📄 ePaper
Friday, September 18, 2026
ADS
HomeTelanganaఅప్పాజీపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గం.

అప్పాజీపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గం.

📰 Generate e-Paper Clip

ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చింతల భాగయ్య, ఉపాధ్యక్షులు కన్ని బోయిన నర్సింలు.

కొల్చారం,మే,26,మెదక్ టుడే న్యూస్:కొల్చారం మండలంలోని అప్పాజీపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామంలోని ముదిరాజ్ సంఘ సభ్యులు, పెద్దలు, యువత, ప్రముఖుల సమక్షంలో జరిగిన సమావేశంలో సంఘ భవిష్యత్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సామాజిక ఐక్యత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం ఏకగ్రీవ నిర్ణయంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.సంఘ అధ్యక్షులుగా చింతల భాగయ్య ముదిరాజ్, ఉపాధ్యక్షులుగా కన్నెబోయిన నర్సింహులు ముదిరాజ్, క్యాషియర్‌గా కన్నెబోయిన వేణు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా చింతల చంద్రశేఖర్ ముదిరాజ్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన నాయకులకు సంఘ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.నూతనంగా ఎన్నికైన సంఘ అధ్యక్షుడు చింతల భాగయ్య ముదిరాజ్ మాట్లాడుతూ, సంఘ సభ్యులందరి సహకారంతో ముదిరాజ్ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలో సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, యువతకు ప్రోత్సాహం, విద్యా మరియు సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు.
ఉపాధ్యక్షుడు కన్నెబోయిన నర్సింహులు ముదిరాజ్ మాట్లాడుతూ సంఘ సభ్యులందరూ ఐక్యంగా ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్తామని సంఘ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, సభ్యుల మధ్య సమన్వయం పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని సంఘ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటిస్తూ సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular