పాపన్నపేట,ఏప్రిల్,26,మెదక్ టుడే న్యూస్:ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన యూసుఫ్ పేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం… గ్రామానికి చెందిన ఎర్ర అశోక్ (31) వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు.గత కొంత కాలంగా మద్యం సేవించి ఇంటికి వస్తున్నాడు.శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి మద్యం సేవించి రాత్రి సమయంలో ఇంటికి వచ్చాడు.కుమారుడికి అనారోగ్యంగా ఉంది త్వరగా రమ్మని చెప్తే ఆలస్యంగా ఇంటికి వచ్చావు..ప్రతి రోజు ఇలా మద్యం సేవించి వస్తే ఎలా అని భార్య లక్ష్మీ అనడంతో క్షణికావేశంలో ఇంట్లో ఉన్న ఓ గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబీకులు గది తలుపు గొళ్లెం పగులగొట్టి చూడగా ఉరి వేసుకుని కనిపించాడు.వెంటనే కొన ఊపిరితో ఉన్న అతన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు.భార్య ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
