•జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
పాపన్నపేట,డిసెంబర్,6, మెదక్ టుడే న్యూస్:
శనివారం పాపన్నపేట మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించారు.ఈసందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ,జిల్లాలో మొదటి పేజ్ ఎలక్షన్ల కోసం నామినేషన్ పూర్తయ్యాయని,ఆయా గ్రామాల్లో క్యాంపియన్ నడుస్తుందన్నారు.
మొదటి పేజ్ ఎన్నికల కోసం డిసెంబర్ 11 పోలింగ్ ఉన్నందున డిసెంబర్ 10 రోజున ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకోవాలని ఆదేశించారు.
మొదటి ఫేజ్ లో ఆరు మండలాలో సర్పంచి వార్డు సభ్యులకు జరిగే ఎన్నికలను అత్యంత పారదర్శకంగా జరగాలని తెలిపారు.మొదటి పేజ్ లో 14 గ్రామపంచాయతీల సర్పంచి, వార్డు సభ్యుల,ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తయిన కూడా ఆయా గ్రామాల్లో ఎన్నికల నియమావళి కొనసాగుతుందన్నారు.ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందని ఫిర్యాదులు అందితే ఫ్లైయింగ్ స్కాడ్ టీములు దర్యాప్తు చేసి ఎన్నికల నియమాల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో ఎన్నికల నియమాలు పాటించి నిబంధన మేరకే ప్రచారం చేయాలన్నారు.గ్రామాల్లో 100% ఓటింగ్ సాధించాలన్నారు.100% ఓటింగ్ జరిగిన గ్రామపంచాయతీలను ఘనంగా సన్మానించి ,ప్రత్యేక బహుమతులు అందిస్తామని తెలియజేశారు. ఓటింగ్ లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. డబ్బు ,మద్యం లాంటి ప్రలోభాలకు గురికాకుండా గ్రామ ,వార్డు అభివృద్ధికి ఎవరైతే తోడ్పడేవారు ఉంటారో వారిని నిజమైన సర్పంచ్ గా,వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు సిబ్బంది ఉన్నారు.


