పాపన్నపేట,మే,16,మెదక్ టుడే న్యూస్:జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన మండల పరిధిలోని పోడ్చన్ పల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు…గ్రామానికి చెందిన వడ్ల సత్యనారాయణ(55) గత కొన్ని రోజులుగా ఫిట్స్, బ్యాక్ పెయిన్ తో బాధపడుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు.పని చేయుటకు శరీరం సహకరించడం లేదని తరచూ ఇంట్లో బాధపడుతుండే వాడు.ప్రతి రోజు లాగే శనివారం మధ్యాహ్నం సమయంలో భోజనం చేసి గదిలోకి వెళ్లాడు.జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.కాసేపటికి గమనించిన కుటుంబీకులు కొన ఊపిరితో ఉన్న అతన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు.మృతుడి భార్య నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
బడంగ్పేట్: బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ వద్ద వెలసిన భారీ అక్రమ వెంచర్పై జర్నలిస్ట్ సూరన్న అధికారులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ వెంచర్ అక్రమాలను ఆయన సాక్ష్యాధారాలతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన బడంగ్పేట్ కమిషనర్, అక్రమ వెంచర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.తూతూమంత్రంగా కూల్చివేతలు వద్దుగతంలో సర్వే నంబర్ 9, 10లలో వెలసిన ఈ వెంచర్పై ఫిర్యాదులు రాగా, టౌన్ ప్లానింగ్ అధికారులు కేవలం షో కోసం ఒకట్రెండు విద్యుత్ స్తంభాలను తొలగించి చేతులు దులుపుకున్నారని సూరన్న తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్రైనేజీ, రోడ్లు, ప్రీకాస్ట్ వాల్ వంటి నిర్మాణాలను ముట్టుకోకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.అవినీతి అధికారుల గుట్టురట్టు వెంచర్కు అనుమతులు లేకపోయినా ప్లాట్లకు అనుమతులు ఎలా ఇస్తున్నారని, దీనిపై ఏసీబీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలు మోసపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.కమిషనర్ హామీ: పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం” సూరన్న ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన కమిషనర్, వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమ నిర్మాణాలను పూర్తిస్థాయిలో కూల్చివేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
చేగుంట,మే,15,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని తపస్ కార్యాలయంలో తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం మే నెలలో బడిబాట నిర్వహిస్తుంది అని, వేసవి సెలవులలో బడిబాటలో పాల్గొన్న ఉపాధ్యాయులందరికీ సంపాదిత సెలవులు మంజూరు చేయాలని వారు ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా నాయకులు సురేందర్, సంతోష్, యాదగిరి, తపస్ మండల అధ్యక్షులు రావుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
లారీల వేట లో ట్రాన్స్పోర్ట్ రెవిన్యూ, పోలీసు సిబ్బంది,ఊపు అందుకున్న వడ్ల కొనుగోలు
చేగుంట,మే,15,మెదక్ టుడే న్యూస్:రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పి పి సి ఎస్ వద్ద నెలకొన్న లారీల కొరత సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈరోజు ఎం వి ఐ శ్రీనివాస్, చేగుంట తహసీల్దార్ శివ ప్రసాద్,రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది సంయుక్తంగా రోడ్లపైకి వచ్చి చర్యలు చేపట్టారు.ఇతర ప్రాంతాలకు వెళ్తున్న లారీలను ఆపి వాటిని పి పి సి ఎస్ కు మళ్లించడం ద్వారా ధాన్యం రవాణా ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయడంతో వడ్ల కొనుగోలు ప్రక్రియ ఊపు అందుకుంది దీంతో రైతులకు ఊరట కలుగుతోంది.
