📄 ePaper
Friday, July 31, 2026
ADS
HomeNewsరైతులు సేంద్రియ పద్ధతి పాటించాలి-క్రీమ్సహారా పిచకారి తాగించాలి.

రైతులు సేంద్రియ పద్ధతి పాటించాలి-క్రీమ్సహారా పిచకారి తాగించాలి.

📰 Generate e-Paper Clip

వ్యవసాయ శాస్త్రవేత్త పుష్పవల్లి.

చేగుంట,మే,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో“రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డా. పుష్పవల్లి మాట్లాడుతూ రైతులు వర్షా కాలంలో వరి పంట సాగు చేసే ముందు రైతులు పచ్చి రొట్ట పంటలను మోకాలి దాని ఎత్తు వరకు పెంచి కలియ దున్నితే 20-30 శాతం వరకు యూరియా వాడకం తగ్గించవచ్చు అని తెలియచేసారు. పంటలలో రసాయనాలు తప్పనిసరి పరిస్థితి లో మాత్రమే వాడాలి అని, పక్షి స్థావరాలను, లింగ ఆకర్షణ బుట్టలను వాడి పురుగులను నియంత్రించాలని వారు సూచించారు. లెగ్యూమ్ జాతికి చెందిన అపరాలు నూనె గింజల పంటలతో పంట పంట మార్పిడి పాటించడం, సాగు నీటినిఆదా చేయడం, సేంద్రియ పద్ధతులను పాటించడం పై రైతులకు అవగాహన కల్పించారూ. కార్యక్రమంలో డా. తరుణ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారి మాధవి, పంచాయతీ సెక్రెటరీ సమీరా,వార్డ్ మెంబర్లు,ఫీల్డ్ అసిస్టెంట్, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular