ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలని లక్ష్యంతో ఈ ప్రభుత్వం పని చేస్తుంది. సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి.
చేగుంట,మే,3,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలో చేగుంటకు చెందిన వోడపల్లి చంద్రకళ శ్రీనివాస్, ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామ ఉపసర్పంచ్ నిరుడి లావణ్య శ్రీకాంత్ పెద్దశివునూరు గ్రామానికి చెందిన ముదాం నవనీత నాగరాజు , కుమ్మరి భాగ్యమ్మ , పెద్ద శివునూర్తాండాలో మాలోత్ పద్మ లక్ష్మణ్ ఇల్లు లను ప్రారంభించడం జరిగింది. చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చేగుంట మండలానికి సుమారుగా 650 ఇండ్లను మంజూరు చేయడం జరిగింది.ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలని లక్ష్యంతో ఈ ప్రభుత్వం పని చేస్తుంది. జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ ను సంప్రదించి రెండో విడతల మరిన్ని ఇండ్లను మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ దౌల్తాబాద్ ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య చేగుంట గ్రామ సర్పంచ్ సండ్రు స్రవంతి సతీష్ వడియారం గ్రామ సర్పంచ్ అంకన్న సాయికుమార్ గౌడ్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కురుమ లక్ష్మి , అన్నం ఆంజనేయులు, చేగుంట ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీ,యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్, పద్మా రెడ్డి, ప్రసాద్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు కార్యకర్తలు ఆగం, రాకేష్, సంతోష్, నరేష్, శ్రీను,తదితరులు పాల్గొన్నారు.
