📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 11

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం.

0

కొల్చారం,మే,22,(మెదక్ టుడే న్యూస్):కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికులకు కనీస వేతనం 20వేలకు పెంచి కోటి 11 లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూర్చారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మందిరాల వద్ద పరిశుభ్రత.

0

కొల్చారం,మే,22,మెదక్ టుడే న్యూస్:ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పర్యాటక వారోత్సవాలలో భాగంగా కొల్చారం సర్పంచ్ దేవన్న గారి శేఖర్ ఆధ్వర్యంలో స్థానిక షేక్ షాబుద్దీన్ దర్గా, తిరుమలయ్య స్వామి, లక్ష్మణ ఆలయాల వద్ద పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాలలో ఉన్న చెత్తాచెదారం, గడ్డి మొక్కలు, మురికిని శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో కారోబార్ వడ్ల ప్రభాకర్, వార్డు మెంబర్లు, పారిశుద్ధ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రంలో రైతు మృతి.

0

కొల్చారం,మే,22,మెదక్ టుడే న్యూస్:కుప్పపూసిన ధాన్యం రాసిన చూడడానికి వెళ్లి కొనుగోలు కేంద్రంలోని రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చిన్న ఘనపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటాపురం శంకరయ్య (54) గత నెల రోజుల క్రితం వరి పంట హార్వెస్టింగ్ చేసి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చారు. ధాన్యాన్ని ఆరబెట్టి తూకానికి సిద్ధం చేసి ఉంచారు. ఎంతకీ తూకం వేయకపోవడంతో నెల రోజులుగా నిర్వాహకుల వెంట తిరుగుతూ ఎండలో ధాన్యం కుప్ప వద్ద పడికాపులు కాశారు. ఈ క్రమంలో శుక్రవారం సైతం దాన్యం కుప్పకు వద్దకు వెళ్లి కూర్చున్న దగ్గరే హఠాత్తుగా తూలిపడి స్పృహ తప్పి పడిపోయాడు. తోటి రైతులు పైకెత్తి చూడగా విగత జీవుడై ఉన్నాడు. ఎండ దెబ్బకు గురై శంకరయ్య మృతి ఒడికి చేరుకున్నారని గ్రహించిన తోటి రైతులు బోరుమన్నారు. కుటుంబ సభ్యుల అక్రందనలు మిన్నంటాయి. ప్రభుత్వ నిర్లక్ష్యమే శంకరయ్య ప్రాణం తీసింది అని గ్రామస్తులు వాపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గ్రామాన్ని సందర్శించి శంకరయ్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. కలెక్టర్ అడిషనల్ కలెక్టర్లకు అక్కడి నుండే ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి, అధికారులను పంపించి శంకరయ్య కుటుంబానికి సహాయం అందించాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ మండలంలో ఎక్కడి ధాన్యం అక్కడే కొనుగోలు కేంద్రాలలోనే మగ్గుతుంది అన్నారు. ప్రభుత్వం ఎంతకీ నిర్లక్ష్య వైఖరి వినడం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి లారీల సదుపాయం కల్పించి వెంట వెంటనే ధాన్యం తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న జనగణన ను పరిశీలించిన జిల్లా కలెక్టర్.

0

చేగుంట,మే,22,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో కొనసాగుతున్న జనగణన కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ , ఫీల్డ్ స్థాయి ఎన్యూమరేషన్ ప్రక్రియను సమీక్షించారు.ఈ సందర్భంగా సంబంధిత అధికారులు సిబ్బందితో మాట్లాడి, జనగణన కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో, పారదర్శకంగా మరియు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఇంటి వివరాలను పూర్తిగా సేకరించడం సర్వే సమయంలో వివరాలను సరిగా ధృవీకరించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.అలాగే, జనగణన కార్యక్రమంలో ఏ అర్హ కుటుంబం కూడా మిగిలిపోకుండా అన్ని స్థాయిల్లో సమన్వయంతో పనిచేయాలని అధికారులకు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమాసింగ్, తూప్రాన్ ఆర్డిఓ జయచంద్రారెడ్డి, చేగుంట తాసిల్దార్ శివప్రసాద్, చేగుంట ఎంపీడీవో చిన్నారెడ్డి, వివిధ అధికారులు పాల్గొన్నారు.

