📄 ePaper
Friday, July 31, 2026
ADS
Homeక్రైమ్మనస్థాపంతో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య...

మనస్థాపంతో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య…

📰 Generate e-Paper Clip

పాపన్నపేట జూలై 17 మెదక్ టుడే న్యూస్ :

మనస్థాపంతో ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని అర్కెల గ్రామంలో శుక్రవారం జరిగింది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు…గ్రామానికి చెందిన చిట్యాల ఉదయ్ కుమార్(23) కూలీ పనులు చేసుకుంటూ హైదరాబాద్ లో ఉంటున్నారు.అక్కడ ఉన్న సమయంలో పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన రాధను ప్రేమ వివాహం చేసుకున్నాడు.గత కొన్ని నెలలుగా దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది.దీంతో అప్పటి నుంచి అతను గ్రామానికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు.ఈనెల 15న భార్యను కాపురానికి రమ్మని పిలవడానికి వెళ్లగా ఆమె కాపురానికి రాను అని నిరాకరించింది.ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఉదయ్ కుమార్ గురువారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.శుక్రవారం ఉదయం గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి మృతుడి తల్లి సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular