📄 ePaper
Saturday, August 1, 2026
ADS
HomeUncategorizedఘట్‌కేసర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

ఘట్‌కేసర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

ఇద్దరి దుర్మరణం.. ఒకరికి తీవ్ర గాయాలు

మెదక్ జిల్లా పాపన్నపేట మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఘట్‌కేసర్ సమీపంలో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో పాపన్నపేట, నార్సింగి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి గ్రామానికి చెందిన కటికే రషీద్ (42), ఆయన సోదరుడు కటికే గౌస్, పాపన్నపేటకు చెందిన డ్రైవర్ రాములు (48) జీవనోపాధి కోసం హైదరాబాద్‌లో మేకలు, గొర్రెల వ్యాపారం చేస్తున్నారు. గురువారం రాత్రి తమ వాహనంలో ప్రయాణిస్తుండగా, ఘట్‌కేసర్ సమీపంలో రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కటికే రషీద్, డ్రైవర్ రాములు అక్కడికక్కడే మృతి చెందగా, కటికే గౌస్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.మృతులు కుటుంబ పోషణ కోసం శ్రమించే వ్యక్తులు కావడంతో వారి ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే పాపన్నపేట, నార్సింగి గ్రామాల్లో శోకసంద్రం నెలకొంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular