📄 ePaper
Friday, April 17, 2026
ADS
Homeమెదక్ జిల్లా వార్తలుచేగుంటను నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలి: తహసీల్దార్‌కు బీజేపీ నాయకుల వినతి.

చేగుంటను నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలి: తహసీల్దార్‌కు బీజేపీ నాయకుల వినతి.

📰 Generate e-Paper Clip

చేగుంట,ఏప్రిల్,16,మెదక్ టుడే న్యూస్:

చేగుంట మండలం, భౌగోళికంగా,వసతుల పరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న చేగుంట మండల కేంద్రాన్ని నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని బీజేపీ మండల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం చేగుంట తహసీల్దార్ శివప్రసాద్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు దొంతిరెడ్డి ఎల్లారెడ్డి మాట్లాడుతూ, చేగుంటలో రైల్వే స్టేషన్, 44వ జాతీయ రహదారి సౌకర్యంతో పాటు ప్రభుత్వ భూములు, పరిశ్రమలు, విద్యాసంస్థలు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. చుట్టుపక్కల మండలాలకు మధ్యలో ఉండి నియోజకవర్గ ఏర్పాటుకు అన్ని అర్హతలు కలిగిన చేగుంటను, ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్రంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు చింతల భూపాల్, ఓబీసీ మోర్చా నాయకులు కరణం గణేష్, రవికుమార్, సంతోష్ రెడ్డి, వార్డు సభ్యులు సాయిబాబా, ఎల్లేష్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments