కొల్చారం,మే,20,(మెదక్ టుడే న్యూస్)గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని అప్పాజీపల్లి సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్, పోతంశెట్టిపల్లి సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్ బుధవారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసి అభ్యర్థించారు. సిసి రోడ్లు పంచాయతీ భవనం అంగన్వాడీ కేంద్రాల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమ్ముల రాజా గౌడ్ నెల్లి నవీన్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ ని కలిసిన సర్పంచులు.
RELATED ARTICLES
