📄 ePaper
Friday, June 5, 2026
ADS
HomeTelanganaధాన్యం కొనుగోళ్లపై సమర శంఖారావం

ధాన్యం కొనుగోళ్లపై సమర శంఖారావం

📰 Generate e-Paper Clip

కొల్చారం మండలం మే 20 (మెదక్ టుడే న్యూస్):

  • వారం రోజులు గడుస్తున్న లారీలు లేవు
  • 3000 బస్తాలు తూకం చేసి ఉన్న బస్తాలు
  • పని లేక వెళ్ళిపోతామంటున్న హమాలీలు

అలసత్వాన్ని నిరసిస్తూ మండల పరిధిలోని అంశాన్ని పల్లి గ్రామ రైతులు సమర శంఖారావం పూరించారు. సుమారు 3000 తూకం వేసిన బస్తాలు సిద్ధంగా ఉన్నప్పటికీ, వారం రోజులుగా లారీలు లేకపోవడంతో ఎక్కడికక్కడ రైతులు అట్టుడికి పోతున్నారు. మరో వైపు 25 లారీల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మగ్గుతుంది. ఇంకోవైపు వర్షాకాలం, ఉరుములు మెరుపులతో ఎప్పటికప్పుడు రైతాంగాన్ని బెంబేలెత్తిస్తోంది. దీంతో మౌనంగా ఉంటే నష్టం ఖాయం అనుకున్న రైతులు గురువారం పోరుబాటకు సిద్ధమయ్యారు. సుమారు 500 మంది రైతులతో మండల కేంద్రమైన కొల్చారం వద్ద మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ రాస్తారోకోకు గ్రామ సర్పంచ్ కన్నబోయిన గీతా రమేష్, పిఎసిఎస్ చైర్మన్ మన్నే రాములు, సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి ఇతర నాయకులు రైతుల ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగిరావడమో రైతులు ఓడడమో ఖాయమన్న పంతంతో రోడ్ ఎక్కడున్నా రైతన్నలు. అధికారుల నిర్లక్ష్యం రైతన్నల మెడలో ఉరితాడ ఈ వేలాడుతూ ఉంటే, రణమో, ప్రాణమో అన్న తెగింపుతో రైతులు పోరుబాటకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. అంసానిపల్లి రైతులకు మద్దతుగా మండల పరిధిలోని ఆయా గ్రామాల రైతులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular