📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 14

1976 డైరెక్ట్ రిక్రూట్ ఎస్సైల అపూర్వ కలయిక.

0

మాసబ్ ట్యాంక్ పోలీస్ ఆఫీసర్స్ మెస్‌లో ఆత్మీయ స్నేహ సమ్మేళనం.

(స్పెషల్ కరస్పాండెంట్)హైదరాబాద్,మే,17,మెదక్ టుడే న్యూస్:
1976లో డైరెక్ట్ రిక్రూట్ ఎస్సైలుగా ఎంపికై అనంతపూర్ పీటీసీలో కలిసి శిక్షణ పొందిన మాజీ పోలీసు అధికారులు, హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ పోలీస్ ఆఫీసర్స్ మెస్‌లో ఆప్యాయంగా కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. రిటైర్డ్ డి.ఎస్.పి. యోహాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్నేహ సమ్మేళనం ఎంతో ఆత్మీయంగా, ఆనందభరితంగా సాగింది.ఇటీవల అనంతపూర్‌లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్న అనంతరం, యోహాన్ కుమారుడు రాహుల్ వివాహ సందర్భంగా తన సహచర మిత్రులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. విజయ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి రిటైర్డ్ డిఎస్పి పిఎస్‌ఎస్‌పీ ప్రసాద్ బాబు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రామ్ కిషన్, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజయ్య, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ నరసింహులు తదితరులు హాజరై స్నేహ బంధాలను మరింత బలోపేతం చేసుకున్నారు.ఈ సందర్భంగా రామ్ కిషన్ మాట్లాడుతూ,స్నేహానికి మించిన సంపద లేదు. ఐదు దశాబ్దాలు గడిచినా మన మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడటం ఆనందంగా ఉంది. ఇలాంటి కలయికలు జీవితానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి” అని పేర్కొన్నారు.విజయ్ సింగ్ మాట్లాడుతూ,ట్రైనింగ్ రోజుల జ్ఞాపకాలు, అప్పటి అనుభవాలు ఈరోజు మళ్లీ కళ్లముందు తిరిగాయి. అందరం వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్ అయినా మన స్నేహం మాత్రం ఎప్పటికీ చెదరలేదు” అని తెలిపారు.
యోహాన్ మాట్లాడుతూ,అనంతపూర్ పీటీసీలో మొదలైన మన స్నేహ ప్రయాణం ఇప్పటికీ ఇంత బలంగా కొనసాగుతుండటం ఎంతో గర్వంగా ఉంది. కుటుంబ సభ్యుల్లా కలిసి ఉండటం జీవితంలో గొప్ప వరం” అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ పాత్రికేయుడు, ప్రముఖ దంత వైద్యుడు డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు* పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన మాట్లాడుతూ,50 సంవత్సరాల తర్వాత కూడా ఇంతటి ఆత్మీయతతో, పరస్పర ప్రేమాభిమానాలతో కలుసుకోవడం నిజంగా ఆదర్శప్రాయం. సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి మానవ సంబంధాలను, స్నేహ బంధాలను కాపాడుకోవాలి” అనిఅభిప్రాయపడ్డారు.కార్యక్రమం మొత్తం హాస్య సంభాషణలు, పాత అనుభవాల చర్చలు, ట్రైనింగ్ రోజుల జ్ఞాపకాలతో సందడిగా సాగింది. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు ఆనందంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, భవిష్యత్తులో కూడా తరచూ ఇలాంటి గెట్‌టుగెదర్‌లు నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు.

మే 20న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్.

0

చేగుంట,మే,17,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, అఖిల భారత ఔషధ విక్రేతల సంఘం (ఏఐఓసీడీ ) పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీ బుధవారం దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ షాపుల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ (టీటీసీడిఏ ) రాష్ట్ర అధ్యక్షులు కె. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మెంబర్, మెదక్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అధ్యక్షులు టి. రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగానే ఈరోజు చేగుంట లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి టి రాజు మాట్లాడుతూ భారతదేశంలోని సుమారు 12.40 లాక్స్ ఔషధ విక్రేతలు పాల్గొంటున్న ఈ సమ్మెలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలను (జి .స్ .ర్ . 817(ఈ)) ఉల్లంఘిస్తూ ఇంటర్నెట్ ద్వారా సాగుతున్న అక్రమ ఆన్‌లైన్ ఫార్మసీలను వెంటనే అరికట్టాలని వారు డిమాండ్ చేశారు; కార్పొరేట్ సంస్థల ప్రిడేటరీ ప్రైసింగ్ (భారీ డిస్కౌంట్లు) విధానాల వల్ల క్షేత్రస్థాయిలోని చిన్న, మధ్యతరహా రిటైల్,హోల్‌సేల్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్‌లైన్‌లో యాంటీబయాటిక్స్ విక్రయించడం వల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏ ఎమ్ ఆర్ ) పెరిగి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కోవిడ్-19 సమయంలో అత్యవసర సేవల కోసం తెచ్చిన తాత్కాలిక సడలింపుల ఉత్తర్వులను (జి .స్ .ర్ . 220(ఈ )) వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఔషధ రంగాన్ని కాపాడుకోవడానికి, నిరుపేద రోగులకు నకిలీ మందులు అందకుండా అడ్డుకోవడానికి నిర్వహిస్తున్న ఈ దేశవ్యాప్త సమ్మెకు ప్రజా బాహుళ్యం, వైద్యులు, ఔషధ తయారీదారులు పూర్తిస్థాయిలో సహకరించి జయప్రదం చేయాలని టీటీసీడీఏ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో అయిత రఘురాములు, వెంకటరమణ, కృష్ణమూర్తి, చంద్రశేఖర్ గౌడ్ , శ్రీనివాస్, సత్యనారాయణ , ప్రకాష్, తదితరులు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సోదరులు అందరు పాల్గొన్నారు.

జలాల్‌పూర్ మహకాళీ మాత ఆలయ విస్తరణకు చేగుంట ఉపసర్పంచ్ రఫీ 5 గుంటలు, ప్రముఖుల భూదానం.

0

చేగుంట,మే,16,మెదక్ టుడే న్యూస్:వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్‌పూర్ గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ మహకాళీ మాత దేవాలయ అభివృద్ధి, విస్తరణ కోసం చేగుంట ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీతో పాటు చేగుంటకు చెందిన పలువురు ప్రముఖులు గొప్ప ఉదారత చాటుకున్నారు. శనివారం అమావాస్యను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీ తన సొంత నిధుల నుండి 5 గుంటల భూమిని భూదానంగా ఇస్తూ దానికి సంబంధించిన పత్రాలను, విరాళాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేయగా, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కావేరి సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో దైవభక్తి ఉంటేనే అన్యాయం, అధర్మం అంతరిస్తాయని, భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు; అలాగే ప్రముఖ నాయకులు అయిత పరంజ్యోతి మాట్లాడుతూ తాము కోరగానే దాతలు సానుకూలంగా స్పందించడం అభినందనీయమన్నారు. ఈ దేవాలయ విస్తరణ నిమిత్తం ఉపసర్పంచ్ రఫీ 5 గుంటలు దానం చేయగా.. అయిత పరంజ్యోతి, తొడుపునూరి నగేష్, తొడుపునూరి మహేష్, కాశం శంకర్, కాసాని ముత్యాలు గౌడ్, మాశెట్టి నాగభూషణం, బచ్చు రవీందర్, తోడుపునూరి మోహన్ లు ఒక్కొక్కరు ఒక గుంట చొప్పున, అలాగే మంజుల – వెంకట్ రెడ్డి దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒక గుంట భూమిని ఆలయానికి విరాళంగా అందజేశారు. ఈ పవిత్రమైన రోజున భూదానం చేసే భాగ్యం కలగడం తన పూర్వజన్మ సుకృతమని ఉపసర్పంచ్ రఫీ ఆనందం వ్యక్తం చేయగా, ఆలయ కమిటీ దాతలను శాలువాలతో ఘనంగా సత్కరించింది; ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఎస్. రామారావు, ఏ. లక్ష్మణ్, ఉపాధ్యక్షులు రాజేశ్వర్, గోశాల నిర్వహణ బాధ్యులు దేవరాజ్, మొహమ్మద్ రఫీ, అయిత రఘు రాములు, అయిత పరంజ్యోతి,మ్యాకల శ్రీనివాస్, సీలువేరు ప్రకాష్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చేగుంట కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా అమావాస్య అన్నప్రసాద వితరణ.

0

చేగుంట,మే,16,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రమైన చేగుంటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శనివారం అమావాస్యను పురస్కరించుకుని నిరుపేదలకు, భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అమావాస్య రోజున అన్నదానం చేయడం వల్ల పూర్వీకులకు గౌరవం దక్కుతుందని, ఆధ్యాత్మిక పుణ్యఫలం లభిస్తుందనే నమ్మకంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మాశెట్టి నాగభూషణం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం మధ్యాహ్నం 1:00 గంటల నుండి ప్రారంభమైన ఈ అన్నప్రసాద వితరణలో చేగుంట గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులందరికీ ఆలయ ప్రాంగణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ‘అన్నదానం మహోదానం’ అనే భావనతో సాగిన ఈ సేవలో చేగుంట తహసీల్దార్ శివ ప్రసాద్, కన్యాకాపరమేశ్వరి ఆలయ అధ్యక్షులు తోడుపునూరి నగేష్, కార్యదర్శి అయిత రఘు రాములు, మెదక్ జిల్లా ఆర్య వైశ్య మహా సభ అయిత పరంజ్యోతి, టి ఆర్ ముత్యాల గౌడ్, బాలేశం సేటు, చేగుంట ఉపసర్పంచ్ మొహమ్మద్ రఫీ, చేగుంట మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, మన్నెవారి జలల్పూర్ శ్రీ శ్రీ శ్రీ మహాకాళి దేవస్థానం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కావేరి సత్యనారాయణ, అధ్యక్షులు ఎస్ రామారావు, ఏ లక్ష్మణ్ , ఉపాధ్యక్షులు రాజేశ్వర్, దేవరాజ్ గోశాల మెయింటెనెన్స్, మ్యాకల శ్రీనివాస్,భక్తులు ప్రముఖులు, యువకులు మరియు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు.

చేగుంట రైస్ మిల్లులను తనిఖీ చేసిన ఆర్డిఓ జయచంద్రారెడ్డి.

0

చేగుంట,మే,16,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని ఇబ్రహీంపూర్ తిరుమల రైస్ మిల్, బోనాల భారతి రైస్ మిల్లుల నూ తనిఖీ చేశారు. అనంతరం యజమానులతో అధికారులు వడ్ల కొనుగోలు పై సమీక్షించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా వేగంగా ధాన్యం సేకరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి చేగుంట తాసిల్దార్ శివ ప్రసాద్ ఆర్ ఐ జయభారత్ రెడ్డి ఎంపీడీవో చిన్నారెడ్డి ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, ఎం పి ఓ విజయ పాల్ రెడ్డి, రైస్ మిల్ యజమానులు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొనడం జరిగింది.

చందాయిపేట,కసాన్పల్లి సబ్స్టేషన్ పరిధిలో కరెంటు అంతరాయం-ఏఈ వెంకటప్ప రెడ్డి.

0

చేగుంట,మే,16,మెదక్ టుడే న్యూస్:చేగుంట లో 33/11 / కె.వి ఫిడార్ మరమ్మతుల కారణంగా ఆదివారంవిద్యుత్ విద్యుత్ సరఫరా లో అంతరాయం కలగనుంది.ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చందాయిపేట కసానపల్లి సబ్స్టేషన్లో పరిధిలో కరెంటు ఉండదని ఏఈ వెంకట అప్పారెడ్డి తెలిపారరు మక్క రాజుపేట, చందాయిపేట,కసానపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ నిలిపినట్లు తెలిపారు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

30 గోవులను రక్షించిన గోసంరక్షక దళం.

