📄 ePaper
Sunday, April 19, 2026
ADS
HomeNewsటీఎన్జీవో షాద్నగర్ తాలూకా ఎన్నికలు నిర్వహణ.

టీఎన్జీవో షాద్నగర్ తాలూకా ఎన్నికలు నిర్వహణ.

📰 Generate e-Paper Clip

(కరస్పాండెంట్ )
షాద్నగర్,ఏప్రిల్,18,మెదక్ టుడే న్యూస్:
షాద్నగర్ తాలూకాలోని పింఛనర్స్ భవన్‌లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్జీవో) తాలూకా స్థాయి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా శ్రీ పాలు బాయ్ ఈశ్వర్ వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా యూనియన్ నాయకులు శ్రీ శ్రీనివాస్, యశ్వంత్, రంగయ్య, ఆనంద్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో షాద్నగర్ తాలూకా టీఎన్జీవో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన సభ్యులు ఈ విధంగా ఉన్నారు:
అధ్యక్షుడు: జె. శ్రీనివాసులు (హెల్త్ ఎడ్యుకేటర్)
ప్రధాన కార్యదర్శి: శ్రీహరి (వీఆర్వో)
ముఖ్య సలహాదారు: శ్రీనివాసరాజు (లైబ్రేరియన్)
ఉపాధ్యక్షుడు: రాజశేఖర్ (ఫార్మసిస్ట్)
ఖజాంచీ: మహేందర్ గౌడ్
జాయింట్ సెక్రటరీ: డి. విజయలక్ష్మి (ఐసిడిఎస్)
పబ్లిసిటీ సెక్రటరీ: ప్రసన్నలత (సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం)
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు: ఎస్. రజని, ఎం. నరసింహ
అలాగే నామినేటెడ్ పోస్టులుగా హరీష్ రాజు, చరణ్‌లను ఎంపిక చేశారు.
ఎన్నికల అనంతరం ఎన్నికల అధికారి ఈశ్వర్ చేతుల మీదుగా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు జె. శ్రీనివాసులు మాట్లాడుతూ, ఎన్నికలు నిర్వహించిన జిల్లా మరియు కేంద్ర యూనియన్ నాయకులకు, అలాగే స్థానిక ఉద్యోగ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. టీఎన్జీవో అధ్యక్షుడిగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments