📄 ePaper
Friday, June 5, 2026
ADS
HomeTelanganaబోనాల కొండాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే...

బోనాల కొండాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

లారీల పంపిణీలో ఎలాంటి ఆలస్యం చేయొద్దని అధికారులను హెచ్చరించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

చేగుంట,మే,20,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం బోనాల బోనాల కొండాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వడ్లు అమ్మడానికి తీసుకువచ్చిన రైతులు లారీల కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.లారీల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రైతులకు భరోసా కల్పిస్తూ, “లారీలను వెంటనే పంపించేలా చర్యలు తీసుకుంటాను” అని హామీ ఇచ్చారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే లారీలను ఏర్పాటు చేయాలని, రైతులు ఇబ్బందులు పడకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.లారీల పంపిణీలో ఎలాంటి ఆలస్యం చేయొద్దని అధికారులను హెచ్చరించిన ఎమ్మెల్యే రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular