📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 12

అభివృద్ధిలో అమీన్‌పూర్, బీరంగూడలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

0

అమీన్‌పూర్,మే,20,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్, బీరంగూడ డివిజన్ల పరిధిలోని ప్రతి కాలనీని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, అమీన్‌పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ మరియు వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్ డివిజన్, బీరంగూడ డివిజన్ పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు.ఈ పర్యటనలో భాగంగా తులసివనం కాలనీ, భ్రమరాంబిక నగర్, ఏఆర్ బృందావన్, కెఎస్ఆర్ కాలనీ, అంజనాద్రి కాలనీ, టైలర్ కాలనీ, ఎన్ఎస్ఎల్ కాలనీ, ఎన్బీఆర్ కాలనీ, ఇక్రిశాట్ కాలనీలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. నేరుగా ప్రజలు, ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులతో సమావేశమై క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సీసీ రోడ్లు, యూజిడీలు, విద్యుత్, తాగునీరు తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ప్రజల సమస్యలపై సమగ్ర నివేదికను తనకు అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. నివేదికల ఆధారంగా నిధులు కేటాయించి, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని భరోసా ఇచ్చారు.తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: అమీన్‌పూర్ పరిధిలో దశాబ్దాలుగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించి, ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నామని, నూతన కాలనీలకు సైతం నీటి సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు.
ప్రభుత్వ స్థలాల రక్షణ: కాలనీలలోని ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జాకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
మెరుగైన పారిశుద్ధ్యం: పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా నూతన సిబ్బందిని నియమిస్తున్నట్లు వెల్లడించారు.
విద్యుత్ వ్యవస్థ బలోపేతం: నూతన కాలనీల ఏర్పాటుతో పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సబ్‌స్టేషన్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మాట్లాడటం తన నైజమని, మిగతా సమయమంతా ప్రజల అభివృద్ధి, సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే జిఎంఆర్ స్పష్టం చేశారు. అభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరిస్తూ, అవసరమైన నిధులు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అతి త్వరలోనే బీరంగూడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. తమ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే స్వయంగా కాలనీలకు రావడం పట్ల స్థానిక ప్రజలు, అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు,కృష్ణ, బాలరాజు,యూనుస్, ఇంజనీరింగ్ విభాగం ఈఈ సురేష్, డిఈ వెంకటరమణ, జలమండలి డిజిఎం శివకుమార్, విద్యుత్ శాఖ ఏడి సంజీవ్ మరియు ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

రసాయన శాస్త్రంలో కేత స్వరూపకుపీ హె చ్.డీ.

0

పటాన్ చెరు,మే,20,(మెదక్ టుడే) న్యూస్: ప్రతినిధి,హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని కేత స్వరూప డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘చాల్కోన్ కలిపిన పిరిడిన్-పిరిమిడిన్, 1,2,4-ఆక్సాడయాజోల్ కలిపిన ఇండోలిజైన్-థయాడయాజోల్ ఉత్పన్నాల రూపకల్పన, సంశ్లేషణ, జీవ మూల్యాంకనం’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిత్తలూరి సుధాకర్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు..డాక్టర్ స్వరూప చేసిన డాక్టరల్ పరిశోధన, ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో, ఆశాజనకమైన వైద్యపరమైన అనువర్తనాలు కలిగిన నూతన రసాయన సమ్మేళనాల అభివృద్ధిపై దృష్టి సారిస్తుందన్నారు.ఈ పరిశోధనలో భాగంగా, డాక్టర్ స్వరూప ఔషధపరంగా ముఖ్యమైన రసాయన నిర్మాణాలను ఏకీకృతం చేయడం ద్వారా జీవశాస్త్రపరంగా ప్రాముఖ్యత కలిగిన రెండు శ్రేణుల సమ్మేళనాలను రూపొందించి, సంశ్లేషించినట్టు తెలిపారు. సంశ్లేషించిన ఈ సమ్మేళనాలను ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీతో సహా ప్రామాణిక విశ్లేషణాత్మక పద్ధతులను ఉపయోగించి నిర్మాణాత్మకంగా వర్గీకరించి, తదనంతరం వాటి జీవ క్రియాశీలతను మూల్యాంకనం చేశారన్నారు. అనేక సమ్మేళనాలు ప్రోత్సాహకరమైన ఫలితాలను కనబరిచాయని, భవిష్యత్తు ఔషధ అభివృద్ధికి వాటి సామర్థ్యాన్ని సూచిస్తున్నాయని వివరించారు.ఈ అధ్యయనం ఔషధ రసాయన శాస్త్ర రంగానికి విలువైన అంతర్దృష్టులను అందిస్తుందని, క్యాన్సర్ చికిత్స కోసం సమర్థవంతమైన చికిత్సా ఏజెంట్ల అభివృద్ధికి కొత్త మార్గాలను తెరుస్తుందన్నారు.డాక్టర్ స్వరూప సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

బీరప్ప స్వామి జాతర మహోత్సవానికి రూ. 2 లక్షల విరాళం అందజేసిన డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్‌రావు.

0

పటాన్‌చెరు,మే,20,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి:ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే సంగారెడ్డి జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్‌రావు తన ఉదారతను చాటుకున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లన్న స్వామి మరియు శ్రీ శ్రీ శ్రీ కామరాతి – బీరప్ప స్వామి వార్ల కళ్యాణ (జాతర) మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, పర్స శ్యామ్‌రావు – పర్స పద్మ దంపతులు భారీ విరాళాన్ని ప్రకటించారు.బుధవారం వారి నివాసంలో గొల్ల మరియు కురుమ సంఘం పెద్దలను మర్యాదపూర్వకంగా కలిసి, జాతర మహోత్సవాల నిర్వహణ కొరకు రూ. 2,00,000/- (రెండు లక్షల రూపాయల) నగదు ఆర్థిక సహాయాన్ని వారు స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా పర్స శ్యామ్‌రావు మాట్లాడుతూ.. గ్రామీణ సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీకలైన జాతర మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. స్వామివార్ల కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండి, అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని ఆయన కోరుకున్నారు. సమాజంలో కులసంఘాల బలోపేతానికి, ఇలాంటి ధార్మిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.జాతర మహోత్సవానికి ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందించి, తమకు అండగా నిలిచిన డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్‌రావు కి, పద్మ కి గొల్ల & కురుమ సంఘం పెద్దలు, నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఆడ శిశువు తల్లిదండ్రులకు నగదు బహుమానం.

0

గణపురం సర్పంచ్ చందపురం మధుసూదన్ రెడ్డి

కొల్చారం,మే,20,(మెదక్ టుడే న్యూస్)మండల పరిధిలోని చిన్న ఘనపూర్ గ్రామ సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి నూతనంగా ఆడపిల్లలకు జన్మనిచ్చిన దంపతులకు బుధవారం నగదు బహుమానం అందజేస్తారు. గ్రామానికి చెందిన పోతరాజు లక్ష్మీ భాస్కర్, మంద వరలక్ష్మి శ్రీకాంత్, నాన్నగారి కృష్ణవేణి సందీప్, తాటి శోభ వెంకటేశం, నాగం చిత్రా నితిన్ దంపతులకు ఒక్కొక్కరికి రూ. 5116 రూపాయలు నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేర కు నగదు బహుమానం అందజేశానన్నారు. పదవిలో ఉన్నంతకాలం మీ ఇంటి మహాలక్ష్మి మా ఇంటి చిరుకానుక పథకాన్ని అమలు పరుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సింలు, పిఎసిఎస్ చైర్మన్ మందానాగులు, కాంగ్రెస్ నాయకులు రాజబోయిన అశోక్, దార ప్రకాష్, రమావత్ సురేష్, నాగ రమేష్, వడ్ల లక్ష్మీపతి, నాగార్జున రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కమ్మరి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ ని కలిసిన సర్పంచులు.

0

కొల్చారం,మే,20,(మెదక్ టుడే న్యూస్)గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని అప్పాజీపల్లి సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్, పోతంశెట్టిపల్లి సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్ బుధవారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసి అభ్యర్థించారు. సిసి రోడ్లు పంచాయతీ భవనం అంగన్వాడీ కేంద్రాల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమ్ముల రాజా గౌడ్ నెల్లి నవీన్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.

0

కొల్చారం మండలం మే 20 (మెదక్ టుడే న్యూస్)మండలంలోని అంసానిపల్లి ఎనిగండ్ల తుక్కాపూర్ గ్రామాలలో మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ పి సతీష్, సవిత, ప్రమీల, సురేష్ మాట్లాడుతూ వరి పంట యాజమాన్య పద్ధతులు నారుమడి నిర్వహణ, నీటి వినియోగం, మక్కా పత్తి పంటలలో కలుపు నివారణ క్రీడల నివారణ వంటి విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు. జీవన ఎరువుల కొరకు పచ్చిరొట్ట విత్తుకుని కలియ దున్నాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గీతా రమేష్, ఆంజనేయులు, లక్ష్మీ పెంటయ్య, పి ఎస్ ఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, నాయకులు రవీందర్, ప్రవీణ్ రెడ్డి రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

0

కొల్చారం మండలం (మెదక్ టుడే న్యూస్)వేసవి కాలం ఎండ దెబ్బ భారీ నుంచి చిన్నపిల్లలను… మహిళలు తగు జాగ్రత్త తీసుకోవాలని కొల్చారం ఏఎన్ఎం లు మజితా బేగం, కవిత మహిళలకు సూచించారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం లోని సబ్ సెంటర్లో పిల్లల తల్లులకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎండ దెబ్బ నుంచి రక్షణ కోసం ఓ ఆర్ ఎస్ ద్రావణాన్ని తాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు రాణి కవిత, పిల్లల తల్లులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లపై సమర శంఖారావం

0

కొల్చారం మండలం మే 20 (మెదక్ టుడే న్యూస్):

  • వారం రోజులు గడుస్తున్న లారీలు లేవు
  • 3000 బస్తాలు తూకం చేసి ఉన్న బస్తాలు
  • పని లేక వెళ్ళిపోతామంటున్న హమాలీలు

అలసత్వాన్ని నిరసిస్తూ మండల పరిధిలోని అంశాన్ని పల్లి గ్రామ రైతులు సమర శంఖారావం పూరించారు. సుమారు 3000 తూకం వేసిన బస్తాలు సిద్ధంగా ఉన్నప్పటికీ, వారం రోజులుగా లారీలు లేకపోవడంతో ఎక్కడికక్కడ రైతులు అట్టుడికి పోతున్నారు. మరో వైపు 25 లారీల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మగ్గుతుంది. ఇంకోవైపు వర్షాకాలం, ఉరుములు మెరుపులతో ఎప్పటికప్పుడు రైతాంగాన్ని బెంబేలెత్తిస్తోంది. దీంతో మౌనంగా ఉంటే నష్టం ఖాయం అనుకున్న రైతులు గురువారం పోరుబాటకు సిద్ధమయ్యారు. సుమారు 500 మంది రైతులతో మండల కేంద్రమైన కొల్చారం వద్ద మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ రాస్తారోకోకు గ్రామ సర్పంచ్ కన్నబోయిన గీతా రమేష్, పిఎసిఎస్ చైర్మన్ మన్నే రాములు, సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి ఇతర నాయకులు రైతుల ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగిరావడమో రైతులు ఓడడమో ఖాయమన్న పంతంతో రోడ్ ఎక్కడున్నా రైతన్నలు. అధికారుల నిర్లక్ష్యం రైతన్నల మెడలో ఉరితాడ ఈ వేలాడుతూ ఉంటే, రణమో, ప్రాణమో అన్న తెగింపుతో రైతులు పోరుబాటకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. అంసానిపల్లి రైతులకు మద్దతుగా మండల పరిధిలోని ఆయా గ్రామాల రైతులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఉద్యమ స్పూర్తికి ప్రతీకగా ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీకి ఘన సన్మానం.

0

ఉద్యమకారుల గుర్తింపే నిజమైన తెలంగాణ ఆత్మగౌరవం,ప్రొఫెసర్ కోదండరాం
(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,మే,20, మెదక్ టుడేన్యూస్:
తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన ప్రముఖ ఉద్యమ నేత, ఎమ్మెల్సీ Professor Kodandaram ను తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి. వెంకట్ రాంరెడ్డి (మాజీ జడ్పీటీసీ, ఫరూఖ్‌నగర్) ఆధ్వర్యంలో వారి పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశంలో తెలంగాణ ఉద్యమ కాలం, ఉద్యమకారుల పాత్ర, భవిష్యత్తులో వారికి లభించాల్సిన గుర్తింపు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామీణ స్థాయిలో ఉద్యమం కోసం కష్టపడిన కార్యకర్తలు, విద్యార్థి నాయకులు, ఆర్టీసీ కార్మికులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం గుర్తించాలని నాయకులు కోరారు.దీనికి స్పందించిన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో భాగమైన ప్రతి ఉద్యమకారుడి సేవ అమూల్యమని, వారిని గుర్తించేందుకు సరైన విధివిధానాలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఉద్యమ స్ఫూర్తి నిలిచి ఉండాలంటే ఉద్యమకారులకు గౌరవం, గుర్తింపు కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పినపాక ప్రభాకర్, టీజీ శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, కాదే సుధాకర్, కావాలి యాదగిరి, రవి గౌడ్, మేకల వెంకటేష్, సిద్దం విటలయ్య, దొడ్డి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

పాపన్న పేట మండల అధ్యక్షులుగా లింగంపేట నరేందర్ గౌడ్ నియామకం.

0
Oplus_16908288

మెదక్ :పాపన్నపేట,20,మెదక్ టుడే న్యూస్:మెదక్ జిల్లా పాపన్న పేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా పాపన్నపేట గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు, నరేందర్ గౌడ్
నియామకం అయ్యారు.మంగళవారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ లు మెదక్ జిల్లాలోని మండలాల అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.అందులో భాగంగానే పాపన్నపేట మండలానికి లింగంపేట నరేందర్ గౌడ్ ను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా నరేందర్ గౌడ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో పాపన్నపేటకాంగ్రెస్ పార్టీ మండల్ అధ్యక్షులుగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు,పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మండలం లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.