చేగుంట,ఏప్రిల్,19,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంనికి చెందిన చిక్కుడు మహేష్ ని ఆదివారం (ఆర్ టి ఐ ) సమాచార హక్కు చట్టం సాధన కమిటీ మెదక్ జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వ్యవస్థాపకుడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సందర్బంగా తనపై నమ్మకంతో జిల్లా కార్యదర్శి నియమించిన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్ కు. సుర స్రవంతి. మల్ల వెంకటేశం. రంగు మణిదీప్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ సంస్థ నియమ నిబకందనాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యాలయాలో అవినీతి నిర్ములనకు బాట సారధి గా నడుస్తానని అవినీతి పరులను బయటకు తీయడంతో పాటు సమాచార హక్కు చట్టం పై పౌరులకు విద్యార్థులకు అవగాహనా కలిగించేందుకు కృషి చేస్తానని మహేష్ పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మీడియా రంగంలో తనదైన శైలిలో ఎన్నో అవినీతి పరులని పట్టుబాట్టి వారికీ శిక్ష పడేలా చేసి ఎన్నో విజయాలను సాధించిన ఘనత ఉన్న వ్యక్తిగా అతని తోటి మీడియా మిత్రులు పేర్కొన్నారు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన వారికీ కృతజ్ఞతలు తెలిపిన జిల్లా కార్యదర్శి చిక్కుడు మహేష్

