(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్నగర్:మే,4,మెదక్ టుడే న్యూస్:
6వ వార్డు కౌన్సిలర్ డి. రాజు నాయక్ మరియు పుష్ప దంపతులకు వారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.సమాజ హితం కోసం నిరంతరం కృషి చేస్తూ, నిష్పక్షపాత ధోరణితో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న రాజు నాయక్ సేవలను ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు. ఆయనకు అండగా నిలుస్తూ ప్రేరణగా నిలుస్తున్న ఆయన సహచరి పుష్ప పాత్రను కూడా గుర్తుచేశారు.ఈ ప్రత్యేక సందర్భంలో వారి దాంపత్య జీవితం ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యాలతో నిండాలని సామాజికవేత్త, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు ఆకాంక్షించారు.
6వ వార్డు కౌన్సిలర్, రాజు దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
