కొల్చారం,మే,21,(మెదక్ టుడే న్యూస్)తెలంగాణలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు శుభవార్త చెప్పి, కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా కార్మికుల కనీస వేతనాల పెంపు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. కనీస వేతనాలు పెంచిన సందర్భంగా ముఖ్యమంత్రి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఇది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకున్న అతి గొప్ప నిర్ణయం కనుక నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ ఆదేశాల మేరకు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు కొల్చారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక శాఖ మంత్రి వర్యులు డా వివేక్ వెంకటస్వామి ఫోటోలకి పాలాభిషేకం కార్యక్రమం ఉన్నది.కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు సింగిల్ విండో చైర్మన్లు ముఖ్య నాయకులు ఎన్ ఎస్ యు ఐ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి – కార్మిక శాఖ మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం.
RELATED ARTICLES