చేగుంట,మే,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల పరిధిలో గల పోలీస్ స్టేషన్లో బజరంగ్దళ్ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేయడం జరిగినది ఈనెల 27న బక్రీద్ పండగ ఉన్నందున గోవు అక్రమ రవాలను బజరంగ్దళ్ కార్యకర్తలు అడ్డుకొని చట్టాన్ని చేతులకు తీసుకొని వారిపై దాడి చేయొద్దని ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందుకోసమే బజరంగ్దళ్ కార్యకర్తలను భువనగిరి నాగరాజు బజరంగ్దళ్ జిల్లా సంయోజక్ సోమ సురేష్ విహెచ్పి మండల అధ్యక్షులు చిక్కుడు మహేష్ ఉప మండల ప్రముఖ ని ముందస్తు అరెస్టు చేసి వారిని హెచ్చరించడం జరిగినది బజరంగ్దాల్ విషయం భజరంగ్దళ్ జిల్లా సంయోజక నాగరాజ్ గారు మాట్లాడుతూ గోవులను రక్షించే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్న తీరును చూస్తే సిగ్గుచేటు పబ్లిక్ గా కూరగాయల దుకాణాల వలె గోమాంసాన్ని విక్రయిస్తున్న గాని పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన గాని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ధర్మరక్షణకై పాల్పడుతున్న బజరంగ్దళ్ కార్యకర్తలపై గోవుల రక్షణ సమితి కార్యకర్తల పై జరుగుతున్న ఈ చర్యలకు నేను సిగ్గుపడుతున్నానని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో భువనగిరి నాగరాజు సోమ సురేషు చిక్కుడు మహేష్ చింతల భూపాల్ శివలింగం మహేందర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు
మెదక్,మే,15,మెదక్ టుడే న్యూస్:మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల స్థితి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది విధి నిర్వహణ తదితర అంశాలను సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. కేసుల దర్యాప్తులో వేగం పెంచి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, బాధితుల సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరిగేలా సేవాభావంతో విధులు నిర్వహించాలని సిబ్బందికి తెలిపారు. గ్రామాల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, రాత్రి వేళల్లో పహారా నిర్వహణను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ప్రజల్లో భద్రతాభావం పెరిగేలా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం నిర్వహించాలని, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు, ఫేక్ వార్తలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీలో డీసీఆర్బి ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
చేగుంట,మే,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో“రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డా. పుష్పవల్లి మాట్లాడుతూ రైతులు వర్షా కాలంలో వరి పంట సాగు చేసే ముందు రైతులు పచ్చి రొట్ట పంటలను మోకాలి దాని ఎత్తు వరకు పెంచి కలియ దున్నితే 20-30 శాతం వరకు యూరియా వాడకం తగ్గించవచ్చు అని తెలియచేసారు. పంటలలో రసాయనాలు తప్పనిసరి పరిస్థితి లో మాత్రమే వాడాలి అని, పక్షి స్థావరాలను, లింగ ఆకర్షణ బుట్టలను వాడి పురుగులను నియంత్రించాలని వారు సూచించారు. లెగ్యూమ్ జాతికి చెందిన అపరాలు నూనె గింజల పంటలతో పంట పంట మార్పిడి పాటించడం, సాగు నీటినిఆదా చేయడం, సేంద్రియ పద్ధతులను పాటించడం పై రైతులకు అవగాహన కల్పించారూ. కార్యక్రమంలో డా. తరుణ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారి మాధవి, పంచాయతీ సెక్రెటరీ సమీరా,వార్డ్ మెంబర్లు,ఫీల్డ్ అసిస్టెంట్, రైతులు పాల్గొన్నారు.
చేగుంట,మే,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని రెడ్డిపల్లి కాలనీలో జనగణనను పరిశీలించిన చేగుంట తహసిల్దార్ శివ ప్రసాద్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 11 నుండి మే 13 వరకు మ్యాపింగ్ చేశారని, ఈరోజు నుండి అన్ని గ్రామాలలో ఇండ్ల గణనను నిర్వహిస్తున్నారని, ఎనిమరేటర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి ప్రజలు సహకరించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఓ భూమేష్, ఎనుమారేటర్స్ మౌనిక,చల్లా రామకృష్ణ, సూపర్వైజర్ చల్లా లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు
చేగుంట,మే,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం లోరైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, (పీపీసీ ) వద్ద లారీల కొరత ఉన్న విషయాన్ని ఆర్డీవో జయ చంద్రా రెడ్డి, తహసీల్దార్ శివ ప్రసాద్ గుర్తించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బంది సంయుక్తంగా రోడ్డెక్కి చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా చేగుంట గిర్థవర్లు జయ భరత్ రెడ్డి,సుజాత,రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్తున్న లారీలను నిలిపివేసి, (పి పి సి )ల కు మళ్లించడం జరిగింది.ధాన్యం రవాణా ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ చర్యలతో రైతులకు ఊరట లభించడంతో పాటు కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతూ కొనుగోలు వేగంగా జరుగుతున్నాయి అని అధికారులు వెల్లడించారు.
6వ వార్డు కౌన్సిలర్ డి. రాజు నాయక్ టీచర్ కాలనీలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం (స్పెషల్ కరస్పాండెంట్)షాద్నగర్,మే,14,మెదక్ టుడే న్యూస్:షాద్నగర్ పట్టణంలోని 6వ వార్డు పరిధిలోని టీచర్ కాలనీలో నెలకొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వార్డు కౌన్సిలర్ డి. రాజు నాయక్ ముందుకు వచ్చారు. గురువారం ఆంజనేయస్వామి ఆలయం వెనుక ఉన్న కాలనీలో స్థానికులు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై స్పందించిన ఆయన, వెంటనే పనులు ప్రారంభించి సాటర్ను కొత్తగా ఏర్పాటు చేయించారు.పనులు పూర్తయ్యే వరకు స్వయంగా అక్కడే ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేసిన కౌన్సిలర్ రాజు నాయక్పై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వార్డులోని ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ వంటి సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా సేవలు అందించడం తన బాధ్యత అని రాజు నాయక్ పేర్కొన్నారు.