వారం రోజులైనా లారీలు లేవు.

0

-పట్టించుకోని అధికారులు

-అంసాన్ పల్లి పోతిరెడ్డిపల్లి కొంగోడు గ్రామాల రైతుల ఆవేదన

-రెండు రోజులలో తూకం వేసిన బస్తాలను రైస్ మిల్లులకు తరలించే ఏర్పాటు చేస్తా: తహసిల్దార్ శ్రీనివాస చారి

    కొల్చారం,మే,21,(మెదక్ టుడే న్యూస్)ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం వేసి వారం రోజులు గడిచిన కూడా లారీలు రావడం లేదని అంసాన్ పల్లి పోతిరెడ్డిపల్లి కొంగోడు గ్రామాల రైతులు గురువారం తాసిల్దార్ శ్రీనివాస చారిని, ఎస్సై మహమ్మద్ మొయినుద్దీన్ లను కలిసి మొరపెట్టుకున్నారు. సకాలంలో లారీలు పంపాలని ఆ గ్రామాల రైతులు తహసిల్దార్ నువేడుకొన్నారు.తహసిల్దార్ శ్రీనివాస చారి ఇచ్చిన హామీ,ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీనివాసచారి మాట్లాడుతూ రెండు రోజులలో తప్పకుండా లారీలు పంపించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు కూడా అధికారులతో సహకరించాలని కోరారు. రైతుల వద్ద ట్రాక్టర్లు ఇతర సొంత ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు ఉంటే ఉపయోగించుకోవాలని సకాలంలో అన్లోడ్ చేసే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారం అంసానిపల్లి సొసైటీ చైర్మన్ మన్నే రాములు, సర్పంచులు స్వామి, గీతా రమేష్, ఉప సర్పంచులు , రైతులు తదితరులు పాల్గొన్నారు.

    ముఖ్యమంత్రి – కార్మిక శాఖ మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం.

    0

    కొల్చారం,మే,21,(మెదక్ టుడే న్యూస్)తెలంగాణలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు శుభవార్త చెప్పి, కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా కార్మికుల కనీస వేతనాల పెంపు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. కనీస వేతనాలు పెంచిన సందర్భంగా ముఖ్యమంత్రి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఇది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకున్న అతి గొప్ప నిర్ణయం కనుక నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ ఆదేశాల మేరకు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు కొల్చారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక శాఖ మంత్రి వర్యులు డా వివేక్ వెంకటస్వామి ఫోటోలకి పాలాభిషేకం కార్యక్రమం ఉన్నది.కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు సింగిల్ విండో చైర్మన్లు ముఖ్య నాయకులు ఎన్ ఎస్ యు ఐ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

    వడియారం పెద్దమ్మ దేవాలయానికి ధూప దీప నైవేద్యానికి 5000 రూపాయలు.

    0

    ఉప సర్పంచ్ గా ఉన్నంతకాలం ప్రతినెల 5000 రూపాయలు ఇస్తాను మహమ్మద్ రఫీ

    చేగుంట,మే,21,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో పెద్దమ్మ దేవాలయానికి రంగుల నిమిత్తం చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ (2,11,000 )రూపాయలు రెండు లక్షల పదకొండు వేల రూపాయలు అందజేశారు. అలాగే ధూప దీప నైవేద్యానికి ప్రతినెల 5000 రూపాయలు ఇస్తానని చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ అన్నారు. నేను ఉపసర్పంచ్ గా ఉన్నంతకాలం ఇస్తాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఘనమైన పాండు మామిండ్ల బాలయ్య,పున్న యాదగిరి, మొగిలి నరసింహులు నరసింహులు,మహేందర్ డీలర్ రామచంద్రo తదితరులు పాల్గొన్నారు.

    మస్జిద్ అభివృద్ధికి 7 లక్షల మంజూరు చేయించిన సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి.

    0

    చేగుంట,మే,21,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం కన్యారం గ్రామంలోనిఇబ్రహీం మజీద్ కు రూ.7 లక్షలు మంజూరు చేయించిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మజీద్ కమిటీ సభ్యులు, మరియు గ్రామ నాయకులుహృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోచేగుంట మండల ప్రెసిడెంట్ నవీన్కుమార్ , మండల నాయకులుకాశబోయిన భాస్కర్,యువ నాయకుడు సతీష్, ఉప సర్పంచ్ మాజీ మోహన్ సర్పంచ్ మహిపాల్, మజీద్ కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ సల్మాన్ గౌరీ, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ తయ్యబ్,సభ్యులు సాజిద్, అన్వర్, ఈనా, అజీమ్, అలీమ్, వాజిద్, తహేర్ కొలుపుల స్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే కన్యారంసర్పంచ్ శంకర్, వార్డ్ మెంబర్లు మహేశ్, నవీన్,ఇతర అతిథులు హాజరయ్యారు.

    బోనాల కొండాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

    0

    లారీల పంపిణీలో ఎలాంటి ఆలస్యం చేయొద్దని అధికారులను హెచ్చరించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

    చేగుంట,మే,20,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం బోనాల బోనాల కొండాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వడ్లు అమ్మడానికి తీసుకువచ్చిన రైతులు లారీల కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.లారీల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రైతులకు భరోసా కల్పిస్తూ, “లారీలను వెంటనే పంపించేలా చర్యలు తీసుకుంటాను” అని హామీ ఇచ్చారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే లారీలను ఏర్పాటు చేయాలని, రైతులు ఇబ్బందులు పడకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.లారీల పంపిణీలో ఎలాంటి ఆలస్యం చేయొద్దని అధికారులను హెచ్చరించిన ఎమ్మెల్యే రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

    చేగుంటలో మెడికల్ షాపుల బంద్ సంపూర్ణం..

    0

    చేగుంట,మే,20,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, అఖిల భారత ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ ) పిలుపు మేరకు అక్రమ ఆన్‌లైన్ ఫార్మసీలు, కార్పొరేట్ సంస్థల భారీ డిస్కౌంట్ల విధానాలకు వ్యతిరేకంగా బుధవారం చేపట్టిన దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ చేగుంట మండల కేంద్రంలో సంపూర్ణంగా విజయవంతమైంది. రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మెంబర్, మెదక్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు టి. రాజు, కార్యదర్శి సంగమేశ్వర్, కోషాధికారి శ్రీనివాస్ ఇచ్చిన పిలుపుతో చేగుంట ఏరియా అసోసియేషన్ పరిధిలోని అన్ని ప్రైవేట్ ఔషధ విక్రయ శాలల నిర్వాహకులు సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించి తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయడంతో పట్టణంలోని మెడికల్ లైన్ నిర్మానుష్యంగా మారింది; ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆన్‌లైన్ ఫార్మసీలలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ (రసీదు) లేకుండా ఇష్టారాజ్యంగా మందులు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతోఆటలాడుకుంటున్నారని, గతంలో కోవిడ్ సమయంలో తెచ్చిన జీఓ నంబర్ 220ని ప్రభుత్వం వెంటనే రద్దు చేసి ఆన్‌లైన్ అక్రమ విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్య భద్రతను, లక్షలాది మంది కెమిస్టుల జీవనోపాధిని కాపాడేందుకు నిర్వహించిన ఈ బంద్‌కు స్థానిక ప్రజలు పూర్తిగా సహకరించారు.