📄 ePaper
Saturday, June 6, 2026
ADS
Home Blog Page 28

కాటా.. నీ బట్టేబాజ్ మాటలు బంద్ చేయ్.. ఒక గజం కబ్జా నిరూపించినా ఏ శిక్షకైనా సిద్ధం!

0

హరీష్ రావు ని విమర్శించే స్థాయి నీకు లేదు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం

జిల్లా మంత్రి ఒత్తిడితోనే అక్రమ కేసులు.. సొంత కుటుంబానికే న్యాయం చేయని నువ్వా మాకు చెప్పేది?

పటాన్‌చెరు,మార్చి,31,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పై మరియు తనపై కాంగ్రెస్ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న నిరాధార ఆరోపణలపై పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాటా శ్రీనివాస్ గౌడ్ తీరును ఎండగట్టారు.

వార్తలోని ముఖ్యాంశాలు:

  • నీ స్థాయి తెలుసుకో: “రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన నీకు.. మూడుసార్లు ప్రజల మద్దతుతో గెలిచిన నాపై, ఉద్యమ నేత హరీష్ రావు పై మాట్లాడే అర్హత లేదు. ఐదు మున్సిపాలిటీల్లో ప్రజలు చెంప చెళ్లుమనిపించినా నీకు సిగ్గు రాలేదా?” అని ఎమ్మెల్యే నిలదీశారు.
  • వసూళ్ల పర్వం – టికెట్ల అమ్మకం: ఎన్నికల సమయంలో కార్యకర్తలకు బి-ఫామ్ లు అమ్ముకోవడం కాటా నీచ చరిత్ర అని, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని రూ. 40 లక్షలకు అమ్ముకున్నాడని ఆరోపించారు. జిల్లా మంత్రి కూతురు పెళ్లి పేరుతో బిల్డర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడింది నిజం కాదా అని ప్రశ్నించారు.
  • మైనింగ్ కేసు వెనుక రాజకీయ కుట్ర: జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ ఒత్తిడితోనే తన సోదరుడిపై అక్రమ మైనింగ్ కేసులు పెట్టించారని ఆరోపించారు. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే తాము క్రషర్ నడిపామని, గతంలో వేరే కంపెనీ చేసిన మైనింగ్‌ను కూడా తమ ఖాతాలో వేసి తప్పుడు పెనాల్టీలు వేశారని వివరించారు. కోర్టు రీ-సర్వేకు ఆదేశించినా, మంత్రి ఒత్తిడితో అధికారులు సర్వే చేయకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.
  • కబ్జా ఆరోపణలు నిరూపించు: పోచారం, అన్నారం భూములపై కాటా చేస్తున్న ఆరోపణలు కేవలం అజ్ఞానమేనని కొట్టిపారేశారు. “నేను ఒక గజం భూమి కబ్జా చేసినట్టు నిరూపించినా ఏ శిక్షకైనా సిద్ధం. 2001 నుండి నా సొంత ఆస్తులు అమ్ముకుని ప్రజా సేవ చేస్తున్నానే తప్ప.. నీలా కబ్జాలు చేయలేదు” అని స్పష్టం చేశారు.
  • కుటుంబ ద్రోహివి నువ్వు: “సొంత తల్లికి తిండి పెట్టక, తోబుట్టువులను మోసం చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే నువ్వు ప్రజలకు ఏం సేవ చేస్తావు? సొంత కుటుంబానికే న్యాయం చేయలేని వ్యక్తివి పటాన్‌చెరు ప్రజల గురించి మాట్లాడటం హాస్యాస్పదం” అని ఎద్దేవా చేశారు.

హెచ్చరిక:

ఇప్పటికైనా బట్టేబాజ్ మాటలు బంద్ చేసి, ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, లేనిపక్షంలో ప్రజలే నీకు తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు.ఈ సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కాటా సునీత రాజేష్ గౌడ్, పటాన్‌చెరు బిఆర్ఎస్ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్స్, మాజీ కౌన్సిలర్స్, మాజీ కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, నవీన్, శంకర్ యాదవ్ మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

హరీష్ రావు ని విమర్శించే స్థాయి నీకు లేదు.. కాటా శ్రీనివాస్ గౌడ్ కు సోయి లేదా?

0
  • ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నేతపై విరుచుకుపడ్డ బిఆర్ఎస్ శ్రేణులు
  • ఘాటుగా సమాధానం ఇచ్చిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కాటా సునీత రాజేష్ గౌడ్

పటాన్‌చెరు,మార్చి,31,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పై కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం పటాన్‌చెరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి కాటా సునీత రాజేష్ గౌడ్, పటాన్‌చెరు బిఆర్ఎస్ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు కాంగ్రెస్ వైఖరిపై నిప్పులు చెరిగారు.

మీడియా సమావేశంలో ముఖ్య అంశాలు:

  • స్థాయి మరిచి మాట్లాడొద్దు: “హరీష్ రావు తెలంగాణ ఉద్యమ నాయకుడు, అభివృద్ధి ప్రదాత. అటువంటి వ్యక్తిని విమర్శించే స్థాయి, అర్హత కాటా శ్రీనివాస్ గౌడ్‌కు లేదు. రాజకీయాల్లో నీ అడ్రస్ ఎక్కడ?” అని సునీత రాజేష్ గౌడ్ నిలదీశారు.
  • మున్సిపల్ ఎన్నికల గుణపాఠం: గత మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, నీకు గట్టిగా బుద్ధి చెప్పినా ఇంకా సోయి రాలేదా? అని ధ్వజమెత్తారు. ప్రజలు తిరస్కరించినా ఇంకా అబద్ధాలతో పబ్బం గడుపుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
  • కుటుంబ నైతికతపై ప్రశ్న: సొంత అన్నదమ్ములను, కుటుంబ సభ్యులను గౌరవించలేని వ్యక్తి, ప్రజల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఈ మీడియా సమావేశంలో పటాన్‌చెరు బిఆర్ఎస్ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ నవీన్, శంకర్ యాదవ్, మాజీ చైర్మన్స్, మాజీ కౌన్సిలర్స్, మరియు నియోజకవర్గ స్థాయి బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సింగూర్ నుంచి ఘనపూర్‌కు 0.3 టీఎంసీ నీరు విడుదల చేయాలి-మాజీ డిప్యూటీ స్పీకర్ యం.పద్మ దేవేందర్ రెడ్డి.

0

రైతులను ఆదుకోవాలి.

మాజీ డిప్యూటీ స్పీకర్ యం.పద్మ దేవేందర్ రెడ్డి

మెదక్,మార్చి,30,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.సింగూర్ ప్రాజెక్ట్ నుండి ఘనపూర్ రాయకట్టకు 0.3 టీఎంసీ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మ దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పాపన్నపేట మండలం చిత్రియాల గ్రామ శివారులో పంటపొలాలను పార్టీ మండల నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సంవత్సరం రైతుల అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేసి రెండు పంటలు పండించే అవకాశం కల్పించారని తెలిపారు. ఘనపూర్ ఆయకట్ట పరిధిలో ఎఫ్‌ఎం, ఎఫ్‌ఎన్ కాలువల ద్వారా మూడు మండలాలకు సాగునీరు అందుతూ రైతులు పుష్కలంగా పంటలు పండించుకునేవారని చెప్పారు. పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నదని గుర్తుచేశారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నీటి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ఈ సీజన్‌లో సింగూర్ నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదన్నారు.రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించకపోవడం, నష్టపరిహారం ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. నర్సాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. పంటలు పొట్టదశలో ఉన్నందున వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు వీరి వెంట చిట్రియల్ సర్పంచ్ సురేష్, పాపన్నపేట్ మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్ బాల గౌడ్, మాజీ రైతుబంధు అధ్యక్షులు సోములు,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు కొత్తపల్లి జగన్, మాజీ సర్పంచులు గురుమూర్తి గౌడ్, బద్రి.మల్లేశం శ్రీనాథ్ రావు, నాయకులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

వీర హనుమాన్ విజయాత్ర’ బైక్ ర్యాలీ గోడ పత్రిక ఆవిష్కరణ.

0

చేగుంట,మార్చి,29,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్ దళ్, శ్రీ కార్తవీర్యాయోగాశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ‘వీర హనుమాన్ విజయాత్ర’ బైక్ ర్యాలీ గోడ పత్రికను ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో జరిగిన సన్నాహక కార్యక్రమంలో చేగుంట ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీక్ భజరంగ్ దళ్ కండువా కప్పుకుని మత సామరస్యానికి సరికొత్త నిర్వచనం చెప్పారు. హిందూ ముస్లిం సోదరులందరూ మత విభేదాలకు అతీతంగా ఒక్కతాటిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నెల 31వ తేదీ మంగళవారం నాడు హనుమాన్ దేవాలయం వద్ద శ్రీ కార్తవీర్య యోగాశ్రమం చేగుంట వారి సౌజన్యంతో మధ్యాహ్నం 1:00 గంట నుండి సుమారు వెయ్యి మంది భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు కరణం గణేష్ రవి కుమార్ తెలిపారు. అనంతరం అదే రోజు సాయంత్రం 3:00 గంటల నుండి ఆధ్యాత్మిక చైతన్యం నింపే లక్ష్యంతో సాగే ‘వీర హనుమాన్ విజయాత్ర’ బైక్ ర్యాలీ అత్యంత వైభవంగా సాగనుంది. చేగుంట గ్రామ క్షేమం కోసం, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమంలో చేగుంట మండలం తో పాటు పక్క మండలాల నుండి యువత, భక్తులు, ధర్మ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు నాగరాజు ప్రధాన కార్యదర్శి శ్యామ్ మండల అధ్యక్షులు సోమ సురేష్ భూపాల్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సండ్రుగు సతీష్, మండల బిజెపి పార్టీ మాజీ అధ్యక్షులు చింతల భూపాల్, చేగుంట గ్రామపంచాయతీ వార్డు సభ్యులు సాయిబాబా, శ్రీరమణి శ్రీనివాస్, ఆరిఫ్,సుఖేందర్,శ్రీ కార్తవీర్యాయోగాశ్రమం సభ్యులు నాంపల్లి, భూపాల్ రెడ్డి,శంకర్,తదితరులు పాల్గొన్నారు.

బెట్టింగ్‌కు అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు- జిల్లా ఎస్ పి.

0

బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు, ఐపీఎస్

మెదక్,మార్చి,29,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి. జిల్లాలో ఎవరైనా క్రికెట్‌ లేదా ఇతర బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ హెచ్చరించారు.ఇటీవల కాలంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత క్రికెట్‌ బెట్టింగ్ మోజులో పడి తమ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారని తెలిపారు. యువత బెట్టింగ్‌ల వైపు వెళ్లి ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా వారు మొబైల్ ఫోన్ వినియోగం, ప్రవర్తనను గమనించాలని, అనుమానాస్పద మార్పులు కనిపిస్తే వెంటనే స్పందించాలని తెలిపారు.
జిల్లాలో బెట్టింగ్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, ఆధునిక సాంకేతికతతో పాటు టాస్క్‌ఫోర్స్ మరియు ప్రత్యేక బృందాల సహకారంతో నిఘా పెంచుతున్నామని పేర్కొన్నారు.జిల్లాలో ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెట్టింగ్‌లపై సమాచారం ఉన్నవారు వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100, అలాగే జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712657888 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

ఏడుపాయల వన దుర్గ భవాని మాతనుదర్శించుకున్న జిల్లా కలెక్టర్ దంపతులు.

0

మంజీరా నదీ తీరాన వెలసిన అత్యంత మహిమాన్విత క్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం. కలెక్టర్

భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం
వన దుర్గ భవాని మాత

ఆ దుర్గామాత ఆశీస్సులతో జిల్లాలో ప్రజలందరూ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలి.

కలెక్టర్ దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ కార్యనిర్వాహణాధికారి, అర్చకులు,

ఏడుపాయల వన దుర్గ భవాని మాతనుదర్శించుకున్న జిల్లా కలెక్టర్ దంపతులు

మంజీరా నదీ తీరాన వెలసిన అత్యంత మహిమాన్విత క్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం అని.భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం
వన దుర్గ భవాని మాత అని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.ఏడుపాయల దుర్గామాతను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయ ఈవో వీరేశం, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారి పేర ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో ఏడుపాయల దుర్గా భవానీ దేవత యొక్క అత్యంత గౌరవనీయమైన మందిరంగా పేర్కొన్నారు . కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతూ ఈ ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు.మామూలు రోజుల్లో ఒక మాదిరిగా ఉండే భక్తుల రద్దీ ఆదివారాలలో అధిక సంఖ్యలో భక్తులు తాకిడికనుగుణంగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా భక్తులకు సౌకర్యాలు ఆలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రతంగా ఉంచడంలో నిర్వాహకుల సేవలను కలెక్టర్ కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఈవో వీరేశం సిబ్బంది శ్రీనివాస్,అర్చకులు పాల్గొన్నారు.

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య…

0

పాపన్నపేట,మార్చి,29,మెదక్ టుడే న్యూస్:మనస్థాపంతో ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం…గ్రామానికి చెందిన ఫిరంగి సత్యనారాయణ (50) కల్లు వ్యాపారం చేస్తూ జీవితం సాగిస్తున్నాడు.కాగా వారం రోజుల క్రితం ఈయన పెద్ద కూతురు ఎంగేజ్ మెంట్ జరిగింది.దీంతో త్వరలో పెళ్లి ఉండడంతో పెళ్లికి డబ్బులు లేక అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు.అప్పు ఎక్కడ దొరక్కపోవడంతో మనస్థాపం చెందిన అతను శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టూ పక్కల వెతకగా ఆదివారం ఉదయం సమయంలో గ్రామ రోడ్డు పక్కన పాడుబడిన రైస్ మిల్లులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని కనిపించాడు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి మృతుడి భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

చేగుంట లో తైబజార్ వేలం.

