పాపన్నపేట,జూలై,17,మెదక్ టుడే న్యూస్:
మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా మాతను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ అరికేపూడి గాంధీ శుక్రవారం దర్శించుకున్నారు. ఆయన ఆలయ రాజగోపురం వద్దకు చేరుకోగానే ఆలయ అర్చకులు,సిబ్బంది స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వారికీ తీర్థ ప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు.

