📄 ePaper
Wednesday, March 11, 2026
ADS
HomeNewsపదవ తరగతిలో మెరుగైన ఫలితాలే లక్ష్యం కలెక్టర్..

పదవ తరగతిలో మెరుగైన ఫలితాలే లక్ష్యం కలెక్టర్..

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,డిసెంబర్,6, మెదక్ టుడే న్యూస్:

జిల్లాలో పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులు ‌ కష్టపడి చదువుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు.పాపన్నపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో 10వ తరగతి విద్యార్థులతో ‌ కలెక్టర్ ముచ్చటించి విద్యా సామర్థ్యాలను పరీక్షించిన అనతరం పలు సూచనలు సలహాలు అందించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతిలో మెరుగైన ఫలితాలు లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు ప్రతిష్ట ప్రణాళిక ద్వారా చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకుని పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments