జాతీయ పతాకావిష్కరణలో అధికారుల నిర్లక్ష్యం!
కిందికి దించి.. పైకి ఎగురవేత!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానమా?
కస్తూర్బా పాఠశాల, వ్యవసాయ శాఖ కార్యాలయంలోనూ ఇదే తీరపాపన్నపేట,ఆగస్టు,15,మెదక్ టుడే న్యూస్:స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాపన్నపేటలో నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణలో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో జాతీయ జెండాను ముందుగా కిందికి దించి అనంతరం పైకి. ఎగరవేసి,ఇదే తరహాలో మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలోనూ జాతీయ పతాకావిష్కరణ విషయంలో అధికారులు కనీస నిబంధనలు, సంప్రదాయాలను పాటించకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ పతాకానికి గౌరవం దక్కేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రజలు పేర్కొన్నారు.