0

చేగుంట,మార్చి,28,మెదక్ టుడే న్యూస్:చేగుంట తైబ జార్ వేలం రూ. 24లక్షల0 5 వేల రూపాయలకి చేగుంట గ్రామానికి చింతల భూపాల్, దక్కించుకున్నారు. శనివారం చేగుంట గ్రామం పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ మండల పంచాయతీ అధికారి విజయపాల్, కార్యదర్శి వెంకటేష్, సర్పంచ్ సండ్రగు స్రవంతి, సతీష్, ఉపసర్పంచ్ రఫిక్, పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ తై బజార్ వేలం ప్రక్రియ నిర్వహించారు. గ్రా మానికి చెందిన 8 మంది వ్యక్తులు తైబజార్ వేలం లో పాల్గొనగా చింతాల భూపాల్, రూ.24 లక్షల 05 వేల రూపాయలకు వేలంపాటలో తై బజార్ దక్కించుకున్నారు. 2026 ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి 2027 మార్చి 31 వరకు ఈ తై బజార్ అమల్లో ఉండనున్నట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమంలో వా ర్డు సభ్యులు గ్రామ పెద్దలు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు

వికలాంగుల పెన్షన్ పెంచాలి టి ఆర్ వి ఎస్, మెదక్ జిల్లా అధ్యక్షుడు.

0

చేగుంట,మార్చి,28,మెదక్ టుడే న్యూస్:వికలాంగుల పింఛన్ రూ. 6000 రూపాయలు పెంచాలని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి (టిఆర్విఎస్) మెదక్ జిల్లా అధ్య క్షుడు మీర్ గియాజ్ ఉద్దీన్ డిమాండ్ చేశారు.అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వికలాంగుల పెన్షన్ 6000 పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా పెంపు ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. నిరుడు రాష్ట్ర వ్యాప్తంగా 44,49,767 మందికి పెన్షన్ రాగా, ప్రస్తుతం 42,80,129 మందికి మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తంచే శారు. పెన్షన్లు పెంచడానికి డబ్బులు లేవని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. గాంధీ కుటుంబానికి మాత్రం రూ.1000 కోట్లు ఏలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో వికలాంగుల పెన్షన్ల పెంపునకు నిధులను కేటాయించ లేదు అని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇందిరాపార్క్ వద్ద సామూహిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు ఇస్తామన్న పెన్షన్ పెంచి, ఉద్యోగ, ఉపాధి తో దివ్యాంగుల సమాజాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

అమీన్పూర్‌లో అంబరాన్నంటిన శ్రీరామనవమి వేడుకలు.

0

వేలాది మంది భక్తుల మధ్య కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం

అమీన్పూర్,మార్చి,27,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ గ్రామంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ పెద్దలు, భక్తుల ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణం కనుల పండుగగా సాగింది.

రామనామ స్మరణతో మార్మోగిన గ్రామం

అమీన్పూర్ హిందూ సమితి ఆధ్వర్యంలో రెండు రోజుల ముందే గ్రామం మొత్తం కాషాయమయమైంది. ప్రధాన రహదారులు, వీధులన్నీ కాషాయ జెండాలతో అలంకరించారు. “శ్రీరామ జయరామ” స్మరణతో అమీన్పూర్ ప్రాంతం మొత్తం భక్తిభావంతో పులకించిపోయింది. ముఖ్యంగా గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా ఏర్పాట్లు చేశారు.

భక్తులకు మహా అన్నదానం

కల్యాణ మహోత్సవం అనంతరం భక్తుల కోసం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 5,000 మందికి పైగా భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించినట్లు గ్రామ పెద్దలు వెల్లడించారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రామస్థులు, స్వచ్ఛంద సేవకులు పర్యవేక్షించారు.

వైభవంగా శోభాయాత్ర

సాయంత్రం వేళ నిర్వహించిన స్వామివారి శోభాయాత్ర భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో:

  • అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి.
  • మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కృష్ణ
  • గ్రామ పెద్దలు మరియు యువకులు పాల్గొన్నారు.

శోభాయాత్ర పొడవునా యువకులు “జై శ్రీరామ్.. జై శివాజీ” అంటూ చేసిన నినాదాలతో గ్రామం మొత్తం కాషాయ శోభను సంతరించుకుంది. భజనలు, కోలాటాలు, మంగళ హారతులతో గ్రామం పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు వైభవంగా సాగింది. భక్తిశ్రద్ధలతో ఈ వేడుకను విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు, యువతకు పెద్దలు ధన్యవాదాలు తెలిపారు…