📄 ePaper
Friday, June 5, 2026
ADS
Home Blog Page 63

త్రికూటాద్రి ” శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం : కోటప్పకొండ..

0

(స్టేట్ బ్యూరో) గుంటూరు జిల్లా,నవంబర్, 12, మెదక్ టుడే న్యూస్:

•త్రికూటాద్రి ” శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం : కోటప్పకొండ (గుంటూరు జిల్లా)

•కాకులు దూరని కారడవి అనే పదం మీరు వినే ఉంటారు. కానీ కాకులు వాలని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు.

అవును ఈ కొండపై కాకులు వాలవు. #సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి. కానీ గుంటూరు జిల్లా నరసరావుపేటకు సమీపంలో ఉన్న కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు. దీనికి కారణం కాకులకు ఉన్నటువంటి శాపం ఆ స్థానికుల అభిప్రాయం. అసలు ఈ కొండపై కాకులు వాలకపోవడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా కోటప్ప కొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి.

కోటప్పకొండను త్రికోటేశ్వరాయలం, త్రికుటాద్రి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఏ దిశలో చూసినా రుద్ర శిఖరం, బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరం అనే మూడు శిఖరాలు దర్శనమిస్తాయి.

#అందుకే దీనిని “త్రికుటాద్రి” అని పిలుస్తారు. కోటప్ప కొండ గొప్ప శైవ క్షేత్రంగా కీర్తి పొందింది. #మహశివరాత్రికి ఘనంగా అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక విద్యుత్ ప్రభలు వస్తాయి. కొండపై “చతుర్ముఖ బ్రహ్మ” ఆకృతి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.#ఈ ప్రధాన మండపంలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఒక పక్క వినాయకుడు మరొక ప్రక్క కుమార స్వామి, మధ్యలో మోద దక్షిణామూర్తి అయిన శివుడ్ని ఆరాధిస్తూ, సేవిస్తూ ఉన్న ఋషి పుంగవులు దర్శనం ఇస్తారు. ఎడమ ప్రక్క పద్మాసనం మీద ఉన్న ధ్యాన శివుడి విగ్రహం గల “ధ్యాన మందిరం” ఉంది. యాగశాల, నవగ్రహ మండపం కూడా ఉన్నవి.

దక్షయజ్ఞము వల్ల సతీదేవి వియోగం తర్వాత పరమ శివుడు పిచ్చివాడై ముల్లోకాలు తిరుగుతుండగా ఆ శివుడ్ని ఆకర్షించి, ఆశ్రయమిచ్చి, బాల దక్షిణామూర్తి రూపంలో 12 సంవత్సరాలు ధ్యాన నిమగుడ్ని గావించిన స్థలమే ఈ త్రికోటేశ్వరాలయం. #ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తుండగా “ఆనంద వల్లి” అనే గొల్లభామ పాలు, తేనెలతో సేవించుచుండెను. శాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావటంతో అతనికి బాలయోగి రూపంలో ఉన్న శివుడు కనిపించాడు. శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను స్వామికి సమర్పించాడు.

ఒకసారి గొల్లభామ శివుడ్ని సేవించడానికి పాలను తీసుకువెళ్తూ అలుపు వల్ల తట్టను, పాల కుండలను ఒక గట్టు మీద ఉంచి సమీపంలో ఉన్న చెట్టు పూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాల కుండలపై వ్రాలి పాలను ఒలకబోయటంతో అది చూచి గొల్లభామ కోపంతో “ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదు” అని శపించెను.

ఒకనాడు శాలంకయ్య శివుని వద్దకు వచ్చి “తన యింటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని” వేడుకున్నాడు. అప్పుడు స్వామి “అలాగే వస్తానని, నువ్వు యింటికి వెళ్లమని” చెప్పారు. గొల్లభామ గర్భవతై “కొండకు రాలేకపోతున్నాను తండ్రీ, నీవే క్రిందకు రా!” అని శివుడ్ని వేడుకొనెను. #ఆమె మొర విని శివుడు గొల్లభామతో నేను క్రిందకు దిగునంత వరకు నీవు వెనుతిరిగి చూడరాదు” అని అనగా, “సరే” అంటూ ఆ గొల్లభామ పద ముందుకు నడుచుకుంటూ పోతూ ఉండగా సాంబశివుడు వెనుకగా బయలుదేరాడు.

శివుని పాద ధాటికి కొండలు పగిలి భయానకం కలిగించగా, ఆ గొల్లభామ వెనుకకు తిరిగి చూచినది. ఆమె చూడగానే పరమ శివుడు “లింగ రూపంగా మారాడు. #ఆ గొల్లభామ “శిల” రూపంగా మారినది. ఆ సమయంలో శాలంకయ్య “స్వామి ఆతిధ్యానికి” ఇంకా రాలేదని కొండ మీదకు రాగా ఈ దృశ్యం కనబడింది. శాలంకయ్య ఆశ్చర్యపోయి చూస్తూ విలపిస్తుంటే శివలింగం నుండి “ఈ కొండ క్రిందకు కోటి ప్రభలు ఏపుడు వస్తాయో, అప్పుడు నేను కొండ దిగి వస్తాను” అనే మాటలు వినిపించాయి. అప్పుడు శాలంకయ్య తన గ్రామం అయిన యలమందకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఒక ప్రభను తయారు చేసి, దాని గురించి ప్రజలకు వివరించి, “మీరు ప్రభలు కట్టుకొని స్వామి దగ్గరకు రమ్మని” చెప్పెను.

అప్పటి నుండి ప్రభలు కట్టుకొని భక్తులు వస్తున్నారు. స్వామి వారి అనుగ్రహంతో కొండవీడుని జయించిన శ్రీకృష్ణ దేవరాయులు కోటప్పకొండకు వచ్చి విలువైన కానుకలు సమర్పించి, నిత్య ధూప దీప నైవేధ్యాలకు “కొండ కావూరు” అనే గ్రామాన్ని వ్రాసి యిచ్చాడు. #ఇక్కడ గొల్లభామ ఆనందవల్లికి ఆలయం ఉన్నది. ఈ ఆలయమును, స్వామి వారి ఆలయమును శాలంకయ్య నిర్మించాడు. శాలంకయ్య అమ్మవారి ఆలయం కట్టించాలని అనుకున్నాడు. కాని. స్వామి వారు శాలంకయ్య కలలోకి వచ్చి “సతీ దేవి వియోగంలో ఉన్న వాడిని, ఆమెకు గుడి కట్టించవద్దు” అని చెప్పుటవలన అమ్మ వారి గుడి కట్టించలేదు.

మహాశివరాత్రి, కార్తీక మాస సమయాల్లో కోటప్ప కొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. #శివుడు దక్షిణామూర్తిగా, బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు. #పరమ శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే.*

ఇది నరసరావుపేటకి 12 కి.మీ.

గుంటూరుకి 56 కి.మీ. దూరంలో ఉంది.

పూతన పేరు వినగానే చిన్ని కృష్ణునికి విషపు పాలిచ్చి, అతని చేతిలో చనిపోయిన రాక్షస స్త్రీ అని అందరికీ గుర్తు వచ్చేస్తుంది.

0

(స్టేట్ బ్యూరో)నవంబర్,12,మెదక్ టుడే న్యూస్:

పూతన…..

పూతన పేరు వినగానే చిన్ని కృష్ణునికి విషపు పాలిచ్చి, అతని చేతిలో చనిపోయిన రాక్షస స్త్రీ అని అందరికీ గుర్తు వచ్చేస్తుంది. చిన్ని కృష్ణుని చేతిలో చనిపోయినవారిలో పూతనకు ఒక ప్రత్యేకత ఉంది. రాజైన కంసుని ఆజ్ఞ దాటలేక ఆమె ఎంతోమంది శిశువులను చంపింది. తన బిడ్డను తనే స్వయంగా చంపుకుంది. కంసుడు చివరగా నంద కుమారుడైన కృష్ణుని చంపమన్నాడు. స్త్రీలందరూ తనను చూసి భయపడుతున్నారని, శిశుహంతకి అని నిందిస్తున్నారని, ప్రతి శిశువులో తన బిడ్డ దీనాలాపాలు వినిపిస్తున్నాయని ఇంక తానీ దారుణం చేయలేనని ఆమె కంసుని వేడుకుంటుంది. కంసుడు తన ఆజ్ఞ పాటించకపోతే ఆమెనే చంపేస్తానంటాడు.దేవకీ దేవి అష్టమ గర్భాన పుట్టే శిశువు తన మరణానికి కారకుడవుతాడన్న ఆకాశవాణి పలుకులు విని కంసుడికి భయం పట్టుకుంటుంది. దేవకీ వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు. వారికి పుట్టిన ఆరుగురు శిశువులను చంపిస్తాడు. కృష్ణుడికి అగ్రజుడుగా పుట్టవలసిన ఏడవ శిశువు దేవకి గర్భంలో పెరుగుతుండగా యోగ మాయ రోహిణి గర్భంలో ప్రవేశపెడుతుంది. అతడే బలరాముడు.శ్రీకృష్ణ జననం కారాగారంలో కన్నులపండుగగా జరుగుతుంది. విష్ణుమాయతో ద్వారపాలకులంతా గాఢనిద్రలో ఉండగా, వసుదేవుడు చిన్ని కృష్ణుని తట్టలో పెట్టుకుని, యమునా నది దాటి, గోకులానికి వెళ్లి నందుడికి అప్పగిస్తాడు. బదులుగా పసిపాప ఉన్న తట్టను తీసుకువచ్చి దేవకి పక్కన పడుకోబెడతాడు. ఆమె యోగమాయ. యోగమాయ కంసుని చంపే మృత్యువు వేరే చోట పెరుగుతున్నాడని హెచ్చరిస్తుంది. దాంతో ఆ సమయంలో పుట్టిన శిశువులందరినీ కంసుడు చంపిస్తాడు. కంసుని ఆజ్ఞతో పూతన అందమైన స్త్రీ రూపంలో గోకులానికి మహా దేవుని పూజకని చెప్పివస్తుంది. స్త్రీలంతా ఆమెను సాదరంగా ఆహ్వానిస్తారు. చిన్ని కృష్ణుని లాలించి, ముద్దాడి పాలు ఇస్తున్నట్లుగా, విషపు పాలు ఇస్తుంది. చిన్ని కృష్ణుడు పాలతోపాటు ఆమె ప్రాణాలు పీల్చివేస్తాడు. పూతన నిజరూపంతో నేలకూలుతుంది. పూతన గత జన్మలో బలి చక్రవర్తి కూతురు రత్నమాల. శ్రీహరి వామన రూపంలో బలి దగ్గరకు వచ్చినప్పుడు రత్నమాల అతని ముగ్ధమనోహర రూపం చూసి ఈ అమృత మూర్తికి పాలిచ్చే భాగ్యం లేకపోయిందే అని బాధపడిందట. హరి ఆమె మనసు గ్రహించి, ద్వాపర యుగంలో పూతనగా జన్మించిన ఆమెవద్ద పాలు తాగి ఆమె కోరిక తీర్చాడు. తాగింది విషమైనా, తనకు పాలిచ్చిన తల్లిగా భావించి ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాడు. తనకు విషాన్నిచ్చిన వారికి అమృతత్వాన్ని ప్రసాదించిన కరుణామూర్తి శ్రీకృష్ణ పరమాత్మ! ఆ దివ్యమూర్తి కరుణను పొందిన ధన్యజీవి పూతన.

హైదరాబాద్: స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు,భారీ భద్రత..

0

హైదరాబాద్: స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు.. భారీ భద్రత..

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా పోలింగ్ స్టేషన్ల నుంచి ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. కేంద్ర సాయుధ బలగాల భద్రత నడుమ కేటాయించిన రూట్లలో ప్రత్యేక బస్సుల్లో సిబ్బంది ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కు భద్రంగా చేర్చారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పటిష్ఠ భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు.

మళ్లీ మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..

0

(స్టేట్ బ్యూరో) నవంబర్ 12 మెదక్ టుడే న్యూస్:

•మళ్లీ మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..

డాలర్ విలువ పెరిగే కొద్దీ బంగారం ధర తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం డాలర్ విలువ పెరిగే కొద్దీ అమెరికా ఫెడరల్ రిజర్వు జారీ చేసే ట్రెజరీ బాండ్లను పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే..బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ షాకిస్తున్నాయి. క్రమంగా పెరుగుతూ వస్తోంది. గతంలో లక్షా 30 వేల వరకు వెళ్లిన తులం బంగారం ధర.. లక్షా 20 వేల దిగువన చేరుకుంది. కానీ మెల్లమెల్లగా మళ్లీ పెరుగుదల నమోదవుతోంది. మూడు రోజుల్లోనే కనీసం 2 వేల రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం నవంబర్‌ 12వ తేదీన దేశంలో తులం బంగారం ధర రూ.1,25,850 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,650 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,010 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,360 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,980 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,510 ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,850

ఢిల్లీ బాంబు బ్లాస్ట్.. హైదరాబాద్ లో హై అలర్ట్..

0

(స్టేట్ బ్యూరో) నవంబర్ 12 మెదక్ టుడే న్యూస్:

•ఢిల్లీ బాంబు బ్లాస్ట్.. హైదరాబాద్ లో హై అలర్ట్..

•న్యూఢిల్లీ ఎర్రకోటలో బాంబ్ బ్లాస్ట్ దేశాన్ని వణికించింది.

•దీంతో మెయిన్ సిటీల్లో అధికారులు అలర్ట్ అయ్యారు.

SCR పరిధిలో భద్రతా తనిఖీలు కఠినం చేశారు. RPF, GRP బాంబు డిఫ్యూజ్ బృందాలు, డాగ్ స్క్వాడ్లు సికింద్రాబాద్, HYD, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లలో తనిఖీలు చేపట్టాయి. సీసీటీవీ నిఘా బలోపేతం చేసి, ప్రయాణీకులు అనుమానాస్పద వస్తువులు గమనిస్తే వెంటనే రైల్వే సిబ్బందికి తెలియజేయాలని అధికారులు సూచించారు.

న్యాయం చేయమని వెళ్తే. లంచం. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో ములుగు ఎస్ ఐ, కానిస్టేబుల్‌..!!

0

(స్టేట్ బ్యూరో)నవంబర్,12,మెదక్ టుడే న్యూస్:

50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో ములుగు ఎస్సై, కానిస్టేబుల్‌..!!

ప్రభుత్వ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో అక్రమంగా కబ్జా చేసిన కేసులో న్యాయం చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన ములుగు పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై, కానిస్టేబుల్‌ ఏసీబీ వలలో చిక్కారు.ములుగు పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై విజయ్‌కుమార్, కానిస్టేబుల్‌ రాజులు బాధితులపై ఒత్తిడి తెచ్చి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ డబుల్ బెడ్‌రూం ఇల్లుపై ఇతరులు అక్రమంగా కబ్జా చేయడంతో బాధితులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు వారి పక్షాన ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల కాపీని ఎస్సై విజయ్‌కుమార్‌కు అందజేసి న్యాయం చేయమని బాధితులు కోరారు.అయితే, ఆ ఇంటిని అప్పగించాలంటే రూ.1 లక్ష లంచం ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేశాడు. బాధితులు ఆ మొత్తం ఇవ్వలేకపోవడంతో రూ.50,000కు ఒప్పుకున్నారు. వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించారు.ఏసీబీ ఏర్పాటు చేసిన ఉచ్చులో మంగళవారం సాయంత్రం కానిస్టేబుల్‌ రాజు బాధితుల నుంచి రూ.50,000 లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.తదుపరి విచారణ అనంతరం ఎస్సై విజయ్‌కుమార్‌, కానిస్టేబుల్‌ రాజులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు..

ఏడుపాయల వనదుర్గమ్మ దివ్యదర్శనం..

0

పాపన్నపేట, నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

12/11/2025 బుధవారం శ్రీఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి విశేష అలంకరణ..

వేయ్యేళ్ల చారిత్రిక నగరం బెజవాడ

0

AP, ( స్టేట్ బ్యూరో) నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

•వేయ్యేళ్ల చారిత్రిక నగరం బెజవాడ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో విజయవాడ(బెజవాడ )రెండోప్రధాన నగరం.ఇది కృష్ణా నది ఒడ్డున ఉంది.ఈ నగరానికి పడమర సరిహద్దుగా ఇంద్రకీలాద్రి పర్వతం,ఉత్తరం సరిహద్దుగా బుడమేరు సరస్సు ఉంది.భౌగోళికంగా తూర్పు కనుమలలో భాగమైన చిన్న కొండలు మధ్య విజయవాడ విస్తరించి ఉంది.ప్రకాశం బ్యారేజి దక్షిణాన బకింహాం కాలువ ఉంది.ఇది ఒకప్పుడు జలరవాణా మార్గంగా విలసిల్లింది.నగరం మధ్యలోంచి మూడు కాలువలు బందరు,ఏలూరు,రైవిస్ కాలువలు ప్రవహిస్తున్నాయి.నదీపరివాహక ప్రాంతం సారవంతమైన నేల కావడంతో ఈ కాలువలు సాగునీరు అందిస్తున్నాయి.వర్షపాతం నైరుతీ,ఈశాన్య రుతుపవనాల నుంచి లభిస్తుంది.ఏడాదిలో ఎక్కువ రోజులు అధిక ఉష్ణోగ్రత ఉంటుంది.నగరానికి పశ్చిమాన కొండపల్లిరిజర్వ్ అడవులు ఉన్నాయి.1871లో బెజవాడ జనాభా 8206, 2011లో 14,91,202 మంది కాగా 2025 లో 2.35 మిలియన్ల గా పెరిగింది.భారతదేశంలో ప్రధాన రైల్వే జంక్షన్ గా మారింది.నేడు విజయవాడ రాష్ట్రానికీ ఆర్ధిక,రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతోంది.విజయవాడకు కనకదుర్గమ్మ (విజయ )నుంచి విజయవాటికగా పేరు వచ్చింది.కాలక్రమేణా విజయవాడ గా మారింది.విజయవాడ అన్న పేరు ఇటీవలే ప్రాచుర్యం చెందింది.పూర్వం నుంచి బెజవాడ అని పిలిచేవారు.యుద్ధమల్లుని శాసనాలలో,కొండవీడు శాసనంలో ఈ ప్రాంతాన్ని బెజవాడగా ప్రస్తావించారు. ఈ రెండు పేర్ల వెనుక పలు కథలు ప్రచారంలో ఉన్నాయి.విపరీతమైన ఎండలు ఈ ప్రాంతంలో ఉండడంతో బ్లేజువాడగా పేరు పొందింది.బ్రిటీష్ వారు రాకముందే బెజవాడ పేరు శాసనాలలో కనిపించడం గమనార్హం.విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి బెజవాడకు బ్లేజువాడగా చమత్కరించడం వల్ల అది ప్రచారంలో వచ్చిందని మరో కధనం.
విజయవాడ ఇంద్రకీలాద్రి పై అర్జునుడు శివుడి కోసం తపస్సు చేసాడు.కిరాతరూపంలోని శివుడితో పోరాడాడని చెప్పే పురాణం కథ ఇది.విజయుడనే అర్జునుడి పేరుమీదే విజయవాడ గా వచ్చింది.పాశుపతాస్త్రం ఇక్కడే అర్జునుడు సాధించాడని పురాణ కథ.స్థల పురాణం వివరించే ఒక శాసనంలో ఈప్రాంతాన్ని వెచ్చవాడగా వ్యవహరించారు.జలమార్గం,భూమార్గం గా ప్రాచీనకాలం నుంచి కీలకమైన వాణిజ్య కూడలిగా ప్రసిద్ధిచెందింది.వెచ్చాలు అధికంగా లభించే చోటు కావడం తో వెచ్చవాడగా ప్రజలు నోళ్లలో నానుడి గా మారింది.అలాగే బీజవాటిక,బీజపురి,బెజ్జం వాడ,చోళరాజేంద్రపురం,అర్జునపురి వంటి పేర్లు కూడా ఉన్నాయి.
ఇక్కడి గుహలు విజయవాడ చరిత్రకు ప్రధాన సూచికలు. విజయవాడ లో హిందువులు 85 శాతం ఉన్నారు.ముస్లింలు వన్ టౌన్ తదితర ప్రాంతంలో 10 శాతం , క్రైస్తవులు 3.6 శాతం,ఇతరులు(జైనులు) 1.4శాతం ఉన్నారు.శిక్కులుఅధికంగా నివసించే ప్రాంతంగా గురునానక్ నగర్ ఏర్పడింది. వాణిజ్య కేంద్రం కావడంతో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ గా ఉంది.అటోనగర్ లో మోటారు వాహనాల విడిభాగాలు,భవన నిర్మాణ సామాగ్రి,దుస్తుల తయారీ జరుగుతోంది.తెలుగు చిత్రనిర్మాణం మద్రాసు, హైదరాబాద్ లలో జరిగినా సినిమా పంపిణి వ్యవస్థ విజయవాడలోనే నెలకొంది. ముద్రణా రంగం అది నుంచి విజయవాడ కేంద్రంగా ఉంది.లక్షలపుస్తకాల ముద్రణ జరిగింది,ఇప్పటికీ జరుగుతున్నది.రాష్ట్రంలోజరిగే ముద్రణలో 90 శాతం ఇక్కడే జరుగుతున్నది.ప్రధాన పత్రికల కార్యాలయాలు,ముద్రణ కేంద్రాలు బెజవాడ లోనే ఉన్నాయి.పురాతనమైన రామ్మోహన గ్రంథాలయం,హనుమంతరావు గ్రంథాలయాలకు ఈ వాడ ప్రసిద్ధి.వెలిదండ్లహనుమంతరావు ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని లాఠీ దెబ్బలకు జైల్లో మరణించారు.ఆయన గుర్తుగా 1934లో ఈ గ్రంథాలయం ప్రారంభించారు.విక్టోరియామ్యూజియంలో పురాతనమైన శిల్పాలు భద్రపరిచారు.బౌద్ధులు,జైనులు,శైవులకు ప్రాచీన కాలం నుంచి బెజవాడ ఆలవాలం.అందుకు సాక్ష్యాలుగా గుహాలయాలు మిగిలాయి.ప్రసార కేంద్రాలుగా ఆకాశవాణి, దూరదర్శన్ లు ఉన్నాయి.నగరంలో 1921లో మారుతీ సినిమా హాలుతో సినిమాల ప్రదర్శన ప్రారంభమైంది.దుర్గకళామందిరం(1923),రామాటాకీసు(1929) ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతానికే చెందిన ఎన్టీఆర్, ఏఎన్నార్ ,సావిత్రి సినీ రంగ దిగ్గజాలు.16,65 జాతీయ రహదారులు నగరంతో అనుసంధానమై ఉన్నాయి.ఇన్నర్ రింగ్ రోడ్డు పూర్తయితే ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.పాయకాపురం నుంచి రామవరప్పాడు వరకూ రింగ్ రోడ్డు పూర్తిచేయాల్సిఉంది.నగరానికి మెట్రో రైలు కూడా ఇటీవలే మంజూరు అయింది. నగరంలో ప్రధానంగా బందరు,ఏలూరు రహదారులు ఉన్నాయి.బీసెంట్ రోడ్డు నగరం ప్రధానవ్యాపార కూడలి.వన్ టౌన్ సామరంగ్ చౌక్ పరిసరాలు హోల్ సేల్ పచారీ సరుకులు మార్కెట్. విజయవాడ కు 19 కి.మీ దూరంలో గన్నవరంలో విమానాశ్రయం ఉంది.భారత దేశంలోని ప్రధాన నగరాలకు ఇక్కడినుంచి విమాన సౌకర్యం ఉంది.విద్యలకు కూడా విజయవాడ నెలవు.50 ఏళ్ల క్రితం లయోలా,స్టెల్లా,కేబీఎన్,ఎస్ఆర్ ఆర్ కళాశాలలు ప్రధాన విద్యా కేంద్రాలుగా విలసిల్లేవి. ఎన్టీఆర్ ఆరోగ్యవైద్య విశ్వవిద్యాలయం(దేశంలో మొదటి ఆరోగ్యవైద్య వర్సిటీ) విజయవాడ లో నెలకొంది.ప్రభుత్వ ఆస్పత్రితోపాటు పలు ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి. 1940లనుంచి విజయవాడ కమ్యూనిస్టుల కోటగా ఉంది.కార్పొరేషన్ మొదటిమేయర్ పదవి కమ్యూనిస్టులకే దక్కింది.గన్నవరంలో ఐటీ పార్క్ , ఎస్ఈజడ్ ఏర్పాటు కానుంది.మరో ఐటీ పార్క్ మంగళగిరిలో ఏర్పాటు కానుంది.నగరంలో నాలుగు సీవేజ్ (మురికినీటి శుద్ధి) ప్లాంట్లు ఉన్నాయి. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ విజయవాడ వాసి.ప్రముఖ శిల్పి కృష్ణారావు (ఉండవల్లి అనంతస్వామి విగ్రహం సరి చేసినవాడు), స్థానికులే.మల్లయోధులు మహమ్మద్ గాలీబ్,సయ్యద్ అప్పలస్వామి ఇక్కడి వారే.జైనమతాచార్యుడు కాళీ భద్రాచార్యుడు,శైవమతాచార్యులు శ్రీపతి పండితారాధ్యులు విజయవాడ వారే.రాజకీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు అయ్యదేవర కాళేశ్వరరావు,మరుపిళ్లచిట్టి,కాట్రగడ్డ మధుసూదనరావు,గులాం మొహిద్దీన్, బాలసుబ్రహ్మణ్యం గుప్తా ,రాంపిళ్ల నరసాయమ్మ ప్రముఖులు. ప్రముఖ నాస్తిక కేంద్రం స్థాపకుడు గోపరాజు రామచంద్రరావు(గోరా) ఇక్కడి వారే.డా.సమరం,లవణం,సమరం ఆయన కుమారులే.7 కి.మీ మేర సూపర్ స్ట్రక్చర్ వంతెన నిర్మించి బైపాస్ కు అనుసంధానం చేయనున్నారు.నగరం 61.88 కి.మీ మేర విస్తరించి ఉంది.రెండవ అతి పెద్ద నగరం.జన సాంద్రత కి.మీ 16.939 మందిగా ఉంది.సాంస్కృతిక కార్యక్రమాలు తుమ్మలపల్లి కళాక్షేత్రం, సిద్ధార్ధ అకాడమి కేంద్రంగా జరుగుతున్నాయి.అతి పెద్ద పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి జిల్లా, రాష్ట్ర, అంతరాష్ట్ర బస్సులు తిరుగుతాయి.నగరంలో 400 వరకూ సిటీ బస్సులు తిరుగుతాయి.రాష్ట్రలారీరవాణా అసోసియేషన్ కు విజయవాడ ప్రధాన కేంద్రం.

చారిత్రిక నేపధ్యం

3 నుంచి 7 లో శతాబ్దం వరకూ పాలించిన విష్ణుకుండినులకు బెజవాడ రాజధానిగా విలసిల్లింది. రాజు మాధవవర్మ కుమారుడు రథ చక్రం క్రింద బీద బాలుడ్ని చంపడంతో రాజు తన కుమారుడినీ అలాగే చంపాలని అజ్జాపించాడు.మల్లేశ్వరాలయంలోని విష్ణువర్ధనుడి శాసనం,మరో కాల్యమబోయ శాసనం,విజయనగరం జమిందారులచరిత్ర,చాటువులు ఈ సంఘటనను పేర్కొంటున్నాయి. అక్కన్న,మాదన్న గుహలు,మొగల్రా జపురం గుహలు మూడు, నాలుగు శతాబ్దాలకు చెందినవి.ఒకప్పుడు ఇవి బౌద్ధరామాలని తరువాత శైవులు స్వాధీనంలోకి వెళ్లాయని చారిత్రికుల అభిప్రాయం. వీటిని విజయవాడను పాలించిన శాలంకాయనులు,పల్లవులు నిర్మించారని మరో కధనం.8వశతాబ్దంలో చైనా యాత్రికుడు హు ఆన్ చ్వాంగ్ విజయవాడను సందర్శించాడని,ఆయన ఈ ప్రాంతం తెనకచక (ధాన్యకటకం)రాజ్యంలో భాగంగా పేర్కొన్నారు.సీతానగరం,ఉండవల్లి కొండలగుహల్లోబౌద్ధభిక్షవులు దీపాలు వెలిగించే వారిని,కాంతిలో బెజవాడ వెలిగిపోతున్నదని రాసాడు.ఇక్కడ ఔషధ కొండ ఉండేదని,ఈపర్వత సానువుల్లో సంచరించేసాధువులకు బంగారం తయారు చేసే హేమ విద్య తెలుసని రాసాడు. కృష్ణా నది లోకానికి ఉపకారం చేసే అనేక ఔషధల్ని,బీజాల్ని ప్రవాహంతో ఈ ప్రాంతంలో పడేయడం తో దీనికి బీజపురిగా పేరు ఉంది.ఆ బీజాలు మొలకెత్తి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసాయంటారు.శాతవాహనుల కాలం నుంచి విజయవాడ పేరు శాసనాలలో కనిపిస్తుంది.
8-10 శతాబ్దాల మధ్య ఈ ప్రాంతాన్ని పాలించిన వేంగి చాళుక్యుల పై రాష్ట్రకూటులు పలుమార్లు దండయాత్రలు చేసేవారు.ఈయుద్ధాల్లో నగరం పలుమార్లు చేతులు మారింది. యుద్ధమల్లుడు రాష్ట్ర కూటులతో సంధి చేసుకుని మళ్లీ విజయవాడను సొంతం చేసుకున్నాడు.ఆ తర్వాత చోళులకు,చాళుక్యులకు 70సంవత్సరాలపాటు సాగినయుద్ధంలో ఇక్కడ శాంతిభద్రతలు కరువైనాయి.సా.శ 999లో రాజరాజ చోళుడు చాళిక్యులపై విజయంతో విజయవాడను స్వాధీనం చేసుకున్నాడు.దాంతో వేంగి చాళిక్యులు తమ రాజధాని బెజవాడ నుంచి రాజమహేంద్రవరానికి మార్చారు.
11-18 శతాబ్దాల నుంచి రాజధాని కాకపోవడంతో రాజకీయ ప్రాధాన్యత కోల్పోయింది.వాణిజ్య కేంద్రంగా మారింది.11 వశతాబ్దినాటి 47శాసనాలు ఈ ప్రాంతంలో లభించాయి.ఇతర తవ్వకాల వల్ల వేయ్యేళ్ల క్రితంఇక్కడ మహానగరం ఉండేదని చరిత్ర కారులుచెబుతున్నారు.కృష్ణానదిలోఓడిసా, మధ్యప్రదేశ్,కర్ణాటకకు జలమార్గం ఉండేది.దక్షిణాపద భూమార్గాలకు కూడలిగా ఉండేది.కాకతీయులు,రెడ్డిరాజులు,గజపతులు విజయవాడను వ్యాపార కేంద్రంగానే అభివృద్ధి చేసారు.15వశతాబ్దిలో పూసపాటి రాజులు పాలించారు.గజపతులపై యుద్ధానికి వెళుతూ శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ విడిది చేసాడు. సమీపంలోని శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ను సందర్శించారు.స్వామి ఆదేశంతోనే ఆయన ఆముక్తమాల్యద కావ్యరచనకు పూనుకున్నారని అవతారికలో రాసాడు.16వశతాబ్ది తరువాత అటు రాజకీయ,వాణిజ్య ప్రాముఖ్యత ను కోల్పోయి చిన్న ప్రాంతానికి పరిమితం అయింది.ఈస్టిండియా కంపెనీ కాలంలో1832లోతీవ్రకరువు సంభవించింది.అప్పుడు ఆర్ధర్ కాటన్ కృష్ణానదిపై ఆనకట్ట నిర్మించి నీటిని నిల్వ చేసి సేద్యానికి ఉపయోగించాలని నివేదిక ఇచ్చాడు.ఈప్రాంతం పరిశీలించి విజయవాడ ఆనకట్టకు అనువైనదని ఎంపిక చేసాడు.19వదశకంలో ఆనకట్ట నిర్మాణం తో మళ్లీ బెజవాడకు ప్రాముఖ్యత పెరిగింది.1888లో మున్సిపాలిటీ,1981లో కార్పోరేషన్ అయింది.1940 వరకూ వన్ టౌన్ ప్రాంతం అడవి,కొండలుగా ఉండేది.1947తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంతో అక్కడి ప్రజలు వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు.49 నాటికి అకస్మాత్తుగా జనసాంద్రత వన్ టౌన్ లో పెరిగింది.1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుతో రాజధానిగా విజయవాడను చేయాలని ప్రతిపాదన ఒక్క ఓటుతో వీగి కర్నూలు అయింది.తెలంగాణ విలీనం తో 1956 లో హైదరాబాద్ రాజధాని అయింది.మొదటి నుంచి ఓడరేవు గా మచిలీపట్నానికి ఉన్న ప్రాముఖ్యత బెజవాడకు రాలేదు.తెలంగాణ విభజనతో విజయవాడ,గుంటూరు మధ్య ప్రాంతం అమరావతి గా రాజధాని అయింది.కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాకు రాజధానిగా విజయవాడ మారింది.పర్యాటక ప్రదేశాలలో కనకదుర్గ గుడి
గాంధీ కొండ,ఉండవల్లి,మొగల్ రాజగోపురం గుహలు,హజ్రత్ బాల్ మసీదు,గుణదల మేరీ మాత కొండ, బట్టర్ ఫ్లై పార్క్, ప్రకాశం బ్యారేజి,భవానీ ద్వీపం,కొండపల్లి ఖిల్లా తదితరాలు ఉన్నాయి.ఏదిఏమైనా విజయవాడ నగరానికి చారిత్రిక,రాజకీయ, సాంస్కృతిక నేపధ్యం ఉంది.నవ్వ ఆంధ్ర ప్రదేశ్ కు అమరావతి రాజధాని అయినా ముఖద్వారం విజయవాడ కావడం దానికున్న ప్రాశస్త్యం మారదు.

బోనాల అనంతసాగర్ రైస్ మిల్లులను పరిశీలించిన తాహసిల్దార్ శివప్రసాద్..

0

బోనాల అనంతసాగర్ రైస్ మిల్లులను పరిశీలించిన తాహసిల్దార్ శివప్రసాద్.

చేగుంట,నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

చేగుంట మండలం బోనాల,అనంతసాగర్ రైస్ మిల్లులను పరిశీలించి తగు సూచనలు చేసిన చేగుంట తహసీల్దార్ శివ ప్రసాద్,మిల్లు కు వచ్చిన లారీలను తొందరగా కాలిచేసి పంపాలని హమాలీలను పెంచాలని సూచించారు.తహసీల్దార్ వెంట ఆర్ఐ జయభారత్ రెడ్డి,సర్వేయర్ రవీందర్ రెడ్డి ఉన్నారు.

జిల్లా ఎస్ పి ఆదేశాల మేరకు భద్రతా చర్యలలో భాగంగా బీడీ టీమ్‌, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు..

0

మెదక్, నవంబర్, 11, మెదక్ టుడే న్యూస్:

•జిల్లా ఎస్ పి ఆదేశాల మేరకు భద్రతా చర్యలలో భాగంగా బీడీ టీమ్‌, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు..

జిల్లా పోలీస్ అధికారి శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం మెదక్ టౌన్ పరిధిలో భద్రతా చర్యల భాగంగా బీడీ టీమ్‌ మరియు డాగ్ స్క్వాడ్‌ సిబ్బంది సంయుక్తంగా న్యూ బస్ స్టాప్‌, ఓల్డ్ బస్ స్టాప్‌, రైల్వే స్టేషన్‌ మరియు చర్చి ప్రాంతాలలో చెకింగ్‌ నిర్వహించారు.ఈ తనిఖీల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, లగేజీలు మరియు వస్తువులపై క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల భద్రతను బలోపేతం చేయడం, అనుమానాస్పద కార్యకలాపాలను నిరోధించడం ప్రధాన లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.అదే విధంగా, గత ఐదు రోజులుగా గుల్షన్ క్లబ్ దగ్గర రోడ్డు పక్కన ఒక వాహనం ఆగి ఉండగా, అది ఉపయోగించకుండా ఉండడం వల్ల అనుమానాస్పదంగా కనిపించిందని ఒక వ్యక్తి సమాచారం ఇవ్వడంతో, మెదక్ టౌన్ సీఐ శ్రీ మహేష్ గారు వెంటనే స్పందించి బీడీ టీమ్‌ను ఘటన స్థలానికి తీసుకొని వచ్చారు.బీడీ టీం సిబ్బంది ఆ వాహనాన్ని అన్ని కోణాల్లో తనిఖీ చేసిన అనంతరం ఆ వాహనంలో ఎలాంటి ప్రమాదకరమైన వస్తువులు లేవని నిర్దారించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్ పి శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ మాట్లాడుతూ, ప్రజల భద్రత పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యం అని, ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే ప్రజలు సమీప పోలీస్ స్టేషన్‌ లేదా డయల్‌ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ మహేష్, ఆర్‌ఎస్ఐ సుభాష్, బీడీ టీమ్‌ నర్సింలు, డాగ్ స్క్వాడ్‌ శ్రావణి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.