పాపన్నపేట,జూలై,20,(మెదక్ టుడే న్యూస్)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ‘రైతు భరోసా’ పథకం కింద వానాకాలం 2026-27కు సంబంధించిన కొత్త దరఖాస్తులు, బ్యాంకు ఖాతా వివరాల సవరణ కోసం ఈ నెల 31వ తేదీ వరకు మరో అవకాశం కల్పించింది.
2026 జూన్ 15వ తేదీ వరకు కొత్త భూ పట్టా పాసుబుక్ పొందిన రైతులు, అలాగే ఇప్పటి వరకు భూ పట్టా పాసుబుక్ ఉన్నప్పటికీ ‘రైతు భరోసా’ పథకం ప్రయోజనం పొందని అర్హులైన రైతులు తమ బ్యాంకు వివరాలను నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చని పాపన్నపేట మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస రాజు తెలిపారు.అనంతరంమాట్లాడుతూ,దరఖాస్తు చేసుకునే రైతులు రైతు భరోసా దరఖాస్తు ఫారం, భూ పట్టా పాసుబుక్ ( పిపిబి) కాపీ, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ లేదా క్యాన్సిల్ చెక్, మొబైల్ నంబర్తో పాటు సంబంధిత రైతు వేదికలోని వ్యవసాయ విస్తరణ అధికారి ( ఏ ఈ ఓ)ను సంప్రదించాలని సూచించారు.అలాగే, ఇప్పటికే ‘రైతు భరోసా’ పథకంలో నమోదైన రైతులు తమ బ్యాంకు ఖాతా వివరాలను మార్చుకోవాల్సి ఉంటే, ఈ నెల 31వ తేదీలోగా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి ( ఏఈఓ)ని సంప్రదించి అవసరమైన పత్రాలతో మార్పులు చేయించుకోవాలని అధికారులు తెలిపారు.అర్హులైన ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువు తేదీ జూలై 31లోపు దరఖాస్తులు సమర్పించి ‘రైతు భరోసా’ పథకం ప్రయోజనాలను పొందాలని ప్రజలను కోరారు.

