📄 ePaper
Friday, June 5, 2026
ADS
HomeTelanganaరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.

📰 Generate e-Paper Clip

కొల్చారం మండలం మే 20 (మెదక్ టుడే న్యూస్)మండలంలోని అంసానిపల్లి ఎనిగండ్ల తుక్కాపూర్ గ్రామాలలో మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ పి సతీష్, సవిత, ప్రమీల, సురేష్ మాట్లాడుతూ వరి పంట యాజమాన్య పద్ధతులు నారుమడి నిర్వహణ, నీటి వినియోగం, మక్కా పత్తి పంటలలో కలుపు నివారణ క్రీడల నివారణ వంటి విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు. జీవన ఎరువుల కొరకు పచ్చిరొట్ట విత్తుకుని కలియ దున్నాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గీతా రమేష్, ఆంజనేయులు, లక్ష్మీ పెంటయ్య, పి ఎస్ ఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, నాయకులు రవీందర్, ప్రవీణ్ రెడ్డి రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular