చేగుంట,మే,10,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో సెన్సెస్ 2027 మొదటి దశలో భాగంగా మే 11 నుంచి ప్రారంభమయ్యే ఇండ్ల గణన పైన చేగుంట తహసిల్దార్ శివ ప్రసాద్ వారికి అవగాహన కల్పించారు.అదేవిధంగా సెల్ఫ్ ఎనిమరేషన్ చేసుకోవాలని, ఒక దగ్గర సెన్సెస్ వివరాలు నమోదు చేసుకున్న వారు, మరో దగ్గర నమోదు చేయించుకోవద్దని, సెన్సెస్ వివరాలు పారదర్శకంగా రావాలంటే మీరు చెప్పే సమాధానాల పైన ఆధారపడి ఉంటుందని వారు అన్నారు . ఈ ఈ కార్యక్రమంలో చేగుంట ఎస్సై చైతన్య రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ ధనుష్, ఆర్ ఐ జయభారత్ రెడ్డి, ఫీల్డ్ ట్రైనర్ చల్లా లక్ష్మణ్,ఏ ఎస్ ఐ శ్రీనివాస్,హెడ్ కానిస్టేబుల్ సత్యం, కానిస్టేబుల్స్ లక్ష్మీపతి, మినా తదితరులు పాల్గొన్నారు.
