📄 ePaper
Wednesday, March 11, 2026
ADS
HomeNewsబొల్లారంలో అక్రమ కట్టడాల కూల్చివేత: పార్కు స్థలం స్వాధీనం.

బొల్లారంలో అక్రమ కట్టడాల కూల్చివేత: పార్కు స్థలం స్వాధీనం.

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన గదుల నేలమట్టం

  • అక్రమార్కులపై ఉక్కుపాదం మోపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం
  • ఆక్రమణలు పునరావృతం కాకుండా ప్రహరీ గోడ నిర్మాణానికి ఆదేశం

అమీన్‌పూర్,మార్చి,10,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ సర్కిల్ – 47 పరిధిలోని బొల్లారం గ్రామం, అన్రిచ్ లేఅవుట్‌లో గల ప్రభుత్వ పార్కు స్థలాన్ని అధికారులు మంగళవారం ఆక్రమణదారుల నుండి విముక్తి చేశారు. సర్వే సంఖ్యలు 81 మరియు 84లో ఉన్న ఈ పార్కు స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రేకుల గదులను ప్రత్యేక బృందం విజయవంతంగా కూల్చివేసింది.

వివరాల్లోకి వెళ్తే:

గతంలోనే ఈ పార్కు స్థలాన్ని సంరక్షించడానికి అధికారులు చుట్టూ కందకాలు తవ్వి, ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. అయితే, ప్రభుత్వ చర్యలను లెక్కచేయని కొందరు దుండగులు పదేపదే కందకాలను పూడ్చివేయడం, కంచెను తొలగించడం చేస్తూ వచ్చారు. ఈ అక్రమాలపై స్థానిక పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ, అక్రమార్కులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నిర్మాణాలను కొనసాగించారు.

అధికారుల కఠిన చర్యలు:

ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్న విషయాన్ని గమనించిన ఉన్నతాధికారులు, మంగళవారం ప్రత్యేక బలగాలతో క్షేత్రస్థాయిలో పర్యటించారు. యంత్రాల సహాయంతో అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించి, భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్తులో తిరిగి ఆక్రమణలకు తావులేకుండా, పార్కు చుట్టూ శాశ్వత ప్రహరీ గోడ నిర్మించాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.

హెచ్చరిక:

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను, ప్రజా అవసరాల కోసం కేటాయించిన పార్కు స్థలాలను ఆక్రమిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments