📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 13

గీతం విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ‘ఫ్యూచర్ ఎక్స్5

0

పటాన్ చెరు, మే,19,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి.పరిశ్రమకు సంబంధించిన జ్జానాన్ని, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నైపుణ్యాలను విద్యార్థులకు అందించడానికి ‘ఫ్యూచర్ ఎక్స్5’ పేరిట ఒక చైతన్యవంతమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల శ్రేణికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టింది. గీతంలోని శిక్షణ, మార్గదర్శకత్వం, వృత్తి మార్గదర్శకత్వ డైరెక్టరేట్ (టీఎంసీజీ)లోని శిక్షణ, సామర్థ్య వికాస (టీసీడీ) విభాగం దీనిని ఏర్పాటు చేస్తున్నటు డైరెక్టర్ డాక్టర్ రోజీనా మాథ్యూ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, ప్రాజెక్టు మేనేజ్ మెంట్, క్వాంటం కంప్యూటింగ్, కార్పొరేట్ రెడీనెస్, ఎథికల్ హ్యాకింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల నుంచి అనుభవజ్జులైన నిపుణులను తీసుకురావడం ద్వారా విద్య, పరిశ్రమ అంచనాల మధ్య అంతరాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమ లక్ష్యంగా డాక్టర్ రోజీనా వివరించారు.మే 23 నుంచి జూన్ 6 వరకు నిర్వహించనున్న ఈ సెషన్లు, ప్రతివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ఆచరణాత్మక అవగాహన పొందడం, ప్రముఖ సంస్థల నిపుణులతో సంభాషించడం, ప్రస్తుత మార్కెట్ పోకడలను అర్థం చేసుకోవడం, వారి వృత్తిపరమైన, కెరీర్ సంసిద్ధతను మెరుగుపరచుకోవడం వంటివి చేస్తారని డాక్టర్ రోజీనా తెలిపారు.మే 23న వినియోగదారు సంబంధాల నిర్వహణ (సీఆర్ఎం), ప్రాజెక్టు నిర్వహణలను విల్ కామ్ డెలివరీ మేనేజర్ శశిధర్ కొండూరి పరిచయం చేస్తారన్నారు. మే 30న క్వాంటం కంప్యూటింగ్, భద్రతను ఈవై డైరెక్టర్ మూర్తి పరవశివం వివరిస్తారని తెలిపారు. మే 31న కార్పొరేట్ సంస్కృతిని అర్థం చేసుకోవడం, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, ఉత్పాదకత, స్వీయ బ్రాండింగ్ లపై ఎంఎక్స్4 భాగస్వామి, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ గురుసిద్ధయ్య శిక్షణ ఇస్తారన్నారు. జూన్ 6న నైతిక హ్యాకింగ్ ను లిబరల్ సెక్యూరిటీ వ్యవస్థాపకులు సుజయ్ గంకిడి పరిచయం చేస్తారని డైరెక్టర్ వివరించారు.పరిశ్రమ భవిష్యత్తు పోకడలను అన్వేషించడానికి, వృత్తిపరమైన సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి, అభివృద్ధి చెందుతున్న కెరీర్ రంగాలకు తమను తాము సిద్ధం చేసుకోవడానికి ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ఆయా సెషన్లలో చురుకుగా పాల్గొనాలని డాక్టర్ రోజీనా మాథ్యూ సూచించారు.

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులకు ఘనంగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

0

పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపిన తెల్లాపూర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కోటే హరీష్, కే హెచ్ వై యువసేన బృందం

ఎమ్మెల్యే మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలి: కోటే హరీష్ ఆకాంక్ష

పటాన్ చెరు మే,19,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి:పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి – శ్రీమతి యాదమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెల్లాపూర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కోటే హరీష్ మరియు కే హెచ్ వై యువసేన ప్రతినిధుల బృందం ఎమ్మెల్యే నివాసంలో వారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే దంపతులకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించి వివాహ వార్షికోత్సవ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా తెల్లాపూర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కోటే హరీష్ మాట్లాడుతూ.. పటాన్చెరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. నియోజకవర్గంలో ఆయన అందించిన సేవలు ఎనలేనివని, ప్రజా సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపనను ప్రజలు ఎన్నటికీ మరవరని పేర్కొన్నారు. భగవంతుని ఆశీస్సులతో ఎమ్మెల్యే దంపతులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజాదరణ కలిగిన నాయకుడు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు భవిష్యత్తులో రాజకీయంగా మరిన్ని ఉన్నతమైన స్థానాలను, ఉన్నతమైన పదవులను అధిరోహించాలని వారు మనస్ఫూర్తిగా కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో కోటే హరీష్‌తో పాటు కే హెచ్ వై యువసేన బృందం సభ్యులు, బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

పటాన్‌చెరు నియోజకవర్గంలో ముమ్మరంగా సాగిన మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన.

0

ఒకేరోజు రూ.84 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రతి మున్సిపాలిటీకి రూ.15 కోట్ల భారీ నిధుల విడుదల

పటాన్‌చెరు,మే,19,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి నేడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ కాట శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు వేలాదిగా తరలివచ్చి మంత్రికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మొత్తంగా నియోజకవర్గవ్యాప్తంగా సుమారు రూ.84 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలాగే భానూర్‌లో రూ.8.30 కోట్ల వ్యయంతో విశాఖ పీడబ్ల్యూడీ రోడ్డు నుండి శంకరపల్లి–పటాన్‌చెరు రోడ్డు వరకు కంచర్లగూడెం మీదుగా నిర్మించనున్న బీటీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు.తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధిలోని ఉస్మాన్‌నగర్ కేజీబీవీలో రూ.60.94 లక్షలు, జిన్నారం కేజీబీవీలో రూ.70.95 లక్షల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల పనులకు శంకుస్థాపన చేసి, సోలక్‌పల్లిలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.1985లో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతానికి బీడీఎల్, ఓడీఎఫ్ వంటి ప్రతిష్టాత్మక రక్షణ రంగ పరిశ్రమలను తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఆమె సేవలను స్మరించుకుంటూ ఈ ప్రాంతంలో ఇందిరమ్మ విగ్రహాన్ని ఏర్పాటుచేయడంసముచితమన్నారు.భానూర్ కార్మికుల హౌసింగ్ సొసైటీకి స్థల కేటాయింపు చేపడతామని, పటాన్‌చెరు నుండి శంకర్‌పల్లి వరకు 100 ఫీట్ల రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత పదేళ్లలో లేని విధంగా ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని, జూన్ 2వ తేదీ నుండి కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు.పటాన్‌చెరు కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పటాన్‌చెరు అభివృద్ధికి, ముఖ్యంగా విద్యా మరియు మౌలిక వసతుల రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఒకేరోజు రూ.84 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీ జీ ఐ ఐ సి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి , స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

0

పటాన్‌చెరు,మే,19,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి, వారి సతీమణి యాదమ్మ గార్లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే దంపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ… పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిన ప్రజానేత, శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు, వారి సతీమణి యాదమ్మ గారు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూ, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే ఎమ్మెల్యే గారి సేవలు అమూల్యమైనవని కొనియాడారు. వారి వైవాహిక జీవితం ఇలాగే ఎల్లప్పుడూ ఆనందంగా సాగాలని, నియోజకవర్గ ప్రజల తరపున, నాయకుల తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సత్కార కార్యక్రమంలో అమీన్‌పూర్ జిహెచ్ఎంసి కి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో మాజీ కౌన్సిలర్ కృష్ణ, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కొల్లూరి చంద్రకళ గోపాల్, ప్రమోద్ రెడ్డి,బోయిని బాలరాజు,మాజీ కో-ఆప్షన్ సభ్యులు తల్లారి రాములు,చౌటకురి మహిపాల్ రెడ్డి, కొల్లూరి యాదగిరి,దాసు యాదవ్, ఐలాపూర్ నర్సింగ్ రావు… తదితరులు ఉన్నారు.నాయకులంతా ఎమ్మెల్యే దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, తమ అభిమానాన్ని చాటుకున్నారు.

మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం.

0

చేగుంట,మే,19,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల వ్యవసాయ మార్కెట్ కమిటీకార్యాలయంలో మంగళవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం చైర్మన్ తాడెం వెంగల్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈసమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఉష్ గత 3 నెలలకు సంబంధించిన ఆదాయ,వ్యయాలకు సంబంధించిన వివరాలను పాలకవర్గం సభ్యులకు చదివి వినిపించారు.అనంతరం సభ్యులందరూ అభివృద్ధి పనులు, పలు అంశాలపై ఏకగ్రీవంగా
తీర్మానాలు చేసి సంతకాలు చేశారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడతూ కొనుగోలు కేంద్ర ల లో ఎలాంటి సమస్య ఉన్న చైర్మన్ కి గాని, డైరెక్టర్ లకు సంప్రదించాలని రైతులు ఎవరు అధైర్య పడకూడదని, ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని, అన్నారు, సమావేశంలో డైరెక్టర్లు ఎత్తిన పలు సమస్యలపై వెంటనే సంబంధిత స్థానిక తాసిల్దార్, ఎంపీడీవో తో మాట్లాడడం జరిగింది, అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మార్కెట్ కమిటీ కార్యాలయనికి కొత్తగా 25 కాంటాలు వచ్చినాయని,అవుసరం ఉన్న వారు (వి ఏ ఓ లు )వచ్చి, పాతవి ఇచ్చి కొత్తవి తీసుకుగలరని అన్నారు ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మొహమ్మద్ ముజామిల్, స్టాలిన్ నర్సిములు, అన్నం ఆంజనేయులు, కాషాబోయిన శ్రీనివాస్, మొహమ్మద్ రఫీ, శ్రీధర్ రెడ్డి, పక్కిర్ నాయక్, కుర్మ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

సమ్మెకు మద్దతు ఇవ్వాలని ఎస్ ఐ కి వినతి ఇచ్చిన వివోఏలు.

0

చేగుంట,మే,19,మెదక్ టుడే న్యూస్:రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, వివోఏ ల రాష్ట్ర కమిటీ మేరకు మే 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవదిక సమ్మె చేపట్టినట్లు చేగుంట వివోఏ ల సంఘం సభ్యులు ప్రకటించారు మంగళవారం స్థానిక ఎస్ ఐ చైతన్య కుమార్ కి కలిసి సమ్మె నోటీస్ అందజేశారు. తమకు మద్దతు ఇవ్వాలని అన్నారు,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న విఓఏ లకు : కనీస వేతనం 20,000వేలకు పెంచాలని.ఆరోగ్య హెల్త్ పాలసీ , పదోన్నతులు ఆరోగ్య బీమా, ట్యాబ్ స్వాకర్యంకల్పించాలనివిన్నవించారు .న్యాయమైన డిమాండ్ లు తీర్చాక పోతే వెనక్కి తగ్గేది లేదని తెలిపారు.ఈ కార్యక్రమం లో అవుబోతు స్వామి, భానుప్రయ్, కవిత, హారిక, అరుణ, పద్మ, మనీషా,కృష్ణవేణి,తదితరులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ చెక్కులు అందజేసినమార్కెట్ కమిటీ చైర్మన్.

0

చేగుంట,మే,19,మెదక్ టుడే న్యూస్:నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరమని మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగల్ రావు,చేగుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ అన్నారు. మంగళవారం చేగుంట మండలం చిన్న శివనూరు గ్రామానికి చెందిన బొల్ల మహేష్ కు రూ.60,000రూపాయలు, వల్లభపూర్ గ్రామానికి చెందిన, బత్తుల కొమరయ్య కు 15000 రూపాయలు, విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి అదేశాల మేరకు వారి కుమారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బొల్ల ప్రశాంత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

లారీలు పంపించండి సారు.

0

లారీల కొరకు రైతులు ఆవేదన

కొల్చారం,మే,19,( మెదక్ టుడే న్యూస్)ధాన్యం కొనుగోలు కేంద్రంలో సుమారు 3500 బస్తాలు తూకం వేసి ఉంచామని, వారం రోజులు గడుస్తున్న లారీలు రావడంలేదని, తమకు వెంటనే లారీలు పంపించాలని పోతంశెట్టిపల్లి గ్రామ రైతులు తాసిల్దారును కోరారు. వరిగుంతం లోని ఎఫ్ఎంసీ గోదాము వద్ద తాసిల్దార్ శ్రీనివాస్ చారిని కలిసి రైతులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. తాసిల్దార్ మాట్లాడుతూ పోతంశెట్టిపల్లి గ్రామంలో తీవ్ర లారీలు కొరత ఉందని ముందుగా అక్కడికే లారీలు పంపిస్తానని చెప్పడంతో అప్పాజీపల్లి రైతులు అసంతృప్తికి లోనై తమకు లారీలు పంపించాలని తాసిల్దార్ తో వాదానికి దిగారు. అనంతరం పోలీసులు కలగజేసుకుని నచ్చజెప్పడంతో. రైతులు శాంతించారు. తమ గ్రామానికి కనీసం ఒక్క లారీ అయినా పంపిస్తే బాగుంటుందని వాపోయారు. ఈ కార్యక్రమంలో అప్పాజీపల్లి సీతారాం తండా వరిగుంతం గ్రామ రైతులు ఉన్నారు.

జనగణన పారదర్శకంగా నిర్వహించాలి డిప్యూటీ తహసిల్దార్ రమేష్.

0

చేగుంట,మే,18,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో సెన్సెస్ 2027 మొదటి దశ ఇండ్ల గణనను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండ్ల గణన ను పారదర్శకంగా నిర్వహించాలని, సెన్సెస్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలు పాటించాలని, వారు విధించిన గడులోపు పూర్తిచేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ చల్లా లక్ష్మణ్, రమాదేవి, ఏనిమరేటర్ విజలత తదితరులు పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధి పేదలకు వరం చేగుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నం ఆంజనేయులు.

0

చేగుంట,మే,18,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామానికి చెందిన అప్పల మహితకు మంజూరైన రూపాయలు 17,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును చేగుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నం ఆంజనేయులు సోమవారం నాడు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరం అని వైద్య ఖర్చులు నిమిత్తం ఈ నిధులు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోదం నాగరాజు ఎర్ర సిద్ధ రాములు వడియారం ఎల్లం ఎర్రబాలు ఎర్ర రవి బండారి సాయిలు తలారి మల్లేష్ తలారి నవీన్ గడ్డమీది ప్రసాద్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.