పాపన్నపేట,ఆగస్టు,1,(మెదక్ టుడే)మండల కేంద్రం పాపన్నపేటలోని నల్ల పోచమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనుండగా, సాయంత్రం బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం పెద్దలు, సభ్యులు,గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం ప్రతినిధులు కోరారు.


