చేగుంట,మే,4,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం చేగుంట సబ్ స్టేషన్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా విద్యుత్ భద్రత వారోత్సవాలు ఏఈ వెంకటప్ప రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యుత్ భద్రత వారోత్సవాల్లో భాగంగా మా విద్యుత్ సిబ్బందికి సేఫ్టీ కిట్లు పంపిణీ చేయడం జరిగింది . సేఫ్టీ కిట్లు అనగా హెల్మెట్ గ్లౌజులు ఎర్త్ రాడు వంటివి మా సిబ్బందికి ఇవ్వడం జరిగింది. వాటిని ఉపయోగిస్తూ ప్రజలకు మంచి సేవలు అందించాలని సిబ్బందికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఈ వెంకటప్ప రెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ రాములు, లైన్మెన్ కిష్టయ్య విద్యుత్ సిబ్బంది మరియు రైతులు పాల్గొనడం జరిగినది.
చేగుంట సబ్ స్టేషన్ లో విద్యుత్ భద్రత వారోత్సవాలు.
RELATED ARTICLES