0

బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ రవాణా అరికట్టాం బజరంగ్ దళ్

చేగుంట,మే,16,మెదక్ టుడే న్యూస్:జాతీయ రహదారి పై ఆవుల తో వెళుతున్నా పట్టుకున్న గో రక్ష దళం లారీని పట్టుకున్నా రు డ్రైవర్ ను అదుపులోకి పోలీసులు.అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని గోరక్షక్ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శనివారం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు తరలిస్తున్న గోవులను మాసాయిపేట మండలం రామంతాపూర్ హెచ్‌పీ పెట్రోల్, ప్రక్కన ఉన్న రాజస్థాన్ దాబా దగ్గర సేద తీర్చుకుంటున్న సమయంలో డబ్బా వద్ద ముందస్తు సమాచారం తో గోరక్షక్ కార్యకర్తలు అడ్డగించారు.సమాచారం అందుకున్న చేగుంట ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని లారీని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ధాన్యం దిగుమతులలో మిల్లర్లు అలసత్వం వీడాలి మెదక్ జిల్లా కలెక్టర్.

0

ధాన్యం దిగుమతులలో మిల్లర్లు అలసత్వం వీడాలి కలెక్టర్

కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్స్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని పలు మార్లు మిల్లర్లకు ఆదేశాలు

ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిని పెడుతున్న మిల్లర్లు రైతులకు తీవ్ర ఇబ్బందులు

రెండు రైస్ మిల్లులు బ్లాక్‌లిస్ట్

మెదక్,పాపన్నపేట,మే,16,మెదక్ టుడే న్యూస్: పాపన్నపేట మండలం మేసర్స్ శ్రీ సాయి లక్ష్మీ ట్రేడర్స్, రామాయంపేట్ మేసర్స్ భవాని ఇండస్ట్రీస్, పై చర్యలు,మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్,ధాన్యం దిగుమతులలో అలసత్వం వహించిన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు.రబీ మార్కెటింగ్ సీజన్ 2025-26 (యాసంగి) సందర్భంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు అన్ని రైస్ మిల్లర్లు పీపీసీల నుండి ధాన్యాన్ని దిగుమతి చేసుకొని కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్స్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని పలు మార్లు ఆదేశాలు జారీ చేయబడ్డాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.కొనుగోలు కేంద్రాల ధాన్యం దిగుమతులపైకలెక్టర్ మాట్లాడుతూ కష్టం మిల్లింగ్ ఆపరేషన్లో తప్పనిసరిగా పాల్గొనాలని పలుమార్లు వెల్లడించిన మిల్లర్లు ఆ మాటలు పెడచెవిని పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని దృష్టిలో పెట్టుకుని,మేసర్స్ శ్రీ సాయి లక్ష్మీ ట్రేడర్స్, పాపన్నపేట మండలం మరియు మేసర్స్ భవాని ఇండస్ట్రీస్, రామాయంపేట్ వారు పీపీసీల నుండి కేటాయించిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోవడం గమనించబడినది. దీనివల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి మరియు ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుందన్నారు.ఈ నేపథ్యంలో, సంబంధిత జి.ఓ నిబంధనల ప్రకారం పై రైస్ మిల్లులను పాడి ప్రొక్యూర్‌మెంట్ మరియు కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్స్ నుండి తక్షణ ప్రభావంతో బ్లాక్ / బ్లాక్‌లిస్ట్ చేయడం జరిగినది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయా రైస్ మిల్లులకు ఎటువంటి ధాన్యం కేటాయింపు చేయబడవని వెల్లడించారు.అలాగే, జిల్లాలోని అన్ని రైస్ మిల్లర్లు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తూ పీపీసీల నుండి ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని, లేనిపక్షంలో సంబంధిత రైస్ మిల్లులపై కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

భగీరథ్‌ను పోలీసులకు అప్పగించిన బండి సంజయ్.

0

భగీరథ్‌ను పోలీసులకు అప్పగించిన బండి సంజయ్

చట్టానికి అందరూ సమానమేనన్న కేంద్ర మంత్రి

విచారణకు పూర్తి సహకారం అందిస్తామన్న స్పష్టీకరణ

కేసులో ఆధారాలు సమర్పించినట్లు వెల్లడి

    హైదరాబాద్‌,మే,16,(మెదక్ టుడే న్యూస్)కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తన కుమారుడిని న్యాయవాదుల ద్వారా పోలీసులకు అప్పగించినట్లు బండి సంజయ్ వెల్లడించారు. చట్ట ప్రకారం జరిగే విచారణకు పూర్తిగా సహకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ చట్టం ముందు తన కుమారుడు అయినా, సామాన్య వ్యక్తి అయినా అందరూ సమానమేనని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థపై తనకు ఉన్న గౌరవంతోనే భగీరథ్‌ను విచారణ కోసం అప్పగించామని చెప్పారు.
    దేశంలో ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత సంబంధాల కంటే చట్టం గొప్పదనే భావనతోనే తాము వ్యవహరిస్తున్నామని తెలిపారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడని బండి సంజయ్ వెల్లడించారు. కేసుకు సంబంధించిన ఆధారాలను కూడా న్యాయవాదుల ద్వారా పోలీసులకు అందజేసినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఫిర్యాదు వచ్చిన తొలి రోజుల్లోనే భగీరథ్‌ను పోలీసులకు అప్పగించాలని భావించినట్లు తెలిపారు. అయితే కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలను సమర్పించాల్సిన అవసరం ఉండటంతో కొంత ఆలస్యం జరిగిందని వివరించారు.
    ఇక ఆలస్యం చేయడం సమంజసం కాదని భావించి చట్టపరమైన ప్రక్రియలో భాగంగా కుమారుడిని పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. సమర్పించిన ఆధారాలను పోలీసులు పరిశీలించిన తర్వాత నిజానిజాలు బయటకు వస్తాయని, కేసు కొట్టివేయబడుతుందని న్యాయవాదులు చెప్పినట్లు బండి సంజయ్ తెలిపారు. బెయిల్ కూడా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మైనర్ బాలిక కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.

    నకిలీ కాల్ సెంటర్లపై అప్రమత్తంగా ఉండండి- సైబర్ మోసాలపై పోలీసుల హెచ్చరిక.

    0

    ఓటీపీ వివరాలు పంచొద్దని సూచన

    అనుమానాస్పద కాల్స్‌పై జాగ్రత్త

      హైదరాబాద్‌,మే,16,(మెదక్ టుడే న్యూస్)నకిలీ కాల్ సెంటర్ల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సూచనలు విడుదల చేశారు. సైబర్ నేరగాళ్లు కాల్ సెంటర్ ప్రతినిధుల పేరుతో ఫోన్ చేసి బ్యాంకు, ఉద్యోగం, బహుమతులు, కస్టమర్ సేవల పేరుతో వ్యక్తిగత వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. అలాంటి కాల్స్ వచ్చినప్పుడు వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు. అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు వాటిని నమ్మి వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం సమాచారం, ఓటీపీలు వంటి రహస్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని తెలిపారు. నకిలీ కాల్ సెంటర్ల నుంచి వచ్చే కాల్స్‌లో మోసగాళ్లు ప్రజలను భయపెట్టి లేదా అత్యవసర పరిస్థితి సృష్టించి వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తారని పోలీసులు పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో ప్రశాంతంగా వ్యవహరించాలని సూచించారు.
      ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే కాల్‌ను నిలిపివేయాలని తెలిపారు. అవసరమైతే సంబంధిత సంస్థ అధికారిక నంబర్లకు ఫోన్ చేసి నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మోసాలకు గురైతే వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు సమాచారం అందించాలని తెలంగాణ పోలీసులు విజ్ఞప్తి చేశారు.