోజుగా సోదరుల దినోత్సవం ప్రతి కుటుంబానికి ప్రత్యేకతను తీసుకొస్తోంది.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (స్పెషల్ కరస్పాండెంట్) షాద్నగర్,మే,22,మెదక్ టుడే న్యూస్:తెలంగాణ ప్రభుత్వ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలోని షాద్నగర్ గ్రేడ్-1 శాఖ గ్రంథాలయంలో శ్రీ సరస్వతీ దేవి విగ్రహావిష్కరణ మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పరాభవ నామ సంవత్సర జ్యేష్ఠ మాస శుద్ధ పంచమి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వరంగ సంస్థల కమిటీ చైర్మన్ శ్రీ వీర్లపల్లి శంకరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని సరస్వతీ మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి గౌరవ అతిథిగా హాజరై విద్యా వికాసంలో గ్రంథాలయాల పాత్రను వివరించారు. ఈ సందర్భంగా విగ్రహ దాతలైన ప్రముఖ వ్యాపారవేత్త, సీనియర్ జర్నలిస్టు, సామాజిక సేవకుడు శ్రీ సరాపు రమేష్ కుమార్ సేవలను వక్తలు విశేషంగా కొనియాడారు. స్వర్గీయ సరాపు మణెమ్మ–మల్లయ్య, స్వర్గీయ కొండూరు లక్ష్మమ్మ–శంకరయ్యల జ్ఞాపకార్థం ఆయన తన సతీమణి శ్రీమతి అనంతలక్ష్మితో కలిసి ఈ విగ్రహాన్ని సమర్పించడం అభినందనీయమని తెలిపారు. ఆంధ్రప్రభ సీనియర్ జర్నలిస్టుగా పత్రికారంగంలో విశేష సేవలందించిన రమేష్ కుమార్, షాద్నగర్ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడిగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ అభివృద్ధికి కీలకంగా కృషి చేశారని, సంఘానికి స్థిర ఆదాయం వచ్చే విధంగా పలు ఆర్థిక వనరులను సమకూర్చి ఆదర్శ నాయకత్వాన్ని చాటారని వక్తలు ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ ప్రధాన కార్యదర్శిగా సంఘ ఐక్యతకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు మాట్లాడుతూ, “పాత్రికేయుడిగా నిజాయితీ, వ్యాపారవేత్తగా విశ్వసనీయత, సంఘ నాయకుడిగా సేవాభావం కలగలిపిన అరుదైన వ్యక్తిత్వం సరాపు రమేష్ కుమార్ది” అని కొనియాడారు. విద్యాసంస్థల నిర్వహణలో ఆయన చూపుతున్న సేవాస్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. తన ప్రసంగంలో శ్రీ సరాపు రమేష్ కుమార్ భావోద్వేగంగా మాట్లాడుతూ, “ఈ స్థాయికి రావడానికి నా అర్థాంగి అనంతలక్ష్మి పూర్తి సహకారమే ప్రధాన బలం” అని పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు తన సామాజిక సేవా కార్యక్రమాలకు ఆమె అండగా నిలిచిందని తెలిపారు. ముగ్గురు కుమార్తెలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో తన సతీమణి పాత్ర అపారమని, ఒకరు అమెరికాలో స్థిరపడగా, మరొకరు ఎం.డి పీడియాట్రిషన్ పూర్తి చేశారని, చిన్న కుమార్తె అమెరికాలో ఎం.ఎస్ చదువుతున్నదని గర్వంగా వివరించారు. కుటుంబ విలువలు, విద్య, సేవాభావం కలిసినప్పుడే సమాజంలో గౌరవం లభిస్తుందని ఆయన అన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్లు అందె మోహన్, మహ్మద్ అలీఖాన్ బాబర్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి.జి.వి రాణి, కౌన్సిలర్ జి.టి వసంత శ్రీనివాస్, లైబ్రేరియన్ ఎం. ప్రతాప్, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొప్పుల మదన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రముఖులు, విద్యార్థులు, పాఠకులు అధిక సంఖ్యలో హాజరై సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్య, జ్ఞానానికి ప్రతీకగా నిలిచే ఈ విగ్రహం గ్రంథాలయానికి మరింత శోభను తెచ్చిందని సభలో వక్తలు అభిప్రాయపడ్డారు.
పటాన్ చెరు,మే,22,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని క్రిస్టియన్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జెపి కాలనీ డివిజన్ పరిధిలోని బండలగూడ జిఎంఆర్ మార్గ్ లో నూతనంగా నిర్మించిన చర్చిని శుక్రవారం ఎంఎల్ఏ జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలలో భక్తి భావం పెంపొందించడంలో చర్చిల నిర్మాణాలు దోహదపడతాయని తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి ప్రేమ, దయ, క్షమాపణ మరియు నిస్వార్థ సేవలను నేర్పుతున్నాయని తెలిపారు. సొంత నిధులతో నియోజకవర్గం వ్యాప్తంగా 30 పైగా చర్చిలు నిర్మించి ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. నూతన చర్చి నిర్మాణానికి సైతం ప్రభుత్వంతో చర్చించి భూమిని కేటాయించడం జరిగిందని తెలిపారు. చర్చి అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, చర్చి ఫాదర్ ఆండ్రూస్, తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగాలి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్.
చేగుంట,మే,22,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని రెడ్డిపల్లి డీసీఎంఎస్, పీఏసీఎస్ పాడి ప్రొక్యూర్మెంట్ సెంటర్లతో పాటు చందాయిపేట్లోని శ్రీ శివ కేశవ రైస్ మిల్లును జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ సందర్శించి కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మిల్లర్లకు పీపీసీ కేంద్రాల సిబ్బందికి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. అలాగే ట్యాబు ఎంట్రీలను ఎటువంటి ఆలస్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా,సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, రవాణా, అన్లోడింగ్ డేటా ఎంట్రీ పనులను సమన్వయంతో వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమాసింగ్, తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి, చేగుంట ఎమ్మార్వో శివప్రసాద్, ఆర్ ఐ జై భారత్ రెడ్డి, ఎంపీడీవో చిన్నారెడ్డి, రైస్ మిల్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.