📄 ePaper
Friday, June 5, 2026
ADS
HomeTelanganaపాము కాటుతో బాలుడు మృతి.

పాము కాటుతో బాలుడు మృతి.

📰 Generate e-Paper Clip

కొల్చారం,మే,24,మెదక్ టుడే న్యూస్:పాము కాటుతో బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని వరిగుంతం గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన దండు సుజిత్ కుమారుడు దండు సతీష్ (7) శనివారం రాత్రి ఇంటి ముందు తన తాత మా అన్నయ్యతో కలిసి ఇంటి ముందు వాకిట్లో నిద్రించాడు. కాగా అర్ధరాత్రి సమయంలో బాలుని చేతి వేలుకు ఏదో కుట్టినట్లు అనిపించగా వెంటనే లేచి తండ్రికి తెలిపాడు. బాలుని తండ్రి సుజిత్ కుమారుని చికిత్స నిమిత్తం మెదక్ ఏరియా హాస్పిటల్ తరలించాడు. రాత్రి అక్కడ చికిత్స తీసుకుని, ఆదివారం మెదక్ ఎం సి హెచ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం బాలుడు మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని తర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